19/01/2022
Educational Epiphany ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మెరిట్ టెస్ట్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించుటకై
ప్రకాశం,చిత్తూరు మరియు తూర్పుగోదావరి జిల్లాలలో గౌరవ జిల్లా విద్యాశాఖాధికారుల అనుమతితో 7 మరియు 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల కొరకు రాష్ట్ర స్థాయి మెరిట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు EEMT 2022 ప్రకాశం జిల్లా సమన్వయకర్త దూదేకుల నబి తెలియజేసారు.
ఆన్లైన్ ద్వారా ఈ నెల 27 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి.ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.
పరీక్ష ఆన్లైన్ విధానం లో 2 దశలలో జరుగుతుంది.
మొదటి దశ లో ప్రిలిమనరి పరీక్ష ఫిబ్రవరి 6 వ తేదీ ఆన్లైన్ లో రాయవలసి ఉంటుంది.
ప్రిలిమినరీ కి హాజరైన విద్యార్థులందరిలో 40 శాతం పైబడి మార్కులు సాధించిన విద్యార్థులకు mains పరీక్ష ఫిబ్రవరి 13 వ తేదీ నాడు ఆన్లైన్ లొనే పరీక్ష రాయవల్సి ఉంటుంది.
mains పరీక్ష నందు విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా రాష్ట్ర స్థాయిలో 10 వ తరగతిలో 30000,25000,20000 & 7 వ తరగతిలో 9000,8000,7000 రూపాయలు నగదు బహుమతి అందజేయబడుతుంది.అలాగే ప్రకాశం జిల్లా స్థాయిలో 10 వ తరగతిలో 12000,10000,8000 & 7 వ తరగతిలో 7000,5000,3000 రూపాయలు నగదు బహుమతి అందజేయబడుతుంది.మండల స్థాయీ విజేతలకు విద్య విషయక మెటీరియల్ అందజేయబడుతుంది.ప్రిలిమినరీ పరీక్ష 30 ప్రశ్నలతో 50 మార్కులకు ,
Mains పరీక్ష 60 ప్రశ్నలతో 100 మార్కులకు నిర్వహించబడును.పరీక్ష నందు 80% ప్రశ్నలు అకడమిక్ సిలబస్ నుండి మరియు 20 % ప్రశ్నలు gk & iq అంశాల నుండి అడగడం జరుగుతుంది..
పరీక్ష కు హాజరు కాదలిచిన విద్యార్థులందరు http://www.educationalepiphany.org/eemt2022 అనే లింక్ ద్వారా జనవరి 27వ తేది లోగా రిజిస్టర్ కావలయును.మరింత సమాచారం కోసం 9573139996,7989796602
9391588902 అనే నంబర్ లలో సంప్రదించాలని కోరారు.
Students' registration form for EEMT 2022 Exam. All the required fields must be answered and submitted on or before 27th Jan 2022. Please make sure you have entered accurate information. Any discrepancies in the data will be validated by EE team and their decision is final.