జనసేన 'చిత్తూరు జిల్లా'

జనసేన 'చిత్తూరు జిల్లా' place of chittoor janasainiks

02/04/2026

రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన జగన్ రెడ్డి తీరా అధికారం పోయాక ఇప్పుడు రాజ్యాంగం లో రాజధాని విషయం లేదు అని చెప్పడం విడ్డూరం హాస్యాస్పదం:

#కంచన_శ్రీకాంత్
#గల్ఫ్_జనసేన_కన్వీనర్

22/03/2026

మేమంతా మీతో ఉన్నాం, ఆందోళన వద్దు- పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం తొందరలో కుదుటపడుతుందని ఆశిస్తున్నా- గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారితో వర్చువల్ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ Naga Babu గారు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారికి ఏ విధమైన ఆపద వచ్చినా జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవ్వరూ ఏ విధమైన ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగువారితో - ఆదివారం ఏపీ టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు నేతృత్వంలో జరిగిన వర్చువల్ సమావేశంలో శ్రీ కె.నాగబాబు గారు మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంలో చిక్కుకుని ఆందోళనకు గురవుతున్న తెలుగు ప్రజలు, జన సైనికులు, వీర మహిళలతో శ్రీ నాగబాబు గారు మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. ప్రస్తుతం ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణం సాధ్యమైనంత తొందరలో కుదుటపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన వేలాదిమంది తెలుగు ప్రజలు నిత్యం ఒకరికొకరు పలకరించుకుంటూ ఎటువంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే విధంగా ఉండాలని అన్నారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రయిన్ దేశాల నుండి వర్చువల్ సమావేశంలో హాజరైన ప్రతి ఒక్కరి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితి ఆందోళనకరంగా, ఆర్థికపరమైన నష్టాలు ఉన్నప్పటికి మానసికంగా దృఢంగా ఉన్నట్లు వారు తెలిపారు. తట్టుకోలేనంత భయానక పరిస్థితులు లేవని బదులిచ్చారు. అందరూ బాగుండాలని శ్రీ నాగబాబు గారు ఆకాంక్షించారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడితే, జనసేన పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంటుందని అన్నారు.

25/02/2026

26వ తేదీ నుంచి జనసేన ఉద్యమి సభ్యత్వ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఉద్యమిద్దాం…

#కంచన_శ్రీకాంత్
#జనసేన_గల్ఫ్_కన్వినర్



JanaSena Party

03/02/2026

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి
ఇది ఆరోపణ కాదు..
సిట్ నిర్ధారించిన వాస్తవం..
భక్తుల విశ్వాసంతో ఆడుకున్న వారికి శిక్ష తప్పదు...

భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు విచారణ చేపట్టారు,
#జనసేన_గల్ఫ్_జాతీయ_కన్వీనర్ #శ్రీ_కంచన_శ్రీకాంత్ గారు కువైట్ నుంచి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలన కాలంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన విషయం సిట్ దర్యాప్తులో పూర్తిగా నిర్ధారణ అయ్యిందని స్పష్టం చేశారు. సిట్ నివేదిక ప్రకారం, లడ్డూ తయారీలో వాడిన నెయ్యి పాలతో సంబంధం లేకుండా రసాయనాలతో తయారైన సింథటిక్ నెయ్యి అని, అందులో జంతు కొవ్వు నుంచి ఉత్పన్నమైన రసాయనాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారని తెలిపారు. మోనోగ్లిజరైట్స్, లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్, బీటా కెరోటిన్, పామ్ కెర్నల్ ఆయిల్ వంటి రసాయనాలతో నెయ్యి తయారుచేసి సుమారు 20 కోట్ల లడ్డూలు రూపొందించారన్నారు. 2019–2024 మధ్య టిటిడికి నెయ్యి సరఫరా కాంట్రాక్టుల్లో తీవ్రమైన అవినీతి చోటుచేసుకుందని, డెయిరీ వ్యాపారం లేని సంస్థలకు నిబంధనలు మార్చి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు. ఈ కేసులో పలువురు నిందితులుగా గుర్తించబడ్డారని, హవాలా మార్గంలో రూ.12.55 కోట్ల అక్రమ లావాదేవీలకు ఆధారాలు లభించాయని చెప్పారు. వాస్తవాలు బయటపడుతుండటంతోనే వైసీపీ నాయకులు ఎదురుదాడులకు దిగుతున్నారని విమర్శించారు. పవిత్ర ప్రసాదాన్ని అపవిత్రం చేసిన ఈ ఘోర అపచారానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు, ఈ సమావేశంలో గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ శ్రీ కంచన శ్రీకాంత్ గారితో పాటు బాణపతి రామచంద్రనాయక్ గారు,పగడల అంజన్ కుమార్ గారు, జగిలి ఓబులేసు గారు, అల్లం ప్రేమ్ కుమార్ గారు, చవ్వకుల రెడ్డిమణి గారు, కొమ్మినేని బాలాజీ,చలపతి గారు తదితరులు పాల్గొన్నారు.

Ram Talluri

22/05/2025
As you know, the JSP WestGodavari page was hacked on May 7th last year. After many attempts, the page was recov...
22/04/2025

As you know, the JSP WestGodavari page was hacked on May 7th last year.

After many attempts, the page was recovered.

They need your unwavering support...

Thank You

ఈ కింద తెలుపబడిన వ్యక్తి పార్టీ శ్రేయోభిలాషులను అభిమానులను ఎన్నారై లను సాధారణ కార్యకర్తలను.ఆన్లైన్ లో గతంలో ఎప్పుడో జరిగ...
02/08/2024

ఈ కింద తెలుపబడిన వ్యక్తి పార్టీ శ్రేయోభిలాషులను అభిమానులను ఎన్నారై లను సాధారణ కార్యకర్తలను.

ఆన్లైన్ లో గతంలో ఎప్పుడో జరిగిన సంఘటనను ఇప్పుడు జరిగిన విషయంగా చూపిస్తూ వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న విషయం పార్టీ దృష్టికి వచ్చింది.

దయచేసి ఇలాంటి వారిని ప్రోత్సహించి మోసపోకండి.

Address

Chittoor

Website

Alerts

Be the first to know and let us send you an email when జనసేన 'చిత్తూరు జిల్లా' posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share