01/02/2022
*కేంద్ర బడ్జెట్ హైలైట్స్*
కరోనా మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలమనే విశ్వాసం మనకుంది.
ప్రపంచంలోనే మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
వచ్చే 25 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ను రూపొందించాం.
పేద, మధ్య తరగతి పురోగతి కోసం కృషి చేస్తున్నాం.
సాంకేతిక ఆధారిత అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాం.
జాతీయ రహదారులను 25 వేల కిలో మీటర్లకు పెంచుతాం.
అత్యాధునిక వసతులతో కొత్త వందే భారత్ రైళ్లు. కవచ్ పథకం కింద 2 వేల కిలోమీటర్లు. 400 కొత్త జనరేషన్ వందే భారత్ రైళ్లు. 100 పీఎం గతి శక్తి కార్గో టెర్మినల్స్.
దేశంలో నాలుగు ప్రాంతాల్లో లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు.
పర్వతమాల ప్రాజెక్టు కింద 8 రోప్ వేల నిర్మాణం. 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కో రోప్ వే నిర్మాణం.
డ్రోన్ టెక్నాలజీని పెంచేందుకు డ్రోన్ శక్తి పథకం.
ఎయిర్ ఇండియా బదిలీ సంపూర్ణంగా పూర్తయింది.
సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహకాలను అందిస్తాం.
తృణ ధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్ కు ప్రత్యేక ప్రోత్సాహకాలు.
2023ను తృణ ధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తున్నాం.
వరి, గోధుమ మద్దతు ధర చెల్లింపులకు రూ. 2.7 లక్షల కోట్లు.
రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు పథకం.
ప్రాంతీయ భాషల్లో విద్యాభివృద్ధికి టీవీ ఛానెళ్లు.
డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్శిటీ.
వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన.
ఆత్మ నిర్భర్ భారత స్ఫూర్తితో 16 లక్షల ఉద్యోగాలను కల్పించాం.
ఎయిర్ ఇండియా బదిలీని సంపూర్ణంగా పూర్తి చేశాం.
రైల్వేలో సరకుల రవాణాకు సరికొత్త పథకం.
కృష్ణా-గోదావరి, కృష్ణా-పెన్నా ప్రాజెక్టులకు డీపీఆర్ సిద్ధమైంది.
ఐదు నదులకు చెందిన ప్రాజెక్టుల నీటి పంపకాలకు డీపీఆర్ సిద్ధమైంది.
రూ. 44,605 కోట్లతో కేన్-బేట్వా నదుల అనుసంధానం.
ఎంఎస్ఎంఈలకు లోన్లు ఇచ్చేందుకు నిధులను మరో 2 లక్షల కోట్లను పెంచుతున్నాం.
2 లక్షల అంగన్ వాడీలలో వసతులను మెరుగుపరుస్తాం.
ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులను పెంచుతున్నాం.
డిజిటల్ పేమెంట్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు. కమర్షియల్ బ్యాంకులు ద్వారా 75 జిల్లాల్లో 75 యూనిట్ల ఏర్పాటు.
బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ ఏడాదిలోనే డిజిటల్ కరెన్సీ.
అత్యాధునిక టెక్నాలజీతో చిప్ ఉన్న ఈ-పాస్ పోర్టులు.
8 ప్రాంతీయ భాషల్లో ల్యాండ్ రికార్డులు.
కరోనా వల్ల విద్యను కోల్పోయిన విద్యార్థుల కోసం వన్ క్లాస్ వన్ టీవీ ఛానల్.
2022-23లో 5జీ సేవలను ప్రైవేట్ టెలికాం సంస్థలు అందుబాటులోకి తీసుకొస్తాయి.
2025 కల్లా భారత్ ఇంటర్నెట్ ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఆప్టికల్ ఫైబర్ సౌకర్యం.
అన్ని పోస్టాఫీసులను కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ తో అనుసంధానం చేస్తాం.
రక్షణ రంగానికి కావాల్సిన వాటిని 68 శాతం దేశీయ పరిశ్రమల నుంచే సమకూర్చుకుంటాం. రక్షణ రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం.
పురుగు మందుల వినియోగం కోసం డ్రోన్ల సహకారం.
యానిమేషన్ రంగాన్ని ప్రోత్సహించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
పీఎం ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం.
ఉపాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ.
అన్ని మంత్రిత్వ శాఖల్లో కాగిత రహిత వ్యవస్థను తీసుకొస్తాం.
బొగ్గును రసాయనంగా మార్చేందుకు ప్రత్యేక పథకం.
విద్యుత్ వాహనాల పెంపులో భాగంగా బ్యాటరీల తయారీకి ప్రోత్సాహకాలు.