10/09/2024
పత్రికా ప్రకటన.
ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి.:-
పి.జి.ఆర్.ఎస్ వచ్చిన అర్జీలను గడవు లోపు పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోండి.
అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి.
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు
ఆదోని, సెప్టెంబర్:-09.
పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం - పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం - పిజిఆర్ఎస్ లో స్థానిక ఎమ్మెల్యే పార్థ సారధి గారు సబ్ కలెక్టర్ పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని. :-
1. ఆదోని మండలం పెద్దహరివనం గ్రామానికి చెందిన హనుమంతుకు సంబంధించి సర్వేనెంబర్ 85 ఏ నందు 1.37 మరియు 9ఏ నందు 2.21 ఎకరాల భూమి ఉన్నది ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు వేరే వారి పేరు నమోదైనది దయతో విచారణ చేసి నా యొక్క పేరు నమోదు చేయవలసిందిగా అర్జీ సమర్పించుకున్నారు.
2. ఆదోని మండలం కల్లుబావి గ్రామానికి చెందిన మల్లయ్య కు సంబంధించి సర్వేనెంబర్ 200 నందు 0.77 సెంట్ల భూమి ఉండగా వారసత్వంగా నాకు రావలసిన 0.2 0 భూమి ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జ సమర్పించుకున్నారు.
3. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన దేవమ్మకు సంబంధించి సర్వే నంబర్ 589 హెచ్1 పైకి 0.25 సెంట్లు భూమి మరణించిన నా యొక్క భర్త గారి పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్నది ప్రస్తుతం సదరు భూమి నందు ఆన్లైన్ నందు వేరే వారి పేరు నమోదు అయినది దయచేసి విచారణ చేసి ఆన్లైన్ నందు మా యొక్క పేరు నమోదు చేయవలసినదిగా అర్జ సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమానికి కార్యాలయపు పరిపాలన అధికారి కే. వసుంధర, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వాయర్ వేణు సూర్య, శ్రీనివాస రాజు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, డిఎల్పివో నూర్జహాన్, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.