ᴋ ᴠ ᴄʜᴏᴡᴅᴀʀʏ

ᴋ ᴠ ᴄʜᴏᴡᴅᴀʀʏ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ᴋ ᴠ ᴄʜᴏᴡᴅᴀʀʏ, Tirupati.

ఇది మాత్రం ,vere level annayaaa 🔥👏🙌💥ఇవి కార్పొరేట్ స్కూల్స్ కాదు .. ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నమెంట్ స్కూల్స్ 👏👏కార్పొరేట్ స్...
16/08/2021

ఇది మాత్రం ,vere level annayaaa 🔥👏🙌💥
ఇవి కార్పొరేట్ స్కూల్స్ కాదు .. ఆంధ్ర ప్రదేశ్ లో గవర్నమెంట్ స్కూల్స్ 👏👏

కార్పొరేట్ స్కూళ్లు తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్లను రూపుదిద్దేందుకు సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనబడి నాడు-నేడు కార్యక్రమంతో సర్కారు స్కూళ్ల రూపురేఖలు మారిపోయాయి

తొమ్మిది రకాల పనుల్లో వినియోగించే పరికరాలను నాణ్యత విషయంలో పేరున్న ప్రముఖ సంస్థల బ్రాండెడ్ రకాలను వినియోగిస్తున్నారు

నాణ్యమైన టైల్స్తో మంచి ఫ్లోరింగ్, మినరల్ వాటర్, రన్నింగ్ వాటర్తో కూడిన మరుగుదొడ్లు, విద్యార్ధులు కూర్చోవడానికి డ్యూయోల్ డెస్కు బల్లలు, టీచర్లకు కూర్చీలు, బీరువాయి, టేబుళ్లు, గోడలకు పెయింటింగ్ తళతళలాడుతున్న బోర్డులు, అన్ని పరికరాలతో కూడిన ల్యాబ్లు, కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలలు చకచకా రూపురేఖలు మారిపోతున్నాయి

👉AP Budget 2021: ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌ ఇవే..👉2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు🔶️బీసీ సబ్‌ ప్లాన్‌కి ...
20/05/2021

👉AP Budget 2021: ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌ ఇవే..

👉2021-22 రాష్ట్ర బడ్జెట్‌ అంచనా రూ.2,29,779.27 కోట్లు
🔶️బీసీ సబ్‌ ప్లాన్‌కి రూ.28,237 కోట్లు
🔶️కాపు సంక్షేమానికి రూ.3,306 కోట్లు
🔷️ఈబీసీ సంక్షేమానికి రూ.5,478 కోట్లు
🔷️బ్రాహ్మణ సంక్షేమానికి రూ.359 కోట్లు
🔷️ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ.17,403 కోట్లు
🔶️ఎస్టీ సబ్‌ ప్లాన్‌కు రూ.6,131 కోట్లు
🔶️మైనార్టీ యాక్షన్‌ ప్లాన్‌కు రూ.1,756 కోట్లు
🔶️చిన్నారుల కోసం రూ.16,748 కోట్లు

🔷️మహిళల అభివృద్ధికి రూ.47,283.21 కోట్లు
🔶️వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు
🔶️విద్యా పథకాలకు రూ.24,624 కోట్లు
🔶️వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
🔷️వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.17 వేల కోట్లు
🔷️వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కోసం రూ.3,845 కోట్లు
🔷️జగనన్న విద్యా దీవెనకు రూ.2,500 కోట్లు
🔶️జగనన్న వసతి దీవెన కోసం రూ.2,223.15 కోట్లు
🔶️వైఎస్‌ఆర్‌-పీఎం ఫసల్‌ బీమా యోజనకు రూ.1802 కోట్లు
🔶️డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.865 కోట్లు
🔷️పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు
🔷️రైతులకు సున్నా వడ్డీ చెల్లింపులకు రూ.500 కోట్లు
🔶️వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం కోసం రూ.500 కోట్లు
🔶️వైఎస్‌ఆర్‌ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
🔷️వైఎస్‌ఆర్‌ వాహన మిత్ర కోసం రూ.285 కోట్లు

