Radical Roasts

Radical Roasts Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Radical Roasts, Political Party, Chennai.

పాతిక సంవత్సరాలు...ఒక హాస్పిటల్ పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఎందుకు అంత buzz అని అడగొచ్చు. కానీ, అది ఒక హాస్పిటల్ క...
22/06/2025

పాతిక సంవత్సరాలు...

ఒక హాస్పిటల్ పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఎందుకు అంత buzz అని అడగొచ్చు. కానీ, అది ఒక హాస్పిటల్ కాదు, తెలుగు నేల మీద ఏ కుటుంబం కూడా, తన లానే కుటుంబ పెద్దని దూరం చూసుకునే దురదృష్టం రాకూడదు అని ఒక మహానుభావుడు మొదలుపెట్టిన మహా యజ్ఞం అది.

1985 నందమూరి బసవ తారకం గారు క్యాన్సర్ తో దూరం అయిన తరువాత, ఇంటి పెద్దగా ఆవిడ లేని లోటు చూసి తెలుగు నాట ఎవరికి అలాంటి ఇబ్బందులు రాకూడదు అని, ఎన్టీఆర్ తలపించారు. అందుకే తరువాత సంవత్సరమే ఆవిడ పేరు మీద క్యాన్సర్ కి వ్యతిరేకంగా పోరాడడానికి ఒక సంస్థ పెట్టీ, దాని అధ్వర్యంలో ఒక హాస్పిటల్ పెట్టాలని, అందులో వ్యక్తికి వచ్చిన క్యాన్సర్ ను చూడాలి తప్ప, అతని అంతస్తులు కాదని, ఏ పేద తెలుగింటి లోగిలి కూడా తన మాదిరి కుటుంబంలో ముఖ్యమైన వారిని కోల్పోయే అవకాశం రాకూడదని, అనాటికి తక్కువ మంది క్యాన్సర్ ను ట్రీట్ చేసే డాక్టర్లే ఉన్నా సరే, అమెరికాకి వెళ్ళి అక్కడి తెలుగు వారిని కదిలించి, అక్కడ సెటిల్ అయిన డాక్టర్లను ఇండియా రావడానికి ఒప్పించి హాస్పిటల్ కి అంకురార్పణ చేశారు.

అప్పటి నుంచీ మొదలు పెడితే 2000 నాటికి హాస్పిటల్ నిర్మాణం పూర్తయి, నాటి ప్రధానమంత్రి వాజపేయి చేతుల మీదగా హాస్పిటల్ ప్రారంభం అయింది. ఆనాటికి క్యాన్సర్ వస్తే ఆశలు వదిలేసుకునే పరిస్థితి నుంచీ, నేటికి "క్యాన్సరా? బసవతారకం హాస్పిటల్ ఉంది, అంతా బాలయ్య చూసుకుంటాడు, మరేం పర్లేదు" అనే స్థాయికి తెలుగు ప్రజలలో ఒక భావన తీసుకుని వచ్చిన క్రెడిట్ మాత్రం ఈ హాస్పిటల్ దే.

అలా అని కేవలం హాస్పిటల్ పెట్టీ చికిత్స మాత్రమే కాదు, క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమాలు, తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ టెస్టులు, పేద వారి కోసం అతి తక్కువ ఖర్చు లేదంటే అసలు ఖర్చు లేకుండా వైద్యం చేయడం ఇలా ఒక రకంగా క్యాన్సర్ మీద ఆ ఫౌండేషన్ ఒక యుద్ధమే చేసింది.

అందుకే గత 4 సంవత్సరాలుగా టాప్ హాస్పిటల్ గా అవార్డులు తెచ్చుకుంటుంది. తెలుగు రాష్ట్రాలే కాదు జాతీయ స్థాయిలో ఆ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మీద చేసిన కృషి అనిర్వచనియం.

చిన్న ఉదాహరణ చెప్తే ఆ హాస్పిటల్ గొప్పదనం అర్ధం అవుతుంది. అది 2011 రోజులు, కేంద్రంలో యుపిఏ ప్రభుత్వం ప్రభ వెలుగుతున్న రోజులు, అప్పట్లో సోనియా గాంధీకి ఎదురు లేదు, అప్పటికి ప్రపంచంలో శక్తివంతమైన మహిళలలో మొదటి 5 మందిలో సోనియా గాంధీ ఒకరు. ఆవిడకి క్యాన్సర్ వ్యాధి వచ్చి, సర్జరీ చేయాలి, దేశంలో ఆవిడ మాటకి ఎదురు లేదు, ప్రపంచ దేశాలు కూడా సోనియా కోసం ఎదురుచూస్తున్న టైంలో ఆవిడ సర్జరీ చేసింది ఈ హాస్పిటల్ మనిషి(నోరి దత్తాత్రేయ గారు, హాస్పిటల్ ట్రస్టీ). అది ఈ హాస్పిటల్ గొప్పదనం.

