12/05/2026
తార్నాకలో వీర హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తార్నాక ఎక్స్ రోడ్డు గణపతి దేవాలయంలో మాజీ మేయర్ బండ కార్తీక చంద్రారెడ్డి దంపతులు హనుమాన్ స్వామికి ఆకు పూజ నిర్వహించారు. జై హనుమాన్, జై శ్రీరామ్ నినాదాలతో ప్రాంతం మారుమోగింది.
ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు గారు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు, చింతల రామచంద్రారెడ్డి గారు, మర్రి శశిధర్ రెడ్డి గారు, వేముల అశోక్ గారు, నీ నవత రవి నాయక్ గారు, బద్దం మైపాల్ రెడ్డి గారు, బండారు విజయలక్ష్మి గారు, రాజశేఖర్ రెడ్డి గారు,వెంకట్ రమణి గారు,భరత్ గౌడ్ గారు, జిల్లా నాయకులు, సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు,భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ నిర్వహించగా, ఆర్కెస్ట్రా బృందం ఆలపించిన జై శ్రీరామ్, ఆంజనేయ భక్తి గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి.