01/08/2026
గోళ్లుమన్న నర్సంపేట.. పెద్ది సుదర్శన్ రెడ్డికి వేలాదిగా అశ్రునివాళి 😥
👉గిర్నిబావి నుంచి నర్సంపేట మీదుగా నల్లబెల్లి వరకు ఉద్విగ్నంగా సాగిన అంతిమయాత్ర
👉కదిలివచ్చిన గులాబీ శ్రేణులు..
👉 అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం
Warangal 365 తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొని అశ్రునివాళులర్పించారు. శుక్రవారం ఉదయం గిర్నిబావి మొదలైన అంతిమయాత్ర నర్సంపేట మీదుగా నల్లబెల్లి వరకు చేరుకునే సరికి సాయంత్రం అయింది అంతమయాత్ర సందర్భంగా అడుగడుగునా ప్రజలు బారులు తీరి నిలబడి ఆయనకు తమ నేతకు వీడ్కోలు పలికారు.
అంతిమయాత్ర సందర్భంగా నర్సంపేట నియోజకవర్గమంతా శోకసంద్రంగా మారింది. గులాబీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి, వారి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. "పెద్ది సుదర్శన్ రెడ్డి అమర్ హై" అంటూ నినాదాలు చేస్తూ తెలంగాణ ఉద్యమానికి మరియు నర్సంపేట ప్రాంతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
అనంతరం నల్లబెల్లిలో రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులు, వేలాది మంది అభిమానుల సమక్షంలో అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి.