06/05/2022
10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ చేసిన నారాయణ, చైతన్య విద్యాసంస్థల యాజమాన్యాల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ DEO గారికి యువ మోర్చా రాష్ట్ర పదాధికారి గేదెల స్వరూప్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు జరిగిన విధానాన్ని భారతీయ జనతా యువమోర్చా తీవ్రంగా ఖండిస్తోంది.వరుసగా పేపర్లు లీక్ అవుతున్నప్పటికీ(మొదటి పరీక్ష తెలుగు, రెండవ పరీక్ష ఇంగ్లీషు, మూడో పరీక్ష హిందీ తరువాత గణితం) ప్రభుత్వం తరఫున ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం, ఏప్రిల్ 30 వ తేదీన భారతీయ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కేతినేని సురేంద్రమోహన్ గారు మాట్లాడుతూ ఈ యొక్క పేపర్ లీక్ యొక్క కారకులు నారాయణ, చైతన్య విద్యా సంస్థలే అని ఆయన ఆనాడే తెలిపారు, కానీ నిన్నటి రోజున సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారే తిరుపతి బహిరంగ సభలో విద్యా దీవెన విడుదల చేస్తున్న సందర్భంలో పేపర్ లీక్ కారకులు నారాయణ, చైతన్య విద్యా సంస్థలే కారణమని, ఆ సంస్థల యాజమాన్యం నారాయణ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని అని ని, వారు చేసి ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు అని వారు తెలియజేశారు, అయితే లీక్ కారకులైన నారాయణ విద్యా సంస్థలు చైతన్య విద్యా సంస్థలు పై ఎటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోక పోవడం మాకు ప్రభుత్వం మీద అనేక సందేహాలను కలిగిస్తోంది. అయితే, మరి ఎందుకు ప్రభుత్వం ఈ యొక్క విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవడం లేదు..? అని భారతీయ జనతా యువమోర్చా సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. కావున సోమవారం లోగ ఈ యొక్క విద్యా సంస్థల యాజమాన్యాలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని, నారాయణ విద్యా సంస్థలు చైతన్య విద్యా సంస్థల యొక్క గుర్తింపును రద్దు చేయాలని, లేని పక్షంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రంగా నిరసన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని డిమాండ్ చేస్తున్నాము..ఈ కార్యక్రమంలో ఒమ్మి శ్రీకాంత్ కసిరెడ్డి లోకేష్, సిద్ధా జయంత్, గొర్లి భాను పాల్గొన్నారు