NBTR హాస్పిటల్ ఇప్పుడు ఇలా ఉండడానికి కారణం చాలా మంది దాతలు, అక్కడి డాక్టర్లు, సిబ్బంది అంతా. కానీ మూల స్తంభాలుగా చెప్పుకోవాల్సింది మాత్రం
మొదటిగా ఫౌండేషన్ స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరు క్యాన్సర్ కారణంగా కుటుంబాన్ని పోగొట్టుకుని బాధ పడకూడదు అనుకున్న స్వర్గీయ ఎన్టీఆర్ గారు,

తరువాత అప్పటికి అమెరికాలో లీడింగ్ సర్జన్ గా ఉండి, తెలుగు ప్రజలకి చౌకగా వైద్యం అందాలని కోరుకున్న డాక్టర్. తులసి పోలవరపు గారి కుటుంబం( ఫౌండేషన్ కోసం వైద్యులను ఏకం చేయడం, నిధుల సేకరణ చేయడం లాంటివి చేసి హాస్పిటల్ స్కెలిటన్ లో ముఖ్య పాత్ర ఆవిడది)

స్వతహాగా డాక్టర్ అయి, పేద ప్రజలకు చౌక వైద్యం అందడం, దాని ప్రాముఖ్యత తెలిసి హాస్పిటల్ అడుగులు వేస్తున్న సమయం నుంచి హాస్పిటల్ ను తన సొంత మనిషిలా చూసుకునీ, ఈ రోజున హాస్పిటల్ ఇలా ఉండడానికి మరో మూల కారణం అయిన ఒకప్పటి హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, అమెరికాలో మంచి పొజిషన్లో ఉండి కూడా ఈ హాస్పిటల్ కోసం వచ్చిన నోరి దత్తాత్రేయ గారు

ఇక కోడెల గారి నుంచీ బాలయ్య కి ట్రాస్ఫర్ జరిగే క్రమంలో మధ్యలో హాస్పిటల్ కానీ, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కాని మధ్యలో ఎక్కడా ఇబ్బందులు పడకుండా చూసుకున్న కాకర్ల సుబ్బారావు గారు

గత పదేళ్లుగా తన తండ్రి గారు మొదలుపెట్టిన పనిని మరింత ముందుకు తీసుకుని వెళ్తున్న నందమూరి బాలకృష్ణ గారు.

ఇటీవల కొత్త కొత్త హాస్పిటల్స్ వస్తున్నా సరే, ఇక ముందు కూడా ఈ హాస్పిటల్ తెలుగు నాట క్యాన్సర్ చికిత్స విషయంలో ధ్రువతారగా ఉండాలని, హాస్పిటల్ కానీ, ఆ ఫౌండేషన్ కానీ వ్యవస్థాపక మూల కారణాన్ని మరచిపోకుండా ముందుకు వెళ్లాలని, సిల్వర్ జూబ్లీ వేడుకలు కాదు, ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోవాలని ,

చివరగా కుల, మత , ప్రాంత, రాజకీయ, సినీ వైషమ్యాలతో అన్యాపదేశంగా తనని ద్వేషించినా సరే వారి ఒంట్లో కేన్సర్ ను తన మన చూడకుండా నిర్మూలించిన, నిర్ములిస్తున్న, నిర్ములించబోయే బంగారు బాలయ్యకి మరింత శక్తిని ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
-
టీమ్ రాడికల్స్

ఎవరన్నారు మీరు లేరనికొండలు చీల్చుకుంటూ పారి, గొంతులు తడిపే తెలుగుగంగలో ఉన్నారు.గుండె లోతుల్లో నుంచీ పలికే జై తెలుగుదేశం ...
18/01/2025

ఎవరన్నారు మీరు లేరని

కొండలు చీల్చుకుంటూ పారి, గొంతులు తడిపే తెలుగుగంగలో ఉన్నారు.
గుండె లోతుల్లో నుంచీ పలికే జై తెలుగుదేశం నినాదాల్లో మీరే ఉన్నారు.
తరాల తలరాతలు మార్చిన సంతకాల్లో మిరే ఉన్నారు.
ఆ సంతకాల కారణంగా సంతోషంతో కూడిన నవ్వుల్లో మీరే ఉన్నారు.
ఇప్పటికీ ఢిల్లీని ఢీ కొట్టాలనే ధైర్యంలో మిరే ఉన్నారు.
ఎప్పటికీ మాకున్న అన్నగారిగా మిరే ఉంటారు.

మీరిచ్చిన ఆడబిడ్డలకి ఆస్తిలో వాటా ఈరోజు పార్లమెంటు సీట్లలో వాటా దాకా వెళ్ళింది.
బడుగుల గుండెల్లో మీరు నింపిన ధైర్యం ఈరోజు అధికారంలో వాటా దాకా వెళ్ళింది.
నడిచొచ్చిన ఆత్మగౌరవానికి ఆరడుగుల రూపం మీరు,
నిలబెట్టాల్సిన తెలుగు ఖ్యాతికి నిండైన రూపం మీరు,
సడి చచ్చిన మా తెలుగు నేలకు మళ్ళీ పుట్టాల్సిన అవసరం మీరు.

మీకు కులం అద్దాలని, ప్రాంతం అద్దాలని, కళంకం అద్దాలని చూసే కుక్కలు తెలుగు నేల మీద చాలా వున్నాయి, అవి మిముల్ని చూడాలన్నా సరే, మీరు పెట్టిన హుస్సేన్ సాగర్ లో బుద్ధిడిని చూసినట్టు మీకోసం మెడ నిక్కించి చూడాల్సిందే.

ఒక మనిషి బాగా బతికాడు, రాజులా వెళ్ళిపోయాడు అని ఎప్పుడు చెప్పగలం? ఉన్నన్ని రోజులు కాదు, ఆ మనిషి లేకపోయినా సరే, మొదలుపెట్ట...
17/11/2024

ఒక మనిషి బాగా బతికాడు, రాజులా వెళ్ళిపోయాడు అని ఎప్పుడు చెప్పగలం?
ఉన్నన్ని రోజులు కాదు, ఆ మనిషి లేకపోయినా సరే, మొదలుపెట్టిన పనులు, చేసిన పనులు ఇంకా ప్రజలకి మంచి చేస్తుంటే, భవిష్యత్తు తరాలకు పాఠాలు చెప్తుంటే అప్పుడు చెప్పొచ్చు.

చెరుకూరి రామోజీరావు గారు.చెప్పాలంటే తెలుగు ప్రజలకు అత్యంత నమ్మశక్యం అయిన వార్తలు అందించే ఈనాడు,ఈటీవీ అయినా, విదేశాల్లో ఉన్నా సరే నమ్మకంగా తెలుగు పచ్చళ్ళ కోసం వెతికే ప్రియా పచ్చళ్ళు అయినా, కొడుకు చదువుకోసం లేదా కూతురు పెళ్ళి కోసం సామాన్య ప్రజలు డబ్బులు దాచుకునే మార్గదర్శి అయినా, ఇలా తెలుగు ప్రజల కోసం ఆయన చేసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇవి అన్నీ కూడా అందరికీ తెలిసిందే.

70ల్లో అప్పటికి జనాలకి అర్ధం కాని భాషల్లో వచ్చే పత్రికలను కాదని, వార్తలు అంటే సామాన్య ప్రజలకు అర్ధం అయ్యేలా ఉండాలని సామాన్య ప్రజల భాషలో మొదలుపెట్టిన ఈనాడు, ఇప్పటికీ కూడా ప్రజల గొంతు అయింది.

80ల్లో గవర్నర్ పదవి అడ్డంపెట్టుకుని, కేంద్రం రాష్ట్ర ప్రయోజనాల మీద కేంద్రం చేసిన దూరగతాల మీద ఆయన చొరవ తీసుకుని చేసిన పోరాటం తర్వాత కాలంలో ప్రభుత్వాలని మార్చింది.

ఇకపోతే 90ల్లో గ్రామాల్లో ప్రభలిన సారా మీద ఈనాడు వేదికగా రామోజీరావు గారు చేసిన యుద్ధం విలువ ఇప్పటి తరాలకు ఎలా చెప్తే అర్ధం అవుతుంది. ఆరోజున ఒక్కడే నిలబడి, ప్రభుత్వానికి, సారాకి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం తర్వాత కాలంలో 2 తరాలకు మంచి భవిష్యత్తు అందించింది. లేదంటే ఇప్పటి ఉత్తరాది రాష్ట్రాల మాదిరే తెలుగు రాష్ట్రాలు కూడా అయ్యేవి.

ఇక ప్రభుత్వాలు, అధికారులకి వ్యతిరేకంగా 2000లో ఆయన మొదలుపెట్టిన సమాచార హక్కు విప్లవం, ఆ హక్కు వచ్చిన తరువాత కూడా దాని మీద అవగాహన కోసం ఈనాడులో ఒక కాలమ్ ఉండేది.

ఇక తెలుగు భాష వాడుకలో పెరిగిపోతున్న ఆంగ్ల పదాలకి అడ్డుకట్ట వేయడానికి ఈనాడు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు చూస్తున్నాం.

మార్గదర్శి బూచిగా పెట్టి భయపెట్టాలని చూస్తే, సింగిల్ పేమెంట్ లో డిపాజిట్ దారుల డబ్బు అంతా బ్యాంక్ లో వేసి, ఎందుకని తన పేరుకి అంత నమ్మకం అనేది చూపెట్టారు ఆయన.

ఇక ప్రభుత్వంలో ఉండి యాడ్స్ ఇవ్వం, ఒత్తిడి చేస్తాం అని రంకెలు వేసిన వాళ్ళని కనీసం ఊకలో ఈక మాదిరి కూడా గుర్తించలేదు.

లక్ష నాగళ్లతో దున్నుతాం అని ఎగిరిన వాడు తర్వాత రోజుల్లో ఆయన దగ్గరకే వెళ్లి మరీ ఆశీర్వాదం తోసుకోవాల్సి వచ్చింది. ఇక ఆయనకి ఎదురుగా మీడియా పెట్టి, లేచినప్పటి నుంచీ ఆయన మీద పడి ఏడ్చిన సన్నాసి తర్వాత ఆయన అపాయింట్మెంట్ కోసం అడుక్కొని, ఛీ పో అంటే ఎక్కడో ఒక ఫంక్షన్ లో ఆయన పక్కన నంగి ఫోటో తీసుకుని స్వయం తృప్తి పడాల్సి వచ్చింది.

ఆయన తనని ప్రభుత్వాలు దేని కోసం అయినా, సంప్రదించినప్పుడు పొంగిపోలేదు, అలా అని భయపెట్టినప్పుడు పారిపోలేదు.

ఫైనల్ గా ఒకటి చెప్పాలి, పని చేయలేక ఈనాడు వదిలిపోయిన ప్రతిఒక్కరు ఒకమాట అంటారు. రామోజీ ఫిల్మ్ సిటీ లోపలకి ఎవరు వెళ్ళాలి అన్నా, ఆయన అనుమతి కావాలని. కీరవాణి గారు అన్నట్లు, ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చేదాకా భీష్ముడు చావుని ఆపినట్లు, తెలుగు ప్రజలకు మంచి పాలన వచ్చేదాకా ఈ భీష్ముడు కూడా చావుని ఫిల్మ్ సిటీకి బయటే ఆపారు.

కార్తీక మాసం నడుస్తుంది ..ఆ , ఈ , ఇంకో  అనుకుంటా పదికి తొమ్మిది మంది నలభైకి ముప్పియ్యారు మంది తేలారు ...వనభోజనాల చదివింప...
12/11/2024

కార్తీక మాసం నడుస్తుంది ..

ఆ , ఈ , ఇంకో అనుకుంటా పదికి తొమ్మిది మంది నలభైకి ముప్పియ్యారు మంది తేలారు ...

వనభోజనాల చదివింపుల కార్యక్రమం కాదది.. ఖాకీ డ్రెస్ లో ఉన్న పెద్దాఫీసరు టక టకా మని ముద్దాయిల పేర్లు చదువుతున్నాడు .. గాలి వార్తలు ప్రచారం చెయ్యడానికి గాలి మందగా గుమిగూడి చేసిన అరాచకం గూర్చి వివరించారు ...

కేవలం నెల కి 8000₹ జీతానికి ఎవర్ని తాల్చడానికైనా వెనుకాడని మూకని సమీకరించి లేనిపోని కథలు రంగరించారు ..

