26/11/2022
కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్, గ్రామదీప్ ఫౌండేషన్ మరియు సర్ సి. ఆర్. రెడ్డి పబ్లిక్ స్కూల్ సమ్యుక్త ఆధ్వర్యం లో ఈ రోజు, 26 నవంబర్ 2022 వ తేదీన పబ్లిక్ స్కూల్ లో విద్యార్ధులు- తల్లితండ్రులకు కూరగాయ నారుల అమ్మకం కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరటి తోటల అభివ్రుద్ధి ద్వారా ఆరోగ్యకర, సురక్షిత ఆహారాన్ని కుటుంబానికి అందించటం, పిల్లలకు చిన్ననాటి నుండే మొక్కల పెంపకం, హ్యాండ్స్ ఆన్ లర్నింగ్, సొంత ఆహారాన్ని పెంచుకోవటం లో బాధ్యత తీసుకోవటం వంటివి ఎన్నో విలువలు నేర్చుకోవటం లో ఈ కార్యక్రమం దోహదపడుతుంది. కమీషనర్ గారి కార్యాలయం, గ్రామదీప్ ఫౌండేషన్ మరియు ఏలూరు నగరం లోని విద్యాసంస్థలతో ఒప్పందం చేసుకుని ప్లాస్టిక్ రహిత ఏలూరు, సురక్షిత నీరు, ఆరోగ్యకర జీవనం కై చేస్తున్న పౌర ఉద్యమం లో నిర్వహిస్తున్న విభిన్న కార్యక్రమం
లో ఇది ఒకటి.
ఏలూరు నగర కమీషనర్, షాహిద్ షేక్ గారు, స్టాల్స్ ను సందర్శించి, కొన్ని నారులను వారి చేతుల మీదుగా విద్యార్ధులు- తల్కితండ్రులకు అందించారు. చేపట్టబోయే మరిన్ని విభిన్న కార్యక్రమాలను వివరించారు.
పాఠశాల విద్యార్ధులు, ముఖ్యం గా ఎన్.సి.సి విద్యార్ధులు ఈ కార్యక్రమ నిర్వహణ కమీషనర్ గారికి- గ్రామదీప్ కు తోడై, మంచి స్వచ్చంద సేవలు అందించి విజయవంతం చేసారు. ఇదే వేదిక వద్ద ప్లాస్టిక్ పైంకూడా అవగాహబ పోస్టర్ లు ప్రదర్శించారు. నాలుగవ తరగతి చదువుతున్న ప్రసస్థ తను చేసిన పేపర్ పెన్స్ ను ప్రదర్శించి, అమ్మకమూ చేయటమయినది. గ్రామదీప్ లో సభ్యురాలైన శ్రీమతి చళ్ళగుళ్ళ సత్యవాణి గారు మరియు, విద్యార్దులు విరాజ్- కణవ్ క్యాష్ కౌంటర్ వద్ద సేవలు అందించారు. సర్ సి. ఆర్. రెడ్డి యాజమాన్యానికి అభినందనలు. కొన్ని చేతి సంచులను ఈ వేదిక పై అమ్మటం జరిగింది.