25/08/2023
OBC రిజర్వేషన్ల పితామహుడు,
మెజిస్ట్రేట్ గా
ఒక్క రూపాయి వేతనం తీసుకోకుండా నిజాయితీగా పనిచేసిన ఆదర్శప్రాయుడు,
తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా కాంగ్రెస్ నాయకులు చేసిన అవినీతిపై అయ్యర్ కమీషన్ వేసి ఇందిరా గాంధీనే ఎదురించిన ధీరుడు,
తన పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతికి తావులేకుండా నీతి నిజాయితీగా పనిచేసి ప్రజా ప్రభుత్వంలో ఒక్క కుల ఆధిపత్యం ఒక్క కుల ప్రాతినిధ్యం అనేది కాకుండా సామాజిక న్యాయం పాటించి దేశ భవిష్యత్తు రాజకీయాలకు పునాదులు వేసిన
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి
బి.సి.జనుల పాలిట దేవుడు
అభినవ అంబేడ్కర్ బి.పి.(బిందేశ్వర్ ప్రసాద్) మండల్
(ఆగస్టు 25) 105 వ జయంతి :
మండల్ (రెండవ వెనుకబడిన తరగతుల) కమీషన్ ఛైర్మన్ , బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ,పార్లమెంట్ సభ్యుడు OBC రిజర్వేషన్లు( 27% ) కల్పించిన మహానీయుడు బి.పి మండల్ 105వ జయంతి:
చేసేది మేమైతే-మేసేది మీరా?అనే నినాదంతో దేశ సంపదను దోచుకుతింటున్న పరాన్న జీవులను కట్టడి చేసిన మహానీయుడు బి.పి మండల్ నాటి ప్రధాని మొరార్జీ దేశాయ్ వెనుకబడిన తరగతుల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి 1978లో 5గురు సభ్యులతో కూడిన కమీషన్ ఏర్పాటు చేశారు దానికి బి.పి మండల్ అధ్యక్షత వహించారు కనుక మండల్ కమీషన్ గా పేర్కొన్నారు చైర్మన్ హోదాలో మండల్ 1979 జనవరి 1 నుండి తన మేధాతనంతో,కృషితో దేశమంతా తిరిగి నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి 1980 డిశంబర్ 31న నివేదికను సమర్పించారు. దేశ జనాభాలో సగ భాగంగా ఉండి కూడా తమ హక్కులను కూడా తెలుసుకోలేని నిస్సహాయతలో ఉన్న వెనుకబడిన తరగతులకు విద్యా ,ఉద్యోగ,రాజకీయ మరియు ప్రయివేట్ రంగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని 40సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించారు మండల్. అయితే ఓ.బి.సిలకు రిజర్వేషన్లు కల్పించటం ఇష్టంలేని నాటి ఇందిరా గాంధీ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ ప్రభుత్వాలు ఉద్ధేశ్య పూర్వకంగానే నివేదికను పక్కన పెట్టాయి. ఆ తర్వాత వచ్చిన వి.పి సింగ్ (జనతా దళ్) ప్రభుత్వం మీద లాలూ ప్రసాద్ యాదవ్, కాన్షీరాం ,ములాయం సింగ్ ,తదితర నాటి బడుగు బలహీన వర్గాల నాయకుల ఒత్తిడి పెంచటం వలన మండల్ కమీషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు 1990 ఆగస్ట్ 7 వ తేదీన పార్లమెంట్ లో ప్రకటించారు అయితే వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించటం ఇష్టంలేని నాటి ఆధిపత్య కులాలు ,మనువాద శక్తులు పార్టీలకతీతంగా ఏకమై (మండల్ vs కమండల్) దేశవ్యాప్తంగా నిరసనలు తెలిపి మండల్ కమీషన్ అమలును వ్యతిరేకించాయి. అయితే సుప్రీంకోర్టు 1993లో వెనుకబడిన తరగతులకు విద్య,ఉద్యోగాలలో 27%(OBC) రిజర్వేషన్లు కల్పించాలని తీర్పు ఇచ్చింది. అయితే అదికూడా క్రిమిలేయర్ అనే అడ్డుగోడ కడుతూ-
అయితే ఇప్పటికీ మండల్ చేసిన పూర్తి నివేదికను అమలు చేయకపోగా 40సిఫార్సులో ఒక సిఫార్సు మాత్రమే అమలు చేస్తున్నారు అదికూడా స్వాతంత్ర్యం వచ్చిన 46సంవత్సరాలకు దీన్నిబట్టి ఈ ఆధిపత్య కుల ప్రభుత్వాలకు బి.సిల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎలాంటిందో ఇప్పటికైనా మనం గ్రహించాలి. OBCలకు రిజర్వేషన్లు కల్పించుటకు ఎంతో కృషి చేసిన మహానీయుడు,అభినవ అంబేద్కర్ బి.పి మండల్ గారి జయంతి సందర్భంగా మహానీయల ఆశయాలు సాధించటం మన బాధ్యతగా మండల్ జయంతి సందర్భంగా చిత్తశుద్దితో,నిబధ్ధతతో ,లక్ష్యసాధనకోసం, సమసమాజ స్థాపన కోసం,ప్రజాస్వామ్య పాలనకోసం బి.పి మండల్ ఇచ్చిన పూర్తి నివేదికను అందులోని (40) సిఫారసులను పూర్తిగా అమలు చేయాలని ప్రభుత్వాలను డిమాండ్ చేద్దాం .
ఈసందర్భంగా ఆ మహానీయునికి నివాళులు అర్పిద్దాం మండల్ ఆశయాలను సాదిధ్ధాం. మరవకండి మహానుభావులను - స్మరించుకుందాం వారు చేసిన త్యాగాలను. కొనసాగిద్దాం వారి ఆలోచన విధానాన్ని - సాదిధ్ధాం వారి ఆశయాలను.
మీ బిసి చక్రధర్ యాదవ్
బిసి సంక్షేమ సంఘం హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు
సమాజ్ వాదీ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
జై పూలే.జై భీం. జైమండల్
BC Chakradhar Yadav