🔷️వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం కోసం రూ.190 కోట్లు
🔶️వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కోసం రూ.120 కోట్లు
🔶️మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు
🔷️అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లింపుల కోసం రూ.200 కోట్లు
🔷️రైతులకు ఎక్స్‌గ్రేషియా కోసం రూ.20 కోట్లు
🔷️లా నేస్తం కోసం రూ.16.64 కోట్లు
🔷️ఈబీసీ నేస్తం కోసం రూ.500 కోట్లు
🔶️వైఎస్‌ఆర్‌ ఆసరా కోసం రూ.6,337 కోట్లు
🔶️అమ్మఒడి పథకం కోసం రూ.6,107 కోట్లు
🔶️వైఎస్‌ఆర్‌ చేయూత కోసం రూ.4,455 కోట్లు
🔶️రైతు పథకాల కోసం రూ.11,210.80 కోట్లు

వైఎస్‌ఆర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లకు రూ.85.57 కోట్లు
🔷️వైఎస్‌ఆర్‌ ఉచిత పంటల బీమాకు రూ.1802.82 కోట్లు
🔷️వ్యవసాయరంగంలో యాంత్రీకరణకు రూ.739.46 కోట్లు
🔷️వైఎస్‌ఆర్‌ పశువుల నష్టపరిహారానికి రూ.50 కోట్లు
🔷️విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు
🔷️స్కూళ్లలో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు
🔶️జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు
🔶️జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు
🔶️ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు

🔶️ఆరోగ్య రంగానికి రూ.13,840.44 కోట్లు
🔶️ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ.2,248.94 కోట్లు
🔶️ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు

20/05/2021

కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ నీ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చాలా మంచి ఆలోచన సీఎం గారు... 💐🙏💐

కోవిడ్ వల్ల తల్లి తండ్రులు కోల్పోయిన పిల్లలకు 10 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యాలని  ముఖ్యమంత్రి  జగనన్న నిర్ణయం.మనసున్న...
17/05/2021

కోవిడ్ వల్ల తల్లి తండ్రులు కోల్పోయిన పిల్లలకు 10 లక్షలు ఫిక్సెడ్ డిపాజిట్ చెయ్యాలని ముఖ్యమంత్రి జగనన్న నిర్ణయం.

మనసున్నొడి పరిపాలన ఇలాగే ఉంటుంది..
Thank u so much ❤️🙏

ఇలా డబ్బున్న మారాజులు అందరూ ఏదో వారికి చేతనైనంత బాధ్యత నెత్తికెత్తుకొని చేతులు కలిపితే చాలావరకు ఈ విపత్తు నుండి బయటపడొచ్...
17/05/2021

ఇలా డబ్బున్న మారాజులు అందరూ ఏదో వారికి చేతనైనంత బాధ్యత నెత్తికెత్తుకొని చేతులు కలిపితే చాలావరకు ఈ విపత్తు నుండి బయటపడొచ్చు. సోనూ చేసినదానిలో ఇదెంత అని పోలిక కరెక్ట్ కాదు. చేసేవాళ్ళను చిన్నబుచ్చవద్దు. వాళ్లకెంత మనసుంటే అంత చేయనీయండి. అపుడు ప్రజలు నిజంగా వచ్చాడయ్యో సామీ అని పాడతారు

12/05/2021

ఈ టైంలో చేయాల్సింది సహాయం కానీ.. రాజకీయం కాదు బాబు

ధైర్యంగా ఉండ‌మ్మా.. నేనున్నా!వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త శ్యామ్ క‌ల‌క‌డ మృతిపై ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్...
12/05/2021

ధైర్యంగా ఉండ‌మ్మా.. నేనున్నా!
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త శ్యామ్ క‌ల‌క‌డ మృతిపై ముఖ్య‌మంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో ఫోన్‌లో మాట్లాడారు. శ్యామ్ స‌తీమ‌ణి సుప్రియ‌కు ధైర్యం చెప్పారు. ధైర్యంగా ఉండండి అమ్మా మీకు నేనున్నా అంటూ భ‌రోసా ఇచ్చారు.🙏❤️
Miss u syam anna😔💐

24/04/2021
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ?...ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల కు అందించడమేంటి,,,? బొత్తిగా అర్ధమే కావడం లేదు కదూ...!!వివ...
24/04/2021

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏంటీ?...ఆక్సిజన్ తయారు చేసి కరోనా రోగుల కు అందించడమేంటి,,,? బొత్తిగా అర్ధమే కావడం లేదు కదూ...!!