ఉన్న ప్రతీ ఊరిలో ఓ గుడి కట్టినా, బడి పెట్టినా, ఎకరాలకు ఎకరాలు భూరి విరాళంగా దానాలు చేసినా , అందరి కన్నా ముందే దళితులతో సహపంక్తి భోజనాలు చేసి ముందుండి సమాజాన్ని నడిపించిన అభ్యుదయవాదులపై తమదైన అక్కసు తీర్చుకున్నారు..

పుట్టుకలని అవమానించారు ,
కర్రీ పాయింట్లను కులం తో లింక్ పెట్టి చులకన చేశారు , రాజకీయం తో సంబంధం లేని వారిని సైతం బజారుకి ఈడ్చి రకరకాల రంకు పురాణాలు అల్లారు.. ఆడవాళ్లే ఇల్లు నడిపిస్తారంటూ వెకిలి నవ్వులు నవ్వారు ..

Beauty of the time is , it changes..
కాలం అందరి సరదా తీర్చేస్తుంది .. ఐదేళ్లు గడిచాయి ..

అసలే నీళ్లు దొరికిన చోటల్లా భూమిని చీల్చి వ్యవసాయం చెయ్యడానికి నాగలి కట్టుకు వెళ్లినోళ్లు., మహిళలకు ఆస్తి లో సమాన హక్కు ఉండాలని సంకల్పించినోళ్లు ., ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా విద్యా వైద్య వ్యాపార రంగాల్లో పరిఢవిల్లాలని urbanisation అనే కాన్సెప్ట్ ని అందిపుచ్చుకుని తమ బిడ్డల్ని చదివించడానికి ఉన్న ఊరిని వదిలేసి పట్నాలకు వలస వెళ్లి ఏదో వ్యాపారం చేసుకుని బ్రతికేవాళ్లు ., కులవృత్తుల పట్ల విశాల దృక్పథం తో దశాబ్దాల మునుపే చెప్పుల దుకాణాలతో మొదలెట్టి , క్షురశాలలు , డ్రయి క్లీనింగ్ లు , పచ్చళ్ళు అంటూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తాము ఎదుగుతూ పది మందికి పని కల్పించి ఉపాధి మార్గాలు నేర్పినోళ్లు.. ఏటికి ఎదురీదే తత్వం అవపోసన పట్టిన్నోళ్ళు అంత ఈజీ గా ఇడిసేస్తారా???

కట్ చేస్తే

మామూలుగా రాజకీయాలను పెద్దగా పట్టించుకోని ఆ వర్గం లో కొన్ని కుటుంబాలు కూడా మొన్న ఎలక్షన్ కి ఇంటిల్లి పాది కదిలొచ్చి ఓటేసి, ఓటేయించినప్పుడు అయినా తెలిసి రావాల్సింది, వాళ్ళు పట్టు పడితే వదలరు అనీ.

కానీ, ఫ్రీగా ప్రజల సొమ్ము తిని అంగుళం మందాన కొవ్వు పట్టి ఉన్న అంబోతులకి తెలిసి రాలేదు.

కాస్కో ఇస్కిస్కో తెలివి వచ్చిన తలకాయలు కుదిరితే విదేశాలకి వెళ్ళడం, ఇక్కడి వాళ్ళేమో ఏవేవో వేదికల పేరు మీద మరో ముసుగు వేసుకున్నా, ప్రజల సొమ్ము తినమరిగిన వాళ్ళు మాత్రం మముల్ని ఎవరూ ఏమీ చేయలేరు అనుకుని ఇంకా రెచ్చిపోయారు. కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా...

తప్పుడు ప్రచారం చేసిన ప్రతి నాకొడుకుని చట్టం తమకిచ్చిన హక్కుతోనే తుప్పు వదలగొట్టించారు.. నెల జీతాలకి కక్కుర్తి పడి నేలబారు రాతలు రాసిన ప్రతీ వాడ్ని దోషిగా నిలబెట్టి నెలనాకించారు ..

ఉన్మాదంతో రెచ్చిపోయి తమని తమ ఇంట్లో పసిపిల్లలను కూడా వదలకుండా పిచ్చి కూతలు కూసిన అరాచక బజారు జాతిని గెందించారు...

ఇదొక చిన్న హెచ్చరిక , 👇 ఇటువంటి చోటా గల్లీ రౌడీలను పెంచి పోషించిన అసలు విలన్లయిన అతివాదులకు అసలు సినిమా ఇంకా ముందుంది .. Stay tuned..

#ఉద్యామి

Address

Chennai

Website

Alerts

Be the first to know and let us send you an email when Radical Roasts posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share