16/02/2025
అందరికీ నమస్కారం 🙏
మీ అందరి కోసం ముఖ్య సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుంది...
✅ మహాశివరాత్రి పర్వదినాన మన కావూరు గ్రామంలో జరిగే వేడుకలు వివరాలు...
✅23th అనగా మొదటి రోజు ఉదయం 5 గంటల నుండి ప్రభ బండి ఊరేగింపుగా వినాయక గుడికి తీసుకొని వెళ్ళి పూజా కార్యక్రమం జరుగును, సాయంత్రం 6 గంటల నుండి ప్రభను అడ్డిల మీదకి లేపడం జరుగుతుంది.
✅24th అనగా రెండవ రోజు 8 గంటల నుండి ప్రభను పైకి లేపడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 8 గంటల నుండి Suraj ఈవెంట్స్ వారిచే మొదటి ప్రోగ్రాం జరుపబడుతుంది..
✅25th అనగా మూడవ రోజు ఉదయం 7 గంటల నుండి లింగంగుంట్ల శివాలయం నుండి స్వామివారిని,నందీశ్వరుని,పంచలోహాలతో చేపించిన ప్రభను ఊరేగింపుగా ప్రభ వద్దకు తీసుకొచ్చి వీరబద్రుని వీరంగంతో, తప్పెట్లు,తీన్మార్, DJ ధ్వనులతో స్వామివారికి కుంభం పోసిన అనంతరం ప్రభ కోటప్పకొండ బయలుదేరుతుంది ..
✅26th అనగా నాల్గవ రోజు మహాశివరాత్రి పర్వదినాన మధ్యాహ్నం 2 గంటల లోపు ప్రభను నిధిలో చేర్చి అదే రోజు సాయంత్రం కోటి కాంతులతో కోటప్పకొండ వద్ద జాగరణ అనంతరం ఉదయం 3 నుండి నందీశ్వరుని తీసుకొని ఆ త్రికోటేశ్వరుని వద్ద అభిషేకం అనంతరం 6 గంటలకు మళ్ళీ ప్రభ వద్దకు రావడం జరుగుతుంది.
✅27th అనగా ఐదవ రోజు కోటప్పకొండ నిధిలో నుండి బయలుదేరి తిరిగి రాత్రి 12 గంటల లోపు ప్రభ గ్రామానికి చేరుకుంటుంది.
✅ఈ తేదీలలో జరగబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల అందరూ పాల్గొని కోటయ్య స్వామి కృపకు పాత్రులు కాగలరు..
జై శ్రీ త్రికోటేశ్వర 🙏
ఓం నమః శివాయ 🙏