వివరాల్లోకి వెళ్తే.... ఇనుమును తయారు చేసే క్రమంలో భూమి లో దొరికే హెమటైట్ లేదా ఫెర్రస్ ఆక్సైడ్ లేదా ఐరన్ ఓర్.. (Fe2O3)ను స్టీల్ గా మార్చాలి అంటే 2000 డిగ్రీల సెల్సీయస్ వద్ద బ్లాస్ట్ ఫర్నేస్ లో దానిని మండించి కరిగించాల్సి వుంటుంది.

ఈ ప్రక్రియలో కర్బన సమ్మెళనమైన "కోక్ " ను మరియు ఐరన్ ఓర్ ను దానికి కాల్షియం కార్బోనేట్ ను కలిపి మండిస్తూ ఇనుమును వేరు చేయడానికి ఆక్సిజన్ ను రసాయన ప్రక్రియ కోసం ఫర్నేస్ లోకి పంపుతారు..అంటే హెమటైట్ ముడి ఖనిజం నుండి స్టీల్ వేరు కావడానికి ఆక్సిజన్ (O2) కావాలన్న మాట.

మరి దానికి కావలసిన ఆక్సిజన్ ఎక్కడినుండి తేవాలీ ?
అందుకే స్టీల్ ఫ్యాక్టరీ సొంతంగా ఆక్సిజన్ తయారీ యూనిట్ ను నెలకొల్పుకుంది.

సరిగ్గా ఈ ఆక్సిజన్ తయారీ యూనిట్ నుండే మనకు ఆక్సిజన్ తయరు చేసి కరోనా రోగుల ప్రాణాలు నిలపడానికి సరఫరా చేస్తోంది.వాతావరణం లోని గాలి లో 21% ఆక్సిజన్ మరియు 78% నైట్రోజన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే..
Air compressor ద్వారా గాలిని తీసుకొని మలినాలు వేరుచేస్తారు. ప్రత్యేక కోల్ టవర్ ద్వార మలినాలు వేరు చేసి జియోలైట్ బెడ్ తో నింపబడిన PSA generator ద్వారా నైట్రొజన్ ను వేరు చేసి ఆక్సిజన్ సేకరిస్తారు.ఇలా పలుమార్లు శుధ్ధీకరించబడిన ఆక్సిజన్ ను మెడికల్ ఆక్సిజన్ గా సిలిండర్ లలొ నింపి సరఫరా చేస్తారన్నమాట.

ఇదిలా వుంటే లిక్విడ్ నైట్రోజన్ ను అతి శీతలీకారిణిగా వాడతారు.అంటే మన గ్రామాలలో మొన్నటివరకు "గోపాలమిత్ర"లు పెద్దపెద్ద ఫ్లాస్క్ లు తీసుకొచ్చేవారు గుర్తుందా?మూత తీయగానే పొగలు వస్తుండేవి..అదే లిక్విడ్ నైట్రొజన్ అన్నమాట.(పశువుల వీర్యాన్ని దీంట్లో నిల్వ చేస్తారు)

ఇదన్నమాట కధ...

"యాభైరెండు అంగుళాల ఛాతీ" కి కూడా అవసరమైతే ఊపిరిలూదడానికి సిద్దంగా ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు.

ఏదేమైనా ఊపిరి తీయాలనుకున్న సంస్థే నేడు దేశప్రజలకు ప్రాణాలువాయువును అందించి
ప్రజల ప్రాణాలు నిలబెడుతుందనడం లో ఎలాంటి సందేహం లేదు....జీవన్ మాస్టర్.

27/01/2021

రాజమండ్రీ
తాడితోట నుంచి రంభ ఊర్వశి కి వెళ్ళే ట్రాక్
దయచేసి గేట్ తిసిన తరువాత వెళ్ళండి ..👍
24/1/2021

Hats off Ananthapuram District Collector Ananthapuramగారు Gandham Chandrudu సార్ ❤️🙏❤️ఒక వారం పది రోజుల కిందట ఇదే ఫేస్ బ...
22/01/2021

Hats off Ananthapuram District Collector Ananthapuramగారు Gandham Chandrudu సార్ ❤️🙏❤️

ఒక వారం పది రోజుల కిందట ఇదే ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చూసాను అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ధర్మవరం దగ్గర అనుకుంటా ఏదో భూమి విషయంలో తగాదా వస్తే ఒక నిరుపేద బళ్ళారికి పోయి కలెక్టర్ థామస్ మన్రో గారికి తన సమస్య గురించి విన్నవించుకుంటే కలెక్టర్ గారు స్వయానా గుర్రం మీద పిర్యాదుదారుని స్వగ్రామానికి వచ్చి సమస్య పరిష్కరించి పోయారు అని ఆ పోస్ట్ సారాంశం.

అదెప్పుడో జమానా లో జరిగింది ఇప్పుడు వారిలా ఎవరు పట్టించుకుంటారు అని అనుకున్నాను.

రెండు రోజుల కిందట ఇదే ఫేస్ బుక్ లో బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డి పల్లి నాగిరెడ్డి పల్లి గ్రామాలకు చెందిన ఒక పది మందిదాక ఆడపిల్లలు మండల కేంద్రంలో ఉన్న ఉన్నత పాఠశాలకు రోజు 8 నుండి 10కిమీ.నడిచి పోతున్నాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మాకు బస్సు సౌకర్యం కల్పించండి అంటూ కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ ఒక వీడియో పోస్ట్ చేసారు. నేను కూడా ఆ వీడియో చూసాను

ఆ.. మాములే ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అనుకుని చూసి వదిలేసాను

కట్ చేస్తే ఇవాళ సేన్ షాకింగ్ న్యూస్
మా పల్లెల్లో అలజడి
బ్రాహ్మసముద్రం కు కలెక్టర్ సార్ వచ్చారంట అని
ఎందుకు అంటే

స్కూల్ పిల్లలు బస్ కోసం రిక్వెస్ట్ చేస్తూ వీడియో పెట్టారంట సార్ స్పందించి ఈ రోజు ఆ పల్లెల నుండి ఆర్టీసీ బస్ సర్వీస్ నడిపేలా మాట్లాడి ప్రారంభించడానికి వచ్చారు అని చెప్పారు.

ఒక్కసారిగా షాక్ తో నాకు మాటలు రాలేదు. ఏంటి ఒక వీడియో పోస్ట్ చేస్తే దానికి స్పందించి కలెక్టర్ సార్ ఇక్కడికి వచ్చాడా అని ఆశ్చర్యపోయాను.
నిజ్జంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సార్ చాలా గ్రేట్

అభినందనలు సార్ 💐💐❤️❤️❤️

వీళ్లంతా మనోళ్లే మన దేశము వాళ్ళు అమెరికా ప్రభుత్వములో బాగస్తులు  ... మన ఖ్యాతిని పెంచే తరుణం కదా ... ఏదైనా సాధ్యమే అనేదా...
20/01/2021

వీళ్లంతా మనోళ్లే మన దేశము వాళ్ళు అమెరికా ప్రభుత్వములో బాగస్తులు ... మన ఖ్యాతిని పెంచే తరుణం కదా ... ఏదైనా సాధ్యమే అనేదానికి నిదర్శనము ... These All Indian people in USA Government... What a wonderful and great moment to share ... This is symbol of hardworking and possibilities of auccess for anyone....🙏🙏🙏

Address

Tirupati

Website

Alerts

Be the first to know and let us send you an email when ᴋ ᴠ ᴄʜᴏᴡᴅᴀʀʏ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share