CITU - Tadepalligudem

CITU - Tadepalligudem కార్మికులు రాజ్యాధికారం చేపట్టాలన్నదే సిఐటియు ప్రధాన లక్ష్యం

మతం గురించి ఐన్‌స్టీన్‌ ఏమన్నాడు?ఐన్‌స్టీన్‌ దృష్టిలో దేవుడంటే ప్రకృతి, ప్రకృతి ధర్మాలు మాత్రమే! ఆయన అతీంద్రియ శక్తులను ...
14/03/2026

మతం గురించి ఐన్‌స్టీన్‌ ఏమన్నాడు?

ఐన్‌స్టీన్‌ దృష్టిలో దేవుడంటే ప్రకృతి, ప్రకృతి ధర్మాలు మాత్రమే! ఆయన అతీంద్రియ శక్తులను గానీ, క్రైస్తవ మతంలోని ట్రినిటీని గానీ, ఏసుక్రీస్తు మహిమలను గానీ, ఆత్మ అమరత్వాన్ని గానీ, గ్రహబలం గురించి గానీ ఎప్పుడూ నమ్మలేదు. 'దేవుడు ఈ విశ్వంతో ఎప్పుడూ ఆటలాడుకోడు' అని ఐన్‌స్టీన్‌ తరచుగా అంటుండేవాడు. విశ్వంలో యాదృచ్ఛికమైన గతులుండవు. గణిత సూత్రాలకు అనుగుణంగానే ప్రకృతి నడుస్తూ వుంది' అని కచ్చితమైన అభిప్రాయం ఉన్నవాడాయన. ఆయన మతం అనే మాటకు మరొక అర్థం చెప్పాడు. 'దేవుడితో సంబంధం లేకుండా మనిషి నైతికతతో మెలిగి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే' మతం అన్నాడు. ఆ అర్థంతోనే మతం అభిమతం మానవాళికి అవసరమన్నాడు.

అయితే ఈ అంశాన్ని ఆయన చెప్పిన స్థాయిలోకి వెళ్లి ఆలోచించాల్సి వుంటుంది. అర్థం చేసుకోవాల్సి వుంటుంది. మతం, దేవుడు, అనే మూఢత్వంలో కొట్టుకుపోయే జనానికి ఈ విషయం అర్థం కావడం కష్టమే! అయితే అర్థం కానంత క్లిష్టమైంది కూడా కాదు. వంశపారంపర్యంగా జీర్ణించుకుంటూ వచ్చిన సనాతన భావజాలాన్ని కొంచెం పక్కన బెట్టి, మెదడులో ఏ మూలో దాక్కుని ఉన్న హేతువును నిద్ర లేపి, విశాల హృదయంతో కొంచెం కొత్తగా ఆలోచిస్తే చాలు, ఐన్‌స్టీన్‌ భావం మనకు అందుబాటులోకి వస్తుంది.

'మన ఈ మెటీరియలిస్టిక్‌ యుగంలో మానవాళి శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న, తపన పడుతున్న శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, వైజ్ఞానిక రచయితలే అత్యంత విశ్వసనీయమైన మతస్తులు' అని అన్నాడాయన. మళ్లీ ఈ అంశాన్ని కూడా అదే స్థాయిలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాడుకలో ఉన్నట్లుగా మతస్థులు అనే పదాన్ని 'ఒక మతాన్ని నమ్మేవారు' అని అర్థం చేసుకోవాలని వైజ్ఞానిక స్పృహతో ప్రయత్నించే వారికి, తహతహలాడేవారికి తప్పక అర్థమౌతుంది. మౌఢ్యం గుంజకు తమను తాము కట్టేసుకున్న వారికి అర్థం కాకపోవచ్చు. బంధనాలను తెంచుకుని స్వేచ్ఛగా ముందుకొస్తే అర్థమవుతుంది. వ్యక్తులు ఊహించుకున్న 'దేవుణ్ణి' ఐన్‌స్టీన్‌ ఏనాడూ నమ్మలేదు. ఆ విషయాన్ని ఆయన చాలా సందర్భాల్లో విస్పష్టంగా చెప్పారు కూడా! 'తను సృష్టించిన వాటిని తానే ఆదుకోలేక, మళ్లీ తనే శిక్షించే దేవుణ్ణి నేను ఊహించుకోలేను. హేతువును, భౌతిక శాస్త్ర సూత్రాలకు వ్యతిరేకంగా ఆయన చూపే లీలలను కూడా నేను ఊహించుకోలేను.

