JSPEluru

JSPEluru FB Page working for Leadership Promotion Wing for led by

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త పాటంశెట్టి సూర్యచంద్ర గారి ఆధ్వర్యంలో,  Sep 02 న  శ్రీ పవన్ కళ్యాణ్...
04/08/2020

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త పాటంశెట్టి సూర్యచంద్ర గారి ఆధ్వర్యంలో, Sep 02 న శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాటికి "జనసేన ఇంటిపంట" ద్వారా 50,000 కుటుంబాలకు విత్తనాల ప్యాకెట్లు పంచడమే లక్ష్యంగా, 02-08-2020 నాటికి 26 గ్రామాలలో పంపిణీ చేసిన మొత్తం విత్తనాల ప్యాకెట్లు 🌱 *34000* 🌱.
ఇప్పటి వరకు పంపిణీ చేసిన గ్రామాలలో ప్రతి ఇంటిదగ్గర 🌱ఆకుకూరలు🌱 🍆 కూరగాయలు 🍅 పండుతున్నాయి 🌱 ఈ సెలవుల్లో వారి ఇంటి దగ్గరే వ్యవసాయం చేయడం నేర్చుకొంటూ పండించడం విద్యార్థులకు ఒక ప్రాక్టికల్ లెస్సన్ అవుతుంది మరియు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆకుకూరలు, కూరగాయలు వారి కళ్ళముందే సేంద్రియఎరువుతో పండడం వల్ల కూరగాయలకు మార్కెట్లోకి వెళ్లకుండా ఉంటుందని, ఈ కష్టకాలంలో జనసేన సహకారం మరువలేమని ప్రజలు సంతోషంగా తెలుపుతున్నారు😍

పవన్ కళ్యాణ్ గారు, మీ ఆలోచనలు కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త విద్యా విధానం రూపొందించాము - జాతీయ మానవవనరుల శాఖ మంత్రి డా....
30/07/2020

పవన్ కళ్యాణ్ గారు, మీ ఆలోచనలు కూడా పరిగణనలోకి తీసుకుని కొత్త విద్యా విధానం రూపొందించాము - జాతీయ మానవవనరుల శాఖ మంత్రి డా. రమేష్ పొక్రియల్ గారు..

Union Cabinet Minister Dr.Nishank about Pawan Kalyan's views on education system...

పేదలకు అందని ఇళ్ళు - లబ్ధిదారులకు అందించేవరకూ ఉద్యమిస్తామంటున్న బిజెపి - జనసేన....గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాల ...
22/07/2020

పేదలకు అందని ఇళ్ళు - లబ్ధిదారులకు అందించేవరకూ ఉద్యమిస్తామంటున్న బిజెపి - జనసేన....

గత టిడిపి, ప్రస్తుత వైసిపి ప్రభుత్వాల వల్లే నిరుపేదలకు కేంద్రం ఇస్తున్న ఇళ్ళు చేరటంలేదని ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశంతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన, బిజెపి పార్టీలు సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాయి.

ది 22-07-2020, బుధవారం ఉ. 10 గం.కు స్తానిక పోణంగి రోడ్డులోని పేదలకు నిర్మించిన 6400 ఇళ్ళ PMAY హౌసింగు కాలనీ వద్ద జరిగిన "ధర్నా" కార్యక్రమానికి స్తానిక జనసేనపార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు మరియూ జనసైనికులు, పెద్దఎత్తున వచ్చి పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి జన సైనికుడు విధిగా మాస్కును ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తూ పాల్గొనటం జరిగింది.

కేంద్రంలో బిజెపి పార్టీ వచ్చిన తరువాత ఇళ్లులేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో మనరాష్ట్రానికి 3 లక్షల 10 వేల ఇళ్లకు 22 వేల కోట్ల రూపాయలలో 10 వేల 700 కోట్లను గత టిడిపి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ ఇళ్ళ నిర్మాణం సక్రమంగా జరగలేదు కానీ, ఇళ్లను నిర్మించినట్టు చెప్పుకుంటున్న గత టిడిపి ప్రభుత్వం మరి లబ్ధిదారులకు ఎందుకు పంచలేదో చెప్పాల్సిన అవసరం ఉందని జనసేన బిజెపి పార్టీలు సంయక్తంగా ప్రశ్నించాయి.

ప్రస్తుత ప్రభుత్వం పేదలకు కట్టించిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా 14 నెలలుగా నిర్లక్ష్యంచేస్తూ రావడంతో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర నలుమూలలా కట్టిన 241368 గృహాలను లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో కాలనీలన్నీ గడ్డి మొక్కలు మొలిచి అడవులను తలపిస్తున్నాయి. నిర్మించిన బిల్డింగులు అన్ని శిథిలావస్థకు చేరుకుని పాములకు, జంతువులకూ ఆవాసాలుగా మారుతున్నాయి.

ఈ విధమైన పీఎంఏవై స్కీమ్ ద్వారా నిర్మించబడిన బిల్డింగులు మూడు కేటగిరీలుగా నిర్వహించబడ్డాయి 300 చ.అడుగులు 365 చ.అడుగులు , 430 చ.అడుగులుగా ఉన్న ఈ బిల్డింగులు 6:50 లక్షలు , 8 లక్షలు , 9 లక్షల రూపాయలుగా నిర్ణయించబడినవి. వాటికి సంబంధించి కేంద్రం 1 .5 లక్షల రూపాయలు, రాష్ట్రం 1 లక్ష రూపాయలు, మిగిలినవి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అతని పేరున కంట్రిబ్యూషన్ గా బ్యాంకు నుంచి రుణం ఇప్పించడం జరిగింది.

మరి ఈ నిర్మించబడిన గృహాలను లబ్ధిదారులకు సమయానికి ఇవ్వకపోతే వారు ఆ రుణానికి సంబంధించిన అసలును, వడ్డీలను కట్టుకుంటూ ఒకవైపు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతూ మరోవైపూ నలిగిపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వారి ఇబ్బందులను గమనించి వారికి తొందరగా ఆ గృహాలను ఇవ్వవలసిందిగా జనసేన బిజెపి పార్టీలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.

ఈ విషయం మీద చర్య తీసుకోనకపోతే లబ్ధిదారుల న్యాయం కోసం జనసేన బిజెపి పార్టీలు ఇంకా గట్టిగా ఉద్యమిస్తామని స్తానిక జనసేనపార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పలనాయుడు తెలియజేసారు. ఈ ధర్నా కార్యక్రమంలో నగర అద్యక్షుడు నాగిరెడ్డి కాశీ నరేష్, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీసాగర్, మరియు బొండా రాము, పి.లక్ష్మణ్ రావు, ములికి శ్రీనివాస్, భాస్కర్, వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, నాని, దిలీష్, ప్రకాష్, వెంకటేష్, రాకేష్, చందు, ధీరు, రమేష్, చిరంజీవి, సాయికుమార్, పండు తదితరులు పాల్గొన్నారు.

ఇట్లు: జనసేన పార్టీ కార్యాలయం. ఏలూరు. Pawan Kalyan JanaSena Party JanaSena Shatagni JanaSena Veera Mahila

జీ +3 లబ్దిదారులకు న్యాయం జరిగే వరకు బీజేపీతో కలసి పోరాటం - జనసేన పార్టీ...
21/07/2020

జీ +3 లబ్దిదారులకు న్యాయం జరిగే వరకు బీజేపీతో కలసి పోరాటం - జనసేన పార్టీ...

లక్షల సంఖ్యలో యువతని రాజకీయాల పట్ల అవగాహన కల్పించి మార్పు వైపు అడుగులు వేయించారు, ఇదే మీరు సాధించిన గొప్ప విజయం!ఒకసారి ఓ...
14/07/2020

లక్షల సంఖ్యలో యువతని రాజకీయాల పట్ల అవగాహన కల్పించి మార్పు వైపు అడుగులు వేయించారు, ఇదే మీరు సాధించిన గొప్ప విజయం!

ఒకసారి ఓడిపోతే పార్టీలు మార్చే రాజకీయ నాయకులం కాదు, చచ్చేంత వరకు మంచి కోసం మీ వెంట నడిచే జనసైనికులం!!
Pawan Kalyan JanaSena Party

జగ్గంపేట జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్  పాటంశెట్టి సూర్యచంద్రగారు "జనసేన ఇంటిపంట" అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు,ఈ కార్యక...
14/07/2020

జగ్గంపేట జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రగారు "జనసేన ఇంటిపంట" అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు,ఈ కార్యక్రమంలో భాగంగా గోకవరం మండల పార్టీ అధ్యక్షుడు ఉంగరాల మణిరత్నం ఆధ్వర్యంలో ఈ రోజు(13-07-2020) గంగంపాలెం గ్రామములో 500 విత్తనాల ప్యాకెట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉంగరాల మణిరత్నం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనేదే జనసేన ఉద్దేశమని, అలాగే కరోనా నివారణలో భాగంగా ప్రతి ఒక్కరూ మస్క ధరించి సామాజిక దూరం పాటించాలని ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగంపాలెం గ్రామ జనసైనికులు ఉంగరాల దుర్గాప్రసాద్, ఆడారి అప్పలరాజు, అరిసపు విజయకాంత్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. JanaSena Party Pawan Kalyan JanaSena Shatagni

జనసేన మరో వినూత్న అడుగు...విజయవాడ 46 వ డివిజన్లో జనసేన కార్పొరేటర్ అభ్యర్ది షేక్ షర్మిలా, అమీర్ భాషా దంపతులు 200 కుటుంబా...
13/07/2020

జనసేన మరో వినూత్న అడుగు...

విజయవాడ 46 వ డివిజన్లో జనసేన కార్పొరేటర్ అభ్యర్ది షేక్ షర్మిలా, అమీర్ భాషా దంపతులు 200 కుటుంబాలకు సంవత్సరం పొడవునా నాణ్యమైన నిత్యావసరాలను అందజేసే కార్యక్రమానికి జనసేన అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతినెల అందుతున్నాయో లేదో గుర్తించడానికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వడం జరిగింది. 🙏🏻🙏🏻🙏🏻 JanaSena Party Pawan Kalyan JanaSena Shatagni Pothina Venkata Mahesh

జనసేన పార్టీ  రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కూసంపూడి శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. JanaSena Party ...
10/07/2020

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ కూసంపూడి శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. JanaSena Party Srinivas Kusampudi JanaSena Shatagni

ప్రియమైన జనసైనికులందరు నిబంధనలకు కట్టుబడి నియంత్రణతో వ్యవహరిస్తూ పార్టీని ప్రజలలోకి తీసుకెళ్ళేలా పని చేయాలనీ విజ్ఞప్తి చ...
09/07/2020

ప్రియమైన జనసైనికులందరు నిబంధనలకు కట్టుబడి నియంత్రణతో వ్యవహరిస్తూ పార్టీని ప్రజలలోకి తీసుకెళ్ళేలా పని చేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాం. - జనసేన పార్టీ...
JanaSena Party Pawan Kalyan JanaSena Shatagni JanaSena Veera Mahila

పద్మశ్రీ, వనజీవి శ్రీ దరిపెల్లి రామయ్య గారి స్పూర్తితో మొక్కలు నాటుదాం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం అవుదాం - జనసేన ప...
08/07/2020

పద్మశ్రీ, వనజీవి శ్రీ దరిపెల్లి రామయ్య గారి స్పూర్తితో మొక్కలు నాటుదాం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములం అవుదాం - జనసేన పార్టీ

JanaSena Party JanaSena Shatagni

జనసైనికులు, వీరమహిళలు కోవిడ్ లో  #జనసేవ చేయండి, కానీ మీరూ మీకుటుంబం కోవిడ్ బారిన పడకుండ తగిన జాగ్రత్తలు తీసుకోండి.విశాఖ ...
04/07/2020

జనసైనికులు, వీరమహిళలు కోవిడ్ లో #జనసేవ చేయండి, కానీ మీరూ మీకుటుంబం కోవిడ్ బారిన పడకుండ తగిన జాగ్రత్తలు తీసుకోండి.

విశాఖ జిల్లా వీరమహిళ శ్రీమతి శారానీదేవికి కొవిడ్ సోకింది! త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము...

కేంద్రం పేదవారికి ఆహారభద్రత కల్పించింది. కోవిడ్ నిబంధనలు పాటించండి ...

JanaSena Party Pawan Kalyan JanaSena Shatagni

మంచివాడి మాటలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి...మంచివాడి అభినందనలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి...మంచివాడి మనసు ఎంత గొప్పగా ఉంటుంది ...
03/07/2020

మంచివాడి మాటలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి...
మంచివాడి అభినందనలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి...
మంచివాడి మనసు ఎంత గొప్పగా ఉంటుంది అంటే, మంచి ఎక్కడ ఉన్న ఎవరు చేసిన అభిమానంతో అభినందించే అంతలా.... Pawan Kalyan JanaSena Party

Address

Eluru

Alerts

Be the first to know and let us send you an email when JSPEluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to JSPEluru:

Share