16/03/2026
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగ ఈరోజు గౌరవ చైర్ పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ గారు, కమిషనర్ R వెంకటగోపాల్ గారి ఆధ్వర్యంలో, పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య వైద్య శిబిరం మరియు వైస్- చైర్ పర్సన్ గారి, పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా PPE కిట్ల పంపిణీ చేయడం జరిగినది.
అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి వైద్య పరీక్షలను పరిశీలించిన చైర్ పర్సన్ గారు, కమీషనర్ గారు మరియు పాలక వర్గ సభ్యులు అదేవిధముగా కమీషనర్ గారు కూడా వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగినది.
_చైర్పర్సన్ మరియు కమిషనర్ గారు మాట్లాడుతూ:_
"పట్టణ పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. అందుకే ఇకపై ప్రతి 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తాం అని తెలియజేసారు."
*పాల్గొన్నవారు:*
గౌరవ పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, మెప్మా RPలు మరియు మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
Venkat Gopal Chandana Gangishetty