17/05/2026
_*ప్రశాంతమైన ఎమ్మిగనూరులో అలజడి సృష్టించడం మంచి పద్ధతి కాదు*_
- _రాజకీయ లబ్ధి కోసం కోతుల బావి ఆలయాన్ని వివాదాల్లోకి లాగుతున్నారు_
- _ఎమ్మెల్యేతో కూర్చుని శాశ్వత పరిష్కారం చూసుకోవాలి_
- _ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదు_
- _తనపై ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్ట దావా వేస్తా :- భాస్కర్ల చంద్రశేఖర్ గారు_
- _కూటమి నాయకులు ఆగ్రహం_
_*300 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన కోతుల బావి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం విషయమై కొందరు కావాలనే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని, సమస్యలను కేవలం చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని, రాజకీయ స్వార్థం కోసం రచ్చ చేయడం మంచి పద్ధతి కాదని కూటమి నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్ గారు, కురువ మద్దిలేటి, కామర్తి మిన్నప్ప, దామా నర్సింహులు, తొగట నరసింహులు, విజయలక్ష్మి, మాచాని మహేష్, రంగస్వామి గౌడ్, కల్లిముల్లా, బండా నర్సప్ప, రామకృష్ణ నాయుడు, చిన్న ఈరన్న, తెలుగు వెంకటేష్, రవిప్రకాష్, జటప్ప, అబ్దుల్లా, వినయ్ రాజేష్ లు పేర్కొన్నారు. ఆదివారం టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా అక్కడ ఉన్న డబ్బాలను ఖాళీ చేయించి, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని భావించినప్పుడు.. కొందరు నాయకులు అకస్మాత్తుగా దేవాలయంపై ప్రేమ నటిస్తూ రంగంలోకి దిగారని విమర్శించారు. ఇన్నాళ్లూ కనిపించని దేవాలయం ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందని వారు నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసమే పార్టీలు మారి వలస వెళ్లిన కొందరు నాయకులు, స్థానిక ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ ఈ దేవాలయం కేంద్రంగా అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా పట్టణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారిపై, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ గారిపై అనవసరంగా అసత్య ఆరోపణ చేయడం హాస్యస్పదంగా ఉందన్నారు. మీరు ఎవరొచ్చి అడిగినా ఏ దేవరానికైనా నిర్మాణానికి సహాయ సహకారాలు చేసే వ్యక్తుల గురించి ఇలాంటి ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. మాజీ కౌన్సిలర్లు మధుబాబు, దయ సాగర్, నాగేశప్పలు సొంతంగా దేవాలయ కమిటీ ఏర్పాటు చేసుకున్నారన్నారు. గతంలో ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శిల్పాలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టను వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆలయ కమిటీలు వేసుకుని డ్రామాలు ఆడుతున్నారని మాజీ కౌన్సిలర్ మధుబాబుపై విమర్శలు చేశారు. కోతుల బాబి స్థలం మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న చిన్న అంశమని దీన్ని వారు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి చర్చించి పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రజాక్షేత్రంలో రాజకీయాలు చేయాలి గాని.. దేవాలయాలన్నీ అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం ప్రజలు ఎవరు నమ్మరు అని తెలిపారు. వ్యాపారస్తుల వద్ద డబ్బులు తీసుకున్నట్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని, దమ్ముంటే ఆధారాలు నిరూపించాలని సవాల్ విసిరారు. రాజకీయాలు ప్రజాక్షేత్రంలో చేయాలి కానీ, దేవాలయాలను అడ్డుపెట్టుకుని చేసే రాజకీయాలను ప్రజలు నమ్మరని హితవు పలికారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.*_