Vijay Chandra Bonela

Vijay Chandra Bonela MLA - Parvathipuram (Andhra Pradesh) | | | Join me in making a positive change in society!

Vijay Chandra Bonela - "Empowering Youth, Creating Employment, Eradicating Poverty - Together we Rise!"

Passionate about community development, corporate social responsibility, and electronic media. Dedicated to motivating youngsters to be leaders and entrepreneurs, and work towards eradicating poverty. Let's inspire and empower the present and future generation.

      #ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వంప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పా...
01/06/2026






#ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలన

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించడమే ప్రభుత్వ సంకల్పం

ఉదయం 5 గంటలకే ఇంటి వద్ద పెన్షన్ అందిస్తున్న సచివాలయ వ్యవస్థ అభినందనీయం

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర

పార్వతీపురం నియోజకవర్గంలో సోమవారం 14వార్డులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని పరిపాలన సాగిస్తున్నారని అన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా సంక్షేమ కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం 5 గంటలకే సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం గొప్ప విషయమని, ప్రజల పట్ల ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో అనే ఆందోళన లబ్ధిదారుల్లో ఉండేదని, ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పారు. పెన్షన్ పొందుతున్న ప్రతి వృద్ధుడు, ప్రతి వికలాంగుడు, ప్రతి వితంతువు ముఖంలో కనిపిస్తున్న ఆనందమే కూటమి ప్రభుత్వ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు.

పెన్షన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిన మహానేత నందమూరి తారక రామారావు ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి అనే ద్వంద్వ లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ధన్యవాదాలు తెలిపారు.

     అన్నగారి స్ఫూర్తితో ముందుకు సాగుదాం: ఎమ్మెల్యే విజయ్ చంద్రతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామ...
28/05/2026







అన్నగారి స్ఫూర్తితో ముందుకు సాగుదాం: ఎమ్మెల్యే విజయ్ చంద్ర

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చూపించిన మార్గంలో పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పిలుపునిచ్చారు. పార్వతీపురం మండలం నర్సిపురంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ నేటికీ అదే సిద్ధాంతాలతో ముందుకు సాగుతోందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా కొనసాగిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఆ ఆశయ సాధన కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.

నర్సిపురం గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిందని, ప్రతి ఇంటిపై టీడీపీ జెండా ఎగిరేలా అందరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు నర్సిపురం గ్రామాన్ని సందర్శించి నాగలి పట్టి దుక్కి దున్నిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు రాజాబాబు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

      #పార్టీ జెండా మోసిన వారికే గుర్తింపు.. కష్టపడిన కార్యకర్తలకే పదవులుస్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలిబలి...
27/05/2026






#పార్టీ జెండా మోసిన వారికే గుర్తింపు.. కష్టపడిన కార్యకర్తలకే పదవులు

స్థానిక ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి

బలిజిపేట, బర్లి మినీ మహానాడు సభల్లో ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పిలుపు

బలిజిపేట: తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే పార్టీ అధిష్టానం ఉన్నత పదవులు ఇచ్చి గౌరవిస్తుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. బుధవారం బలిజిపేట, బర్లి గ్రామాల్లో ఘనంగా నిర్వహించిన మినీ మహానాడు సభల్లో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.

పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న కార్యకర్తలే నేడు కీలక పదవుల్లో కొనసాగుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగాలు, అంకితభావమే తెలుగుదేశం పార్టీ బలమని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమానికి అంబాసిడర్‌గా నిలుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. కేవలం 23 నెలల్లోనే రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించి అభివృద్ధికి పెద్దపీట వేశారని తెలిపారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పచ్చ జెండా రెపరెపలాడేలా గ్రామస్థాయి నుంచి ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన “స్త్రీ శక్తి” పథకం మహిళల ఆర్థిక సాధికారతకు ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. మహిళల అభ్యున్నతి కోసం డ్వాక్రా వంటి పథకాలను తీసుకువచ్చిన ఘనత పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకే దక్కుతుందని గుర్తుచేశారు.

ఎన్టీఆర్ ఆశయాలనే మార్గదర్శకంగా తీసుకుని చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ రాష్ట్ర పురోగతికి బాటలు వేస్తున్నారని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు.

      #11 క్లస్టర్లలో ఘనంగా తెలుగుదేశం పండుగ: ఎమ్మెల్యే విజయ్ చంద్రపార్వతీపురం: తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన మహా...
27/05/2026






#11 క్లస్టర్లలో ఘనంగా తెలుగుదేశం పండుగ: ఎమ్మెల్యే విజయ్ చంద్ర

పార్వతీపురం: తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన మహానాడు-2026 వేడుకలను పార్వతీపురం నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. పార్వతీపురంలో జరిగిన మహానాడు కార్యక్రమాలను పార్టీ పరిశీలకుడు కోరాడ రాజబాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని మహానాడు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన మహత్తర సందర్భంగా మహానాడును అభివర్ణించారు.

ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పొదుపు చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 1,875 క్లస్టర్లలో మహానాడు వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.

పార్వతీపురం నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణుల సమక్షంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాలు కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని ఎమ్మెల్యే విజయ్ చంద్ర తెలిపారు. ఈ కార్యక్రమాలు పార్టీ కార్యకర్తలకు మరింత స్ఫూర్తినిస్తూ, భవిష్యత్ కార్యాచరణకు మార్గనిర్దేశం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

26/05/2026

పార్వతీపురం: తెలుగుదేశం పార్టీ గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గారు పిలుపునిచ్చారు.

మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించాల్సిన మహానాడు వేడుకలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పొదుపు చర్యల పిలుపు మేరకు క్లస్టర్ స్థాయిలో నిర్వహించాలని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ గారు నిర్ణయించినట్లు తెలిపారు. ఆ నిర్ణయంతో పార్వతీపురంలోనే మహానాడు నిర్వహించే అవకాశం దక్కడం తమకు గౌరవకరమైన విషయమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ వివరించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసమే పుట్టి, ప్రజల కోసమే నిరంతరం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

బుధవారం ఉదయం 9 గంటలకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ గారు కార్యకర్తలను ఆన్లైన్ ద్వారా ఉద్దేశించి ప్రసంగించనున్నారని తెలిపారు. ఆ సమయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ తప్పనిసరిగా వేదిక వద్దకు చేరుకుని వర్చువల్ కార్యక్రమంలో పాల్గొని మహానాడును విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విజయ్ చంద్ర గారు విజ్ఞప్తి చేశారు.





తెలుగుదేశం సైనికులారా రండి! డిజిటల్ మరియు ప్రత్యక్షంగా  క్లస్టర్ స్థాయిలో జరిగే ఈ ప్రత్యేక మహానాడు-2026లో ఉత్సాహంగా పాల్...
26/05/2026

తెలుగుదేశం సైనికులారా రండి!

డిజిటల్ మరియు ప్రత్యక్షంగా క్లస్టర్ స్థాయిలో జరిగే ఈ ప్రత్యేక మహానాడు-2026లో ఉత్సాహంగా పాల్గొందాం.

ఈ ప్రత్యేకమైన మహానాడును మరింత ప్రత్యేకంగా ప్రతి క్లస్టర్లోనూ పండుగలా జరుపుకుందాం.




      #నర్సిపురంలో ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్రపార్వతిపురం నియోజకవర్గ అభివృద్ధ...
26/05/2026






#నర్సిపురంలో ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర

పార్వతిపురం నియోజకవర్గ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. సోమవారం పార్వతిపురం మండలం నర్సిపురంలో నూతనంగా ఏర్పాటు కానున్న ఎంఎస్‌ఎంఈ ఇండస్ట్రియల్ పార్కుకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర శంకుస్థాపన చేశారు. ముందుగా భూమి పూజ నిర్వహించి, సాంప్రదాయబద్ధంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ, తన సొంత గ్రామమైన నర్సిపురంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పార్కు ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు, యువ పారిశ్రామికవేత్తలు ఎదగడానికి మంచి వేదికగా నిలుస్తుందని తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 37 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో, నర్సిపురంకు కూడా పార్కు మంజూరు కావడం గర్వకారణమన్నారు. వ్యవసాయ ఆధారిత పార్వతిపురం నియోజకవర్గంలో పరిశ్రమలు అవసరమని ముఖ్యమంత్రిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించి ఈ పార్కు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొబ్బిలిలో మాత్రమే ఎంఎస్‌ఎంఈ పార్కు ఉండేదని, ఇప్పుడు పార్వతిపురం ప్రాంతానికి కొత్త ఇండస్ట్రియల్ పార్కు రావడం స్థానిక అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు

     #మే 27, 28 తేదీలలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమ ఏర్పాట్లపై పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్...
26/05/2026





#మే 27, 28 తేదీలలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమ ఏర్పాట్లపై పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర గారు, నియోజకవర్గ పరిశీలకులు శ్రీ కోరాడ రాజబాబు గారితో కలిసి పార్వతీపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్న మహానాడు కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని 11 క్లస్టర్లలో ఘనంగా నిర్వహించాలని నాయకులకు సూచించారు. ప్రతి క్లస్టర్‌లో పార్టీ శ్రేణులు, నాయకులు సమన్వయంతో పనిచేసి మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం పార్వతీపురం పట్టణంలోని శుభమస్తు కళ్యాణమండపంలో నిర్వహించనున్న క్లస్టర్-5 మహానాడు ఏర్పాట్లను నాయకులతో కలిసి వెళ్లి పరిశీలించారు. కార్యక్రమం విజయవంతం అయ్యేలా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా పూర్తి చేయాలని సంబంధిత నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యక్రమ నిర్వహణ, కార్యకర్తల భాగస్వామ్యం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహానాడు విజయానికి సమిష్టిగా కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.

Address

Parvathipurum, Andhra Pradesh
Visakhapatnam
530041

Alerts

Be the first to know and let us send you an email when Vijay Chandra Bonela posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vijay Chandra Bonela:

Share