16/09/2024
చేసిన ఉద్యమం ఉరికేపోదు ✊✊✊✊
గల్ఫ్ ఉద్యమ కార్మికులు మరియు నాయకుల
మనం పడ్డ కష్టం మనము కన్న కల నెరవేరబోతుంది, గల్ఫ్ లో చనిపోయిన బాధిత కుటుంబానికి 5లక్షల ఆర్థికసహాయం అందించే జీవో విడుదల చేసినా తెలంగాణ ప్రభుత్వానికి మరియు గౌ. ముఖ్యమంత్రి శ్రీ Anumula Revanth Reddy గారికీ ప్రత్యేక ధన్యావాదాలు.
ముందునుండి ప్రత్యేక చొరవ తీసుకున్న మా ఆర్ముర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి శ్రీ పొద్దుటూరి వినయ్ రెడ్డి గారు , బాల్కొండ నియోజకవర్గ నాయకులు ఈరవత్రి అనిల్ గారు,పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అలాగే షబ్బీర్ అలీ గారు,వేములవాడ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ Aadi Srinivas గారికీ, మా గల్ఫ్ పెద్దలు Jeevan Reddy Thatiparthi గారికీ, తీవ్రంగా కృషి చేసిన చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మేడిపల్లి గారికీ, గౌ. మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికీ మరియు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మా గల్ఫ్ కార్మికుల తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాము.
డిసెంబర్ 7 2023 తరువాత మరణించిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల మృతధన పరిహారం , బాధిత కుటుంబాల పిల్లలకు గురుకులాల్లో ప్రాధాన్యం అన్న అంశాలను అభినందిస్తూనే , తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత మరణించిన పేద కార్మికుల కుటుంబాలను గుర్తుంచి వారికి కూడ 5 లక్షల పరిహారాన్ని అందచేయాలని ముఖ్యమంత్రి గారిని మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం
పరిహారం పైరవీలతో కాకుండ పారదర్శకంగా అందరికి చేరేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
MRWF సంస్థ మరియు మన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కోటపాటి నరసింహం నాయుడు గారు,సంస్థ సభ్యులు కష్టం మరువలేనిది, వారందరికీ పాదాభివందనాలు.
అలాగే మా గల్ఫ్ సంఘాల నాయకులకు, సభ్యులకు మరియు గల్ఫ్ కార్మికులకు ధన్యావాదాలు.
మీ,
ఏముల రమేష్ (alias -Vemula Ramesh)
సోషల్ వర్కర్
అధ్యక్షులు -ప్రవాస భారతీయుల హక్కులు మరియు సంక్షేమ వేదిక (MRWF)దుబాయ్ -యూఏఈ
గల్ఫ్ జేఏసీ రాష్ట్ర నాయకులు..
Mobile No # 7997299090