Smk news

Smk news .

26/08/2026
23/08/2026

💥మద్యం మత్తులో న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్* వరంగల్ జిల్లా ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఓ బార్‌లో మద్యం తాగి బెటాలియన్ కానిస్టేబుల్ న్యూసెన్స్ చేస్తున్నాడని 112కి డయల్ చేసి ఫిర్యాదు చేసిన బార్ సిబ్బంది వెంటనే బార్ వద్దకు వెళ్లి, బెటాలియన్ కానిస్టేబుల్‌ను షర్ట్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి చెంపపై కొట్టిన బీట్ కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి తిరిగి సంతోష్ రెడ్డి చెంప చెళ్లుమనిపించిన బెటాలియన్ కానిస్టేబుల్ దీంతో బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన కానిస్టేబుల్ సంతోష్ రెడ్డి, స్థానికులు....

పంచదార రేటు పెరిగితే 'షుగర్ ఉందిగా' అన్నారు!రేపు పెట్రోల్ రేటు పెరిగితే 'నడిస్తే ఆరోగ్యానికి మంచిదిగా' అనగల మహానుభావులు ...
22/08/2026

పంచదార రేటు పెరిగితే 'షుగర్ ఉందిగా' అన్నారు!
రేపు పెట్రోల్ రేటు పెరిగితే 'నడిస్తే ఆరోగ్యానికి మంచిదిగా' అనగల మహానుభావులు వీళ్ళు!"

ధరలు తగ్గించే తెలివి తేటలు లేకపోయినా పర్లేదు...ఈ చెడ్డీస్ కి ఇట్లా ప్రజల ఆరోగ్యాల మీద జోకులు వేసే తెలివితక్కువతనం మాత్రం పుష్కలంగా ఉంది!"

సోషల్ మీడియాలో గాని బయట గాని మాధురి రాథోడ్ కు మద్దతు ఎందుకు వస్తుందో తెలుసా.... ప్రతికూల పరిస్థితుల్లో నిశ్చేష్టురాలై అల...
21/08/2026

సోషల్ మీడియాలో గాని బయట గాని మాధురి రాథోడ్ కు మద్దతు ఎందుకు వస్తుందో తెలుసా....
ప్రతికూల పరిస్థితుల్లో నిశ్చేష్టురాలై అలా మౌనంగా ఉండిపోవడం వలననే...
అలాకాకుండా ఈవిడ కూడా అక్కడ రెచ్చిపోయుంటే కచ్చితంగా జనాల్లో వ్యతిరేకత వచ్చేది.. ప్రతిఒక్కరూ తిట్టిపోసేవాళ్లు.
టైమ్ మనది కానప్పుడు మౌనంగా ఉండిపోవడమే మంచిది..
మౌనం కూడా ఒక పోరాటమే...



ఎడిటింగ్ ఐనా సరిగా చేయండి దరిద్రులారా?ఆ కార్లు, గుడిసె ఐనా మార్చి నమ్మేలాగా పెట్టాల 😅🤣😂
21/08/2026

ఎడిటింగ్ ఐనా సరిగా చేయండి దరిద్రులారా?
ఆ కార్లు, గుడిసె ఐనా మార్చి నమ్మేలాగా పెట్టాల 😅🤣😂

ఆస్ట్రేలియన్ మహిళ భారతీయుడితో ప్రేమలో పడి వివాహం.. కూతురు కూడా పుట్టింది.. కానీ వీసా సమస్యతో ఇబ్బందిఆస్ట్రేలియా, ఆగస్టు ...
20/08/2026

