31/05/2024
విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో
ఉత్తరాంద్ర లో సి ఎస్ జవహర్ రెడ్డి అసైన్డ్ భూముల అక్రమ బదలాయింపు పై బాధితులతో కలసి మీడియా ముందుకు వచ్చిన జనసేన నాయకులు కార్పొరేటర్ పీతలమూర్తియాదవ్, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పొలమరిశెట్టి శ్రీనివాసరావు,
జనసేన నాయకులు కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ మాట్లాడుతూ
పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులకు సంబంధించిన అసైన్డ్ భూములు వైసీపీ నాయకులు, ముఖ్య అధికారులు దోచుకుంటున్నారు.
రాష్ట్ర సి ఎస్ జవహర్ రెడ్డి కుమారుడు బినామిలు పేరుతో అసైన్డ్ భూములు కొట్టేశారు.
జవహర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు రెవెన్యూ అధికారులు రైతులు భూములలో పోల్స్ వేయడానికి వచ్చారు.
రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు.
సి ఎస్ జవహర్ రెడ్డి ఆయన అనుచరులు పేద రైతులు భూములు కొట్టేయడానికి బరితెగిస్తున్నారు.
తమని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి రైతులు పక్షాన ఉంటుంది..బాధితులకు రక్షణ కల్పిస్తుంది.
బురాబంధులను కచ్చితంగా కటకటాల వెనక్కి పంపిస్తాం.
రైతులకు తెలీకుండా భూములు రిజిస్ట్రేషన్లు జరిగిపోతున్నాయి.
రెవెన్యూ విభాగం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఉన్న లొసుగులు ఉపయోగించుకొని భూ దోపిడీలకు పాల్పడుతున్నారు.
సి ఎస్ జవహర్ రెడ్డి బినామీ త్రిలోక్ ను వెంటనే అరెస్టు చేయాలి.
పోలీసులు, రెవెన్యూ అధికారులు , జిల్లా కలెక్టర్
ఈ వ్యవహారాన్ని జిల్లా కలెక్టర్, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాము.
అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.
జి ఓ రాకముందే అసైన్డ్ భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు.
మంత్రి మెరుగు నాగార్జున, ఇంచార్జ్ మంత్రి విడదల రజిని, ఐ ఏ ఎస్ అధికారులు ధనుంజయరెడ్డి, జవహర్ రెడ్డి అనుచరులు చేసిన భూ దోపిడీలపై ఆధారలతో సహా బయట పెడతాం.
*బాధిత రైతు అప్పన్న మాట్లాడుతూ
సి ఎస్ జవహర్ రెడ్డి మా భూములు చూసి వెళ్లారు.
అనంతరం అధికారులు, వైసీపీ నాయకులు, రౌడీలు వచ్చి భూమి ని వదిలి వెళ్లాలని మమ్మల్ని బెదిరించారు.
కొత్త జీవో ప్రకారం భూమి మాది కాదు అని అధికారులు అంటున్నారు.
అన్నవరం పంచాయితీ పెద్దలు మాకు
*బాధితురాలు చిట్టితల్లి మాట్లాడుతూ
అధికారులు మా భూమిలో స్తంభాలు పాతాడానికి వస్తే మేము అడ్డుకున్నాం.
కోర్టు కు వెళ్లిన చెల్లదని అధికారులు, వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు.
అన్నవరం పంచాయితీ కి చెందిన నాయకులు భూమి మాది అని అంటున్నారు.
ఈనెల 20వ తేదీన మా భూములు చూసుకొని వెళ్లారు.
అన్నవరం సర్పంచ్, ఎమ్ పి టి సి లు రౌడీ ముఖాలను తీసుకువచ్చి మమ్మల్ని బెదిరించారు