22/06/2025
కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి...DYFI...ఆదోని
ఆదోని నియోజకవర్గం లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనపై కొత్త పరిశ్రమల స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేష్ పిలుపునిచ్చారు. ఆదోని పట్టణం డివైఎఫ్ఐ జనరల్ బాడీ సమావేశం వీరేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశం ఉద్దేశించి మీరు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదోనిలో ఉంది. రైతులు పండించిన కాటన్ (పత్తి) ఇక్కడ నుండి రాష్ట్రాలు దాటి వేరే ప్రాంతాలకు ఎగమతి అవుతూ ఉంది. అయితే ఆదోని నియోజకవర్గం లో కాటన్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో పాలకులు ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆదోనిలో కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పనకై ప్రత్యేకమైన కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యువత నిరుద్యోగ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు యువగలం పేరుతో లోకేష్ వేలాది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి యువకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని హామీలు ఇచ్చి సంవత్సరం పూర్తి అవుతున్నప్పటికీ యువతకు ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని వారు తెలిపారు. కావున పట్టణంలో కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ ,ఉపాది అవకాశాల కల్పనకై యువత ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.
అనంతరం డివైఎఫ్ఐ ఆదోని పట్టణ నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది.
డివైఎఫ్ఐ ఆదోని పట్టణ అధ్యక్ష, కార్యదర్శులుగా మోహన్, వెంకటేష్ సహాయ కార్యదర్శిలుగా సతీష్ ,నాగరాజు, నవీన్, ఉపాధ్యక్షులుగా వీరేష్, వినోద్, సూరి, వేరే తో పాటు మరో 13 మందిని కమిటీ సభ్యులుగా ఏకీగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది.