25/08/2023
◆ *@చట్టసభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి.*
◆ *మండల్ జయంతి వేడుకలలో:- డా,, తొట్ల స్వామి యాదవ్*
*యాదాద్రి-భువనగిరి:-* తేదీ.25-08-2023 గురువారం రోజున యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో *బీసీ రిజర్వేషన్ పితామహుడు బి.పి మండల్ గారి జయంతి సందర్భంగా* బి.సి రాజకీయ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బి.పి మండల్ జయంతి సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన *ఓయూ జేఏసీ చైర్మన్&BRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు తొట్ల స్వామి యాదవ్ గారు* మాట్లాడుతూ బి.పి మండల్ గారు బీసీ ల రిజర్వేషన్ కోసం కొట్లాడిన గొప్ప నాయకులు,ఈ రోజు మనం అనుభవిస్తున్న రిజర్వేషన్లు కూడా తను కొట్లాడినవే అని కానీ ఇంకా మన బీసీలు రాజకీయంగా చైతన్య వంతులు కావాలి అంటే నాగులు అంశాలు ముందుకు రావాలి అని అందులో మొదటగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి,బీసీ కుల గణన చేయాలి,బీసీ లకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు,ప్రత్యేక బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని ఈ విధంగా ఏర్పాటు చేయటం వల్ల బీసీ ఉపకులాలు రాజకీయంగాను, ఆర్థికంగా ముందుకు వెళ్తారు అని తెలిపారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ రామయ్య గారు,సభ అధ్యక్షులు మామిడాల కిరణ్, శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేశం,పూసలి సంఘం జిల్లా అధ్యక్షులు సింహాద్రి, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు మిర్యాల శ్రీనివాస్, బీసీ సంఘాల జిల్లా నాయకులు బెల్లి చంద్రశేఖర్, కోడారి వెంకటేష్, అవిశెట్టి రమేష్,గుండబోయిన సురేష్, భాషబోయిన ఉప్పలయ్య యాదవ్,నర్సింగ్ యాదవ్,పరిదె సంతోష్,ర్యాకల రమేష్,భాను చందర్,కొత్త ఆంజనేయులు, వేముల క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.