ఆస్ట్రేలియన్ మహిళ భారతీయుడితో ప్రేమలో పడి వివాహం.. కూతురు కూడా పుట్టింది.. కానీ వీసా సమస్యతో ఇబ్బంది
ఆస్ట్రేలియా, ఆగస్టు 19:
ఒక సాధారణ భారత పర్యటన జీవితాన్ని మార్చేసిన కథ ఇది. ఆస్ట్రేలియాకు చెందిన లోరెనా స్టెఫనీ 2024 జనవరిలో తమిళనాడులోని మధురై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడే రబీక్ బహుర్దీన్ అనే యువకుడు ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లేందుకు డ్రైవర్‌గా వచ్చాడు. ఆ రైడ్‌తోనే ప్రారంభమైన పరిచయం క్రమంగా స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది.
రబీక్ తన స్వస్థలాన్ని చూపిస్తూ లోరెనాతో సమయం గడిపాడు. కానీ ఇరు కుటుంబాలు ఈ సంబంధాన్ని సులభంగా అంగీకరించలేదు. కష్టాలు పెరిగిన తర్వాత వారు కలిసి ఒక నెలపాటు ప్రయాణాలు చేసి దూరంగా ఉండి సమయం గడిపారు. కలిసిన ఏడాది తర్వాత 2025 జనవరి 23న వారు వివాహం చేసుకున్నారు.
వివాహం అయినా వీసా, ఇమ్మిగ్రేషన్ సమస్యల కారణంగా వారు వేర్వేరు దేశాల్లోనే ఉండాల్సి వచ్చింది. దీర్ఘకాలిక దూర సంబంధం కొనసాగుతూనే 2026 ఫిబ్రవరిలో వారికి మొదటి సంతానం – కూతురు మర్యం జన్మించింది. రబీక్‌కు ఆస్ట్రేలియా వీసా రాకపోవడంతో అతను కూతురు పుట్టిన సమయంలో హాజరు కాలేకపోయాడు. కూతురికి పాస్‌పోర్ట్ వచ్చిన తర్వాతే అతను ఆమెను చూడగలిగాడు.
ప్రస్తుతం కూడా వారు ఒకే ఇంట్లో కలిసి ఉండలేకపోతున్నారు. రబీక్ ఆస్ట్రేలియాకు వెళ్లాలంటే పార్టనర్ వీసా అవసరం. దీని ఖర్చు సుమారు 11,700 ఆస్ట్రేలియన్ డాలర్లు (దాదాపు రూ.7.9 లక్షలు), అదనంగా లాయర్ ఫీజు సుమారు 9,700 డాలర్లు (రూ.6.5 లక్షలు) ఉంటుంది.
లోరెనా భారత్‌లో ఎక్కువ కాలం గడుపుతున్నా శాశ్వతంగా మారకపోవడానికి కారణం చెబుతూ.. “నా తల్లిదండ్రులు, కుటుంబం ఆస్ట్రేలియాలోనే ఉన్నారు. అక్కడ టీచింగ్‌లో పర్మనెంట్ ఉద్యోగం సాధించేందుకు చాలా కష్టపడ్డాను. అది వదిలేయడం సులభం కాదు. ప్రస్తుతం మెటర్నిటీ లీవ్‌లో ఉన్నాను. ఎక్కువ సమయం భారత్‌లోనే గడుపుతున్నాను. ఇక్కడ చాలా ఇష్టం” అని చెప్పారు.
ప్రేమ కథ ఇలా సాగుతున్నా.. వీసా అడ్డంకి వారిని ఇంకా వేరుచేస్తోంది.

రూపారెడ్డిని చంపిన విద్యార్థులు వీళ్లే..నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కే...
19/08/2026

రూపారెడ్డిని చంపిన విద్యార్థులు వీళ్లే..

నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆమెకు విద్యాబుద్ధులు చెప్పిన ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థులే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. గంజాయికి అలవాటు పడటంతో పాటు విచ్చలవిడిగా జల్సాలకు అలవాటు పడిన ఇద్దరు విద్యార్థులు డబ్బుల కోసం ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న సాయంత్రం 6 గంటల సమయంలో రూపారెడ్డి హత్యకు గురయ్యారు.
స్కూల్ ముగించుకుని ఆమె ఇంటికి చేరుకునేలోపే నిందితులు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో వంటగదిలో దాక్కున్నారు. రూపారెడ్డి ఫ్రెష్ అయి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన సమయంలో వెనుక నుంచి దాడి చేసిన నిందితులు.. కత్తితో ఆమెపై 27 సార్లు పొడిచినట్లు విచారణలో వెల్లడైంది.

హత్య అనంతరం ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న సుమారు రూ.2 లక్షల నగదును తీసుకుని అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ డబ్బుతో హైదరాబాద్‌లో జల్సాలు చేసినట్లు సమాచారం. తమపై అనుమానం రాకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి చివరకు నిందితులను గుర్తించారు.
ఈ కేసులో ఇద్దరు టెన్త్ క్లాస్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థులే తమకు విద్యాబోధన చేసిన ప్రిన్సిపల్‌ను డబ్బు కోసం హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది

Address

Bangalore

Website

Alerts

Be the first to know and let us send you an email when Smk news posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share