28/03/2026
గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలితకుమారి గారి ఆదేశాల మేరకు, ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామంలో AMC చైర్మన్ శ్రీ చొక్కాకుల మల్లు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పశువైద్య శిబిరం విజయవంతమైంది. ఈ సందర్భంగా మల్లు నాయుడు గారు మాట్లాడుతూ, గత 20 నెలల్లో నియోజకవర్గ రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సుమారు 300 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, మార్కెటింగ్ శాఖ ద్వారా పశువులకు అవసరమైన ఖరీదైన మందులను ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో పాడి రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చి, త్వరలోనే ఒక తీపి కబురు అందించబోతున్నామని, అన్నదాతల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.