16/04/2023
*గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి సిపిఎం బహిరంగ లేఖ*
*శింగనమల నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ 35 అంశాలపై సిపిఎం బహిరంగ లేఖ....*
ఈరోజు సింగనమల మండలం కేంద్రంలోని రామస్వామి దేవాలయం నందు సిపిఎం పార్టీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బాల రంగయ్య, ఓనల్లప్ప జిల్లా కమిటీ సభ్యులు భాస్కర్, మండల నాయకులు బందల ఈశ్వరయ్య,ముత్యాలు పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా బహిరంగ లేఖను విడుదల చేశారు.*
*ఈనెల 17 తేదీన 'జగనన్న వసతి దీవెన' కార్యక్రమంలో భాగంగా శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలానికి మీరు వస్తున్నందుకు స్వాగతం. చాలా నెలల తర్వాత మా జిల్లాకు రావడం, అందునా అనేక సమస్యలు వున్న శింగనమల నియోజకవర్గానికి తమరు రావడంపై నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశతో వున్నారు. ఈ నియోజకవర్గంలోని ఆరు మండలలాల్లో మా దృష్టికి వచ్చిన సమస్యలను మీకు ప్రత్యక్షంగా కలిసి వివరించే అవకాశం లేదు కనుక బహిరంగ లేఖ ద్వారా తమరికి తెలుపుతున్నాము. వీటిని పరిష్కారించ వలసిందిగా సిపిఎం జిల్లా కమిటి కోరుతున్నది.*
*ముఖ్యమంత్రి గారి పర్యటన అనివార్య కారణాలవల్ల వాయిదా పడినప్పటికీ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ కోరుతున్నారు.*
*గత నెలలో కురిసిన వడగళ్ల వర్షానికి నార్పల మండలంలో వెంకటాంపల్లి, నాయనపల్లి, కేశేపల్లి తదితర గ్రామాల్లో అరటి, బత్తాయి, కళింగర, మొక్కజొన్న పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిని కోట్ల రూపాయల పెట్టుబడులు ఆసాధరణంగా రైతులు నష్టపోయారు. వీరికి పంట నష్టపరిహారం ఈ సభలో ప్రకటిస్తారని ఆశిస్తున్నాము.*
*ఈ నియోజకవర్గంలో విద్య, వైద్య, మౌళిక సదుపాయాలు, ఉపాధి, వ్యవసాయం, పాడి పరిశ్రమల అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి. ఈ సానుకూల అంశాలపై సిపిఎం క్షేత్రస్థాయిలో సర్వేలు, పర్యటనలు చేసి ప్రతిపాదనలు సిద్ధం చేశాము. వీటి పరిష్కారం కోసం ఇప్పటికే మండల, నియోజకవర్గ సదస్సులు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడంతో పాటు, అధికారులకు విజ్ఞప్తులు ఇస్తూ, వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నాము.*
*మా దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను తమరికి తెలుపుతున్నాము.*
*ప్రధాన సమస్యలు*
1. పుట్లూరు మండల కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వం డిగ్రీ కళాశాలను ప్రారంభించాలి.
2. అన్ని గురుకుల పాఠశాలల్లో కాస్మోటిక్ చార్జీలు, నోట్ పుస్తకాలు, ఇతర సదుపాయాలకు నిధులు పెంచి సకాలంలో ఇవ్వాలి.
3. నియోజకవర్గంలో ఉన్న అన్ని సంక్షేమ హాస్టల్లు, గురుకుల పాఠశాలలకు మరమ్మత్తులకు నిధులు కేటాయించాలి. పనులు చేపట్టాలి.
4. నియోజకవర్గం కేంద్రంలో ఉన్న జూనియర్ కాలేజీలో బైపిసి, ఎంపిసి గ్రూపులను, ఇంగ్లీషు మీడియాను ప్రవేశపెట్టాలి.
5. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో బాలికలకు ప్రత్యేక బాలికోన్నత పాఠశాలను ఏర్పాటు చేయాలి.
6. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో ఎపి మోడల్ స్కూల్ ను ఏర్పాటు చేయాలి. 7. నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల్లో డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలి.
8. నియోజకవర్గ కేంద్ర శింగనమలలో ఉన్న సామాజిక వైద్యశాల, బుక్కరాయసముద్రం లోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని, అలాగే అన్ని మండల కేంద్రాలలో ఉన్న, కొర్రపాడు, తరిమెల, బి, పప్పూరు గ్రామాల్లో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 10 పడకలు, 24 గంటల ఆసుపత్రులుగా మార్చి తగిన సిబ్బందిని నియమించాలి.
9. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో డాక్టరు బి. ఆర్. అంబేడ్కర్ కన్వెన్షన్ హాలుకు 10 కోట్లు నిధులను మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలి.
10. అన్ని మండల కేంద్రాల్లో డాక్టరు బి. ఆర్. అంబేడ్కర్ భవనాలను నిర్మించాలి. అందుకు నిధులు మంజూరు చేయాలి.
11. బుక్కరాయసముద్రం మండల తహశీల్దారు కార్యాలయం ముందు ఉన్న మరవవంక, శింగనమల చెరువు కింద ఉన్న మరవవంక, నియోజకవర్గంలోని వివిధ చెరువు కింద ఉన్న మరవవంకలకు బ్రిడ్జీలను నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలి.
12. నార్పల మండలం గూగూగు కుళ్ళాయి స్వామి, బుక్కరాయసముద్రం మంల కేంద్రంలోని దేవరకొండ కొండమీదరాయుని ఆలయం,
శింగనమల మండల కేంద్రంలోని రుషింగమయ్య కొండను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.
13. నార్పల మండల కేంద్రంలోని కూతలేరు బ్రిడ్జిని నిర్మాణ పనులు పూర్తీ చేయాలి.
14. నార్పల మండల కేంద్రంలో చేనేత పార్కును ఏర్పాటు చేయాలి. చేనేత కార్మికులకు ముడి సరుకు సబ్సిడీపై ఇవ్వాలి. కార్మికులకు గుర్తింపు కార్డులు, అర్హులకు నేతన్న నేస్తం ఇవ్వాలి.
15. మంచినీటి సమస్యలను శాశ్వితంగా పరిష్కారం కోసం నార్పల బుక్కరాయసముద్రం మండల కేంద్రాల్లో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు నిర్మించాలి. అన్ని గ్రామాలకు గండికోట రిజర్వాయర్ ద్వారా పనులను పూర్తి చేసి మంచినీటా సౌకర్యం కల్పించాలి.
16. పుట్లూరు మండల సాలవేముల జాజికొండ వాగుకు చిన్నపాటి రిజర్వాయర్ నిర్మిస్తే 34 గ్రామాలకు తాగునీరు అందివ్వవచ్చు.
17. నియోజకవర్గంలో వివిధ పండ్ల తోటల విస్తీర్ణం పెరుగుతున్న రిత్యా పళ్ళ రసాల పరిశ్రమను ఏర్పాటు చేసి, మార్కెటింగ్ కల్పించాలి.
18. నియోజకవర్గంలో పాడిపరిశ్రమపై ఆధారపడిన వారి పాడి పశువులు చనిపోతే బీమా సదుపాయం కల్పించాలి.
19. లీటర్ పాలకు రూ, నాలుగు రూపాయల బోనస్ ను వెంటనే ఇవ్వాలి.
20. బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురము గ్రామంలో వెటర్నిరీ సబ్ సెంటర్ను ఏర్పాటు చేసి డాక్టరు, సిబ్బందిని నియమించాలి.
21. పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో జింకల బెడద నుండి పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
22. పెనకచెర్ల డ్యాం నుండి బైపాస్ కాలువ పనులు చేపట్టాలి, శింగనమల మండలం సలకంచెరువుకు హెచ్.ఎల్.సి నీళ్లు ఇవ్వాలి.
23. చాగల్లు రిజర్వాయర్ కింద ముంపుకు గురైన ఉలికల్లు, ఉలికుంటపల్లి గ్రామాలకు చెందిన ముంపు బాధితులకు గత 14 సం॥రాలు నష్టపరిహారం అందలేదు. పునరావాసానికి, మౌళిక సదుపాయాలు కల్పించలేదు. నష్టపరిహారం, పునరావాసం కల్పించాలి.
24. డోలమైట్, బ్లాక్ గ్రానైట్, వైట్ గ్రానైట్ ఖనిజాలు ఉన్నాయి. వీటి ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కలిపించాలి.
25. శింగనమల మండలం రాచేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన లెదర్ పార్కును పునరుద్ధరించాలి, నిధులు కేటాయించాలి. గతంలో శిక్షణ పొందిన యవతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.
26. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా వచ్చిన సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్రం నుండి నిధులు రాబట్టాలి.
27. దళిత, గిరిజనులపై దాడులు పెరగడానికి కారణం జిల్లా పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం, ఉదా: శింగనమల మండలం జూలాకాలువ, అవంతపురము రూరల్ మండలం నవయుగ కాలనీ, నార్పల మండలం బొందలబాడలో జరిగిన ఘటనల్లో పోలీసుల నిర్లక్ష్యంపై విచారణ చేయాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
28. మట్టి మాఫియా, ఇసుక మాఫియా పెరుగుతున్నందున సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
29. అర్హత కలిగిన వారికి ఇంటి పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలి. వివిధ మండలాల్లో ఏళ్ల తరబడి పేదలు గుడిసెలు వేసుకొని
30. పంచాయితీలు నిర్వహిస్తున్న మంచినీరు, వీధిదీపాల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలి.
31. అన్ని మండలాల్లో అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణ పనులు పూర్తీ చేయాలి. గ్రామీణ రోడ్డుకు మరమ్మతులు చేయాలి.
32. అన్ని గ్రామ పంచాయితీలలో పని చేస్తున్న కార్మికులు, స్వచ్చ భారత్ కార్మికుల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలి.
33. నియోజకవర్గంలోని అర్హతగల రైతులందరికీ డ్రిప్పు, స్పింకర్లు 100% సబ్సిడీతో ఇవ్వాలి.
పైన తెలిపిన ప్రజా సమస్యలపై తమరు స్పందించి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టాలని సిపిఎం జిల్లా కమిటి బహిరంగ
లేఖ ద్వారా కోరుతున్నది.