అసలు దేవుడంటే ఎవరు? మనిషి బలహీనతకు ప్రతిబింబం! మనిషి భయంలోంచి, అజ్ఞానంలోంచి, ఊహల్లోంచి, భ్రమల్లోంచి రూపుదిద్దుకున్న భగవంతుడు చూపిన లీలలకు, చూపాడని చెప్పుకుంటున్న మహిమలకు ఆధారాలే లేవు. అలాంటప్పుడు మనం వాటిని నమ్మేదెట్లా?' అన్నది ఐన్‌స్టీన్‌ సంధించిన ప్రశ్న!
దేవుడనే ఊహ-మానవ ప్రాథమిక శాస్త్రాల (రచనల) కల్పన. దాన్ని ఆయన ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. మానవాతీత శక్తిగా కూడా పరిగణించలేదు. అసంపూర్ణంగానైనా వినయంగా నమ్రతతో గ్రహించే ఈ విశ్వం క్రమబద్ధత, దాని సామరస్యంలోని అందం మానవాళిని ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఆ ఆశ్చర్యాన్ని ఆనందించాలి. ఆస్వాదించాలి. అనుభవించాలి. ఐన్‌స్టీన్‌ అదే చేశాడు. అదే చేయమన్నాడు. అంతేకాని మరొకటి కాదు. మతానికీ శాస్త్రానికీ మధ్య జరుగుతున్న ఘర్షణకు మూలకారణం వ్యక్తిగత దైవ విశ్వాసం.

వైజ్ఞానిక శాస్త్రాలకు రుజువులున్నాయి. దైవ విశ్వాసానికి ఉండవు. రుజువులున్నదానితో రుజువులు లేనిది ఘర్షణ పడుతోంది. రుజువులు లేని దైవ విశ్వాసం అనేది లేకపోతే మానవులంతా వైజ్ఞానిక ప్రగతిని విశ్వసిస్తారు. అప్పుడు ఘర్షణ ఉండడానికి వీలుండదు. ఇప్పుడు సమాజం ఎలా వుందీ? వైజ్ఞానిక ప్రగతి ఫలితాలను అనుభవిస్తూ, దైవ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు కదా! అందుకే ఘర్షణ జరుగుతోంది. వైజ్ఞానిక ఫలితాలు అనుభవించకుండా దైవ విశ్వాసంలో బతకగలిగితే బతకాలి. అప్పుడు కూడా ఘర్షణ ఉండదు. బాబాలు, స్వాములు, మాతాజీలు వగైరా సామాన్యుడి కన్నా ఎక్కువ వైజ్ఞానిక ఫలితాలు అనుభవిస్తున్నారు. మరో వైపు మూఢత్వం పెంచి పోషిస్తున్నారు. నైతికతను మరచి, అత్యంత హీనంగా ప్రవర్తిస్తున్నారు. అందుకే ఘర్షణ. పోనీ ఈ ఘర్షణ తగ్గించడానికి సైన్సును సైన్సు పరిశోధనలను పక్కన పెడదామా అంటే ఎలా వీలవుతుంది? సైన్సు లేకుండా ఊపిరే పీల్చలేం. శ్వాసక్రియ జీవశాస్త్రంలో ఒక భాగం. ఆధ్యాత్మిక, ధార్మిక, తాత్విక ధోరణులలో ఎటునుంచి ఎటుతిప్పి చెప్పినా దైవ భావన-ఒట్టి విశ్వాసమే! ఈ విశ్వాసంతో సంతానోత్పత్తి జరగదు. ఆహారోత్పత్తి జరగదు. సమాజం పెరగదు. ఎదగదు.

విశ్వ రహస్యాలను జీవ రహస్యాలను మనిషి అర్థం చేసుకుంటూ ఒక్కొక్కటి ఆవిష్కరించుకుంటూ వస్తున్నాడు. కనుకనే, మనం ఈ అత్యాధునిక సాంకేతిక యుగంలో ఉన్నాం. మునుల వల్లనో, రుషుల వల్లనో, ధార్మిక ఆధ్యాత్మిక గురువుల వల్లనో ప్రపంచం పురోగతి సాధించలేదు. అలాగే మత విశ్వాసాల వల్ల ఘర్షణలు జరిగాయే గాని, శాంతి స్థాపించబడలేదు.

'ఎవరో నమ్ముకున్న దేవుడు లేడని నేనెందుకు నిరూపించాలి? అది నా పని కాదు. నమ్ముతున్న వారే, వారెందుకు నమ్ముతున్నారో నిరూపించుకోవాలి. దేవుడున్నాడని మాట్లాడితే నేనొక అబద్దాలకోరునవుతాను. అయినా, వాస్తవాలకు నిరూపణలు వెతకొచ్చు. అవాస్తవాలకు నిరూపణలెక్కడీ' అని ప్రశ్నించిన ఐన్‌స్టీన్‌ మత ప్రచారకులకు కొన్ని సూచనలు ఇచ్చాడు. 'మత ప్రచారకులంతా తమ వ్యక్తిగత దేవుడి సిద్ధాంతాన్ని వదిలేయాలి. తమ ఆధీనంలో ఉన్న పాప పుణ్యాలను, భయాలను, నిరాశావాదాన్ని. పునర్జన్మలను మొత్తానికి మొత్తంగా తుడిచేసుకోవాలి. నైతిక విలువలను కాపాడే పోరాటంలో సామాన్యులతో కలసి రావాలి. 'కార్యాకారణ సూత్రం'పై పని చేసే ఈ విశాల విశ్వాన్ని అర్థం చేసుకోవాలి. జరిగిన జరుగుతున్న పరిణామాల మీద అవగాహన పెంచుకోవాలి. మతంపై నుండి దృష్టి మరల్చి, సామాజిక అసమానతలపై దృష్టి పెట్టాలి'.

మానవుడి అమరత్వంపై తనకు నమ్మకం లేదని, నీతి అనేది మానవాతీత శక్తి కాదని, మానవుడికి సంబంధించిందేనని.. అది అతడు తన ఆత్మ విశ్వాసంతో సాధించుకోవచ్చని, ఈ విషయంలో దేవుడి ప్రమేయమే లేదని కరాఖండిగా చెప్పిన ఐన్‌స్టీన్‌ మరణానంతర జీవితాన్ని కొట్టి పారేశాడు. భౌతికంగా మనిషి చనిపోయిన తర్వాత జీవి బతికే ఉండడం ఆత్మలు తిరుగాడుతూ ఉండడం మూఢ నమ్మకాలేనన్నాడు. మనిషి అంతర్గత అనుభవాలన్నీ పునరుత్పత్తులతో, సునిశిత భావ సముచ్ఛయంతో ముడిపడి ఉంటాయి. దేహమే లేకపోయినప్పుడు ఆత్మకు అర్థమే లేదు. మానసికంగా బలహీనులైన వ్యక్తులు ఆత్మన్యూనతా భావంతోనూ, భయంతోనూ లేదా ఎదుటివారిని మోసగించాలన్న కుట్రతోనూ అలాంటి ఆలోచనలను ప్రచారం చేస్తుంటారు. లేని ఆత్మలను జనం గుండెల్లో పదిలపర్చుతుంటారు.
సరే, గతం గడిచిపోయింది. ఏం చేసినా దాన్నిక మార్చలేం కానీ, సుఖాంతమయ్యే ఒక కొత్త ప్రారంభానికి బీజం వెయ్యొచ్చుకదా! ఆ దిశలో మనం ఎందుకు ఆలోచించకూడదు? థియోసఫీ, స్పిర్చువలిజం వంటి వన్నీ మత గ్రంథాల చుట్టూ తిరిగే గందరగోళాలే! అసలు మత గ్రంథాలన్నీ అవాస్తవాలు, కల్పిత గాథలు అని అనుకున్న వారికి కొత్త ఆలోచనలు వచ్చే అవకాశముంటుంది.

గానుగెద్దుల్లా కళ్లు మూసుకొని తిరిగే వారికి, అందులోనే శాంతి, సౌఖ్యం ఉన్నాయని అనుకునే వారికి మనం ఏమీ చెప్పలేం. వైజ్ఞానిక శాస్త్రం నైతికతను కించపరుస్తుందన్న అపవాదు వుంది. కానీ, అది నిజం కాదు! మానవుడి నైతిక ప్రవర్తన సానుభూతి, విద్య, వైద్యం, సామాజిక అవసరాలు, స్నేహ బంధనాల మీద ఆధారపడి ఉంటుంది. అందులో మతానికి చోటే లేదు. అవసరమే లేదు. మత ప్రమేయం లేకుండా కూడా మానవులుగా, మహనీయులుగా గొప్ప విలువలతో జీవించిన వారున్నారు. మరణం తర్వాత లభించే అనుగ్రహం కోసమో, శిక్షలకు గురవుతామన్న భయంతోనో మనిషిని నిలదీయడం గానీ, కృంగదీయడం గానీ, మోసగించడం గానీ, అమానుషం! అపరిపక్వం! అసంబద్ధం!!

__✍️Devaraju Maharaju gaaru

తాడేపల్లిగూడెం 2026 మార్చి 14:*దుకాణాలు, వాణిజ్య సంస్థలు, షాపులు రోజుకు 24 గంటలు తెరిచి ఉండవచ్చని కార్మిక శాఖ జారీ చేసిన...
14/03/2026

తాడేపల్లిగూడెం 2026 మార్చి 14:
*దుకాణాలు, వాణిజ్య సంస్థలు, షాపులు రోజుకు 24 గంటలు తెరిచి ఉండవచ్చని కార్మిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు* తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అపరాల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) కార్మికులు 24 గంటలు దుకాణాలు వాణిజ్య సంస్థలు, షాపులు తెరిచి ఉండవచ్చని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా తాడేపల్లిగూడెం స్థానిక పోలీస్ ఐల్యాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు
‌ *ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ* దుకాణాలు,వాణిజ్య సంస్థలు రోజుకు 24 గంటలు తెరిచి ఉండవచ్చని,ఆ మేరకు కార్మికులకు పని చేసేందుకు అనుమతి ఇస్తూ కార్మిక శాఖ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు.ఈ ఉత్తర్వులు కార్మికులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఇటువంటి ముఖ్యమైన అంశాలపై కనీసం కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు.ఇప్పటికే షాపులు, సంస్థలలో పనిచేసే కార్మికుల పని గంటలను ఎనిమిది గంటలు నుండి పది గంటలకి పెంచిందని వాపోయారు. షాపుల్లో కార్మికులు రోజుకు పది గంటలు నుండి పన్నెండు గంటలు డబుల్ ఓటీ లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. 24 గంటలూ సంస్థలు,షాపులు తెరిచి 24 గంటలూ షాపులు ఉన్నట్లయితే ఎనిమిది గంటల పని విధానం ప్రకారం మూడు షిప్టులు ఉండాల్సి ఉందన్నారు. ఇప్పుడు కనీసం ఆ పద్ధతిని కూడా పేర్కొనకుండా పని చేయమనడం కార్మికులను కట్టుబానిసలుగా మార్చడానికేనని దుయ్యబట్టారు.48 గంటలు దాటితే ఓటీకి అర్హత ఉంటుందని చెప్పడం కార్మికులను మోసపుచ్చడమేనని తెలిపారు. షాపులు, సంస్థలకు రిజిస్ట్రేషన్ రెన్యువల్స్ లేకుండా కేవలం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటేచాలని చెప్పడం కూడా కార్మిక చట్టాలు పాటించని యజమానులను రక్షించడానికేనని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు అన్నింటినీ కలుపుకొని దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి చిటికిన రాము, అయినాల సత్యనారాయణ, అడపా లోవ,యడ్ల శ్రీను,దాసరి రాజు,సుందరపు అప్పలనాయుడు వెదుళ్ళ రమణారావు, రౌతు పాపి నాయుడు, ఇల్ల గోవిందరావు, పెంటకోట గోవిందు,బద్ది నాగేశ్వరరావు, చిట్టేటి సత్యనారాయణ,బుద్దాల తాతారావు తదితరులు మరియు అపరాల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.







ఆచంట,పోడూరు,2026 మార్చి 10:-*గ్యాస్ బండ గుది బండ అయిందని**పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కా...
10/03/2026

ఆచంట,పోడూరు,2026 మార్చి 10:-
*గ్యాస్ బండ గుది బండ అయిందని*
*పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి. గోపాలన్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు*
సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి గోపాలన్ నేతృత్వంలో పదమూడో వ రోజు ప్రజా చైతన్య పాదయాత్ర పోడూరు గ్రామం నుండి ప్రారంభించారు. పోడూరు గ్రామ ప్రజలు, వ్యాపారస్తులు తో పోడూరు హెచ్.పి. గ్యాస్ స్టేషన్ వద్ద గ్యాస్ ధరలు పెంపునకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి, అరికట్టాలి అధిక ధరలను, ఏలే వాడికి బుద్ధే లేదా పెరిగే ధరలకు హద్దే లేదా,సిగ్గో సిగ్గు గ్యాస్ ధరలు పెంపు,జిందాబాద్ సిపిఎం అంటూ పెద్ద ఎత్తున నాదాలు చేశారు.
*ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి. గోపాలన్ మాట్లాడుతూ* ఇరాన్ పై అమెరికా ఇశ్రాయేలు యుద్ధం నేపథ్యంలో మన దేశంలో బిజెపి ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తుందని అన్నారు. యుద్ధం నేపథ్యంలో మన దేశంలో నలబై రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రారంభమైన వారం రోజుల్లోనే గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గృహాలకు వాడే గ్యాస్ సిలిండర్ కు 60 రూపాయలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కు 115 రూపాయలు పెంచడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారు అని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశవ్యాప్తంగా టీ,కాఫీ టిఫిన్లు,భోజనాలు రేట్లు విపరీతంగా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పోరేట్లకు, పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి సామాన్యులకు సబ్సిడీ ఎత్తివేసే చర్యలు చేపడుతుందని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.మన దేశానికి ఇరాన్ ఎంతో సహాయం చేసిందని గుర్తు చేశారు. మన దేశానికి మంచి చేసిన దేశాలు పై యుద్ధాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించాలని మండిపడ్డారు. టిడిపి కూటమి ప్రభుత్వం గ్యాస్ ధర పెంపు పై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఉపాధి లేక అల్లాడిపోతున్న ప్రజలకు గ్యాస్ ధరలు పెంపు వలన అనేక ఇబ్బందులు గురవుతారు అని కేంద్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. పెరిగిన గ్యాస్ ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే కృషి చేయాలని,లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన, ధర్నా,నిరసన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి తగు బుద్ధి చెప్తామని హెచ్చరించారు.‌ ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్యనారాయణ కేతా గోపాలన్, కే.క్రాంతి బాబు, ఏ.అజయ్ కుమారి,పొగాకు పూర్ణ, సూర్నీడివెంకటేశ్వరరావు, గొర్ల రామకృష్ణ మరియు మల్లిపూడి ఆంజనేయులు, కరెడ్ల రామకృష్ణ, పిల్లి ప్రసాదు, వెంకటరత్నం, భూపతి సత్యనారాయణ, దత్తి రాము, పెనగంటి దుర్గా,సి.హెచ్.వరలక్ష్మీ, కృష్ణంరాజు,షేక్ వలీ, పోతు శ్రీను, మద్దాల సత్యనారాయణ,నంగిరెడ్డి సాయి తేజ,పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.





తాడేపల్లిగూడెం 2026 మార్చి 9:-*పెంచిన గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ స...
09/03/2026

తాడేపల్లిగూడెం 2026 మార్చి 9:-
*పెంచిన గ్యాస్ ధరలు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు* తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐల్యాండ్ వద్ద గ్యాస్ పెంపునకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలను, అరికట్టాలి అధిక ధరలను, నశించాలి కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి, ఏలే వాడికి బుద్దే లేదా, పెరిగే ధరలకు హద్దే లేదా, జిందాబాద్ సిపిఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
*ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ* కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మహిళా దినోత్సవం రోజున గ్యాస్ ధరలు రేట్లు పెంచడాన్ని దుయ్యబట్టారు. గృహాలకు వాడే గ్యాస్ బండ కు 60 రూపాయలు వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ బండ కు 115 రూపాయలు పెంచడం వలన మన జిల్లాలో ప్రజలపై నెలకు 30 కోట్ల భారం పడుతుందని తెలిపారు. జిల్లాలో ఆరు లక్షల 30 వేల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని తెలిపారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత సబ్సిడీతో కూడిన గ్యాస్ సప్లై చేస్తున్నామని ఓ ప్రక్కన చెప్తూనే వంట గ్యాస్ బండ కు 60 రూపాయలు కమర్షియల్ గ్యాస్ బండ కు 115 రూపాయలు పెంచి ప్రజలపై ఆర్థిక భారాన్ని వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ పై అమెరికా,ఇశ్రాయేలు యుద్ధాలు జరుగుతున్న నేపథ్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనదేశంలో 40 రోజుల వరకు ఆయిల్ నిక్షేపాల కు కొదువ లేదని ప్రకటించిన వెంటనే గ్యాస్ ధరలు పెంచడం హాస్యాస్పదంగా ఉందని వాపోయారు. వాణిజ్య సిలిండర్ రేటు పెరగడం వల్ల హోటల్లో టీ,కాఫీ, టిఫిన్లు, భోజనాలు రేట్లు విపరీతంగా పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మీదగాని,ఇరాన్ పై అమెరికా ఇశ్రాయేలు యుద్ధం మీద గాని మోడీ ప్రభుత్వం మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు 17.5 లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు కల్పించి,బ్యాంకుల్లో డబ్బులు ఎగ్గోట్టిన కార్పొరేట్ సంస్థలకు పదివేల కోట్ల రూపాయలు పన్ను బాకీలు రద్దు చేసిన ఈ మోడీ ప్రభుత్వం సామాన్య మానవులకు ఇచ్చే సబ్సిడీ ఎత్తివేసి ప్రజలపై భారాలు మోపడం సరైనది కాదని విమర్శించారు.పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జవ్వాది శ్రీను మాట్లాడుతూ* కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు కట్టెల పై వంటలు చేసుకునేలా చేశారని దుయ్యబట్టారు.గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో పట్టణంలో మహిళలను పెద్ద ఎత్తున సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తగు బుద్ధి చెప్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి జవ్వాది శ్రీను, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, నరమాల కృష్ణ,వడిసెల శ్రీనివాసరావు, షేక్ అప్పారావు,కొమ్మిరెడ్డి ఉదయ్ కుమార్,గొర్రెల వంశీ,కన్నంరెడ్డి శివాజీ,లచ్చుపతుల శ్రీను,విశంశెట్టి అప్పారావు,కరణం శ్రీను తదితరులు పాల్గొన్నారు.






ఇరగవరం 2026 మార్చి 7:-*ఇరగవరం జగనన్న కాలనీ లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, కరెంట్ సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ...
07/03/2026

ఇరగవరం 2026 మార్చి 7:-
*ఇరగవరం జగనన్న కాలనీ లో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, కరెంట్ సరఫరా చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి.గోపాలన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు* భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి.గోపాలన్ నేతృత్వంలో ప్రజా చైతన్య పాదయాత్ర బృందం పదోవ రోజు ఇరగవరం జగనన్న కాలనీని సందర్శించారు.కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు సమస్యలు తో కూడిన వినతిపత్రం కార్యదర్శి కి అందజేశారు.
*ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి.గోపాలన్ మాట్లాడుతూ* ఇరగవరం ప్రభుత్వ కాలనీలో రోడ్లు,డ్రైనేజీ, మంచినీరు, కరెంట్ సరఫరా, పాములు బెడద, దోమలు బెడద ఎక్కువగా ఉన్నాయని వీటిని కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కాలనీలో 370 గృహాలు ఉండగా 100 మంది మాత్రమే నివాసం ఉంటున్నారని మిగతావారు ప్రభుత్వ సహాయం రాక ఇల్లు నిర్మాణాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ విషయమై స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఎవడో అలాగే జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వాలు ఇచ్చినటివంటి ఇళ్లకు ప్రభుత్వ కాలనీగా నామకరణం చేసుకుంటే మంచిదని సూచించారు. ప్రజలు నివాసముంటున్న ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబెట్టారు. పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. సిపిఎం పార్టీ పోరాటం ఫలితంగానే ఈ కాలనీకి సంబంధిత అధికారులు వచ్చారని గుర్తు చేశారు‌. కేరళ రాష్ట్రంలో సిపిఎం పార్టీ అధికారంలో ఉందని అక్కడ రేషన్ 14 రకాల సరుకులు ఇస్తున్నారని,ఉపాధి పనులకు రోజుకి 600 రూపాయలు ఇస్తున్నారని, స్థలాలు ఇచ్చి గృహాలు నిర్మించుకోవడానికి అయిదు లక్షలు ఇస్తున్నారని కొనియాడారు. ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కారం కోసం సిపిఎం పార్టీ అండగా ఉంటుందని పోరాటాలు చేయడం వల్ల ఫలితాలు వస్తాయని తెలిపారు. మార్చి 23 వ తేదీన భీమవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు తరలిరావాలని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం పాదయాత్ర ముందుకు సాగుతుండగా కల్లుగీత కార్మికులు ప్రజాచైతన్య యాత్ర బృందానికి స్వాగతం పలికారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి. గోపాలన్ కి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లును శీతల పానీయంగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కల్లుగీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని,ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని,మద్యం షాపులను నియంత్రించాలని, కల్లుగీత కార్మికులకు కేరళ ప్రభుత్వం చేసినట్టుగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ కామన మునిస్వామి, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.వి. ప్రతాప్, జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్య సత్యనారాయణ, గొర్ల రామకృష్ణ, సూర్నీడి వెంకటేశ్వరరావు,కె.క్రాంతి బాబు,ఏ.అజయ్ కుమారి,కేతా గోపాలం,పొగాకు పూర్ణ, కానేటి బాలరాజు, ఎమ్.వైకుంఠ రావు, మామిడిశెట్టి రామాంజనేయులు, మల్లిపూడి ఆంజనేయులు,బాతిరెడ్డి జార్జి సిహెచ్.వరలక్ష్మీ,కరెడ్ల రామకృష్ణ, పిల్లి ప్రసాదు,వెంకట రత్నం,పురుషోత్తం, ఎమ్.కృష్ణంరాజు, షేక్ వలీ,దత్తి రాము,పెనుగంటి దుర్గా,పోతు శ్రీను, మద్దాల సత్యనారాయణ, నంగిరెడ్డి సాయి తేజ,పతివాడ నాగేంద్రబాబు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.





పెనుగొండ 2026 మార్చి 7:-*పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని  సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ కేంద్...
07/03/2026

పెనుగొండ 2026 మార్చి 7:-
*పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు* భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెనుగొండ గొంగూర తూము సెంటర్ లో పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఏలే వాడికి బుద్ధే లేదా పెరిగే ధరలకు హద్దే లేదా, తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు వెంటనే, నశించాలి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, జిందాబాద్ సిపిఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
*ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్ మాట్లాడుతూ* కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నాలుగు వందల రూపాయలు ఉన్న గ్యాస్ ధర అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలకు చేరుకుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దుయ్యబట్టారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు కాకులను కొట్టి గద్దలకు పెట్టే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇశ్రాయేలు, అమెరికా ఇరాన్ దేశం మీద యుద్ధం చేస్తుంటే కేంద్ర బిజెపి ప్రభుత్వం ఖండించకుండా యుద్దాలు సాకుతో గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన,ధర్నా కార్యక్రమాలు చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జక్కంశెట్టి సత్య నారాయణ,గొర్ల రామకృష్ణ, సూర్నీడి వెంకటేశ్వరరావు, కె.క్రాంతిబాబు, ఎ.అజయ్ కుమారి, పోగాకు పూర్ణ,కానేటి బాలరాజు, బాతిరెడ్డి జార్జి, మామిడిశెట్టి రామాంజనేయులు మరియు మల్లిపూడి ఆంజనేయులు,కరెడ్ల రామకృష్ణ, ఎమ్.వైకుంఠరావు,సిహెచ్.వరలక్ష్మీ,వెంకటరత్నం, బి.సత్యనారాయణ,దత్తి రాము, పెనుగంటి దుర్గా,పిల్లి ప్రసాదు, ప్రతివాడు నాగేంద్రబాబు, ఈశ్వర్, షేక్ వలీ,పోతు శ్రీను,మద్దాల సత్యనారాయణ,నంగిరెడ్డి సాయి తేజ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.




తాడేపల్లిగూడెం 2026 మార్చి 6 :-*12 వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని,17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని స...
07/03/2026

తాడేపల్లిగూడెం 2026 మార్చి 6 :-
*12 వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని,17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.* మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర వ్యాప్త పిలుపు లో భాగంగా తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్స్, మున్సిపల్ పర్మినెంట్ అండ్ ఔట్ సోర్సింగ్ కార్మికులు మున్సిపల్ ఆఫీస్ వద్ద మొదటి రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. *ఈ రిలే నిరాహార దీక్ష కు సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ* ఏపీ.సి.ఓ.ఎస్ రద్దు చేసే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, రద్దు చేస్తే కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ చేయాలని,12 వ పి ఆర్ సి వెంటనే ప్రకటించాలని,17 రోజుల సమ్మె కాలపు ఒప్పందాలకు జీవోలు జారీ చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మరణించిన, అనారోగ్యం, రిటైర్మెంట్ అయిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఎన్.ఎమ్.ఆర్ బదిలీ కోవిడ్ క్లాప్ డ్రైవర్లు కు 21,000 వేలు జీతం చెల్లించాలని, పర్మినెంట్ కార్మికులకు డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. *యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనాల వెంకటరావు మాట్లాడుతూ* కార్మికులకు పని ఒత్తిడి తగ్గించాలని, పట్టణంలో పారిశుద్ధ్యం సిబ్బందిని పెంచాలని, పర్మినెంట్ వర్కర్స్ కి హెల్త్ కార్డులు మంజూరు చేయాలని,ఆప్కాస్ వర్కర్స్ కి రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాల కు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ.‌పీ.ఎఫ్, ఈఎస్.ఐ, బకాయిలు అకౌంట్లో కి జమ చేయాలని, కాంటాక్ట్ కార్మికులకు ఎక్స్ గ్రేషియా ఏడు లక్షలు పెంచాలని, మట్టి ఖర్చు 25,000 వేలు ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీవో అమలు చేయాలని పర్మినెంట్ వర్కర్స్ కి పెండింగ్లో ఉన్న మూడు సంవత్సరాల డీఏ.ఏరియాస్ పీఆర్సీ,ఏరియాస్ 12 వ పీఆర్సీ, ప్రకటించాలని స్థానికంగా మూడు సంవత్సరాలు బట్టలు కుట్టు కూలి ఏరియర్స్, పర్మినెంట్ కార్మికులకు బట్టలు పంపిణీ చేయాలని డిమాండ్ టిడిపి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన కోరికలను అమలు చేయకపోతే దశలవారీగా,ఆందోళన, కార్యక్రమాలు చేపట్టి టిడిపి కూటమి ప్రభుత్వానికి తగు బుద్ది చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ కార్యదర్శి కొడమంచిలి బాబు, అల్లు రంగారావు, ఏబి.శ్రీనివాస్, ఎస్.సతీష్,కె.దయామణి,టి.శ్రీను, కె.మణికుమార్
టి.నాగమణి, మరియు వర్కర్లు, డ్రైవర్లు,క్లాప్ డ్రైవర్లు పాల్గొన్నారు.





తాడేపల్లిగూడెం 2026 ఫిబ్రవరి 21 *కమ్యూనిస్టు ప్రణాళిక ఆవిర్భవించిన ఫిబ్రవరి 21 (రెడ్ బుక్స్ డే) మార్క్సిస్టు సిద్ధాంత గ్...
03/03/2026

తాడేపల్లిగూడెం 2026 ఫిబ్రవరి 21
*కమ్యూనిస్టు ప్రణాళిక ఆవిర్భవించిన ఫిబ్రవరి 21 (రెడ్ బుక్స్ డే) మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాన్ని సిపిఎం పార్టీ సభ్యులు అందరూ అధ్యయనం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు* తాడేపల్లిగూడెం సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనములో జవ్వాది శ్రీను అధ్యక్షతన రెడ్ బుక్స్ డే అధ్యయనం సమావేశం జరిగింది. *ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ* పెట్టుబడిదారీ విధానపు అత్యున్నత దశగా ముందుకు వచ్చిన సామ్రాజ్యవాద గమనం దాన్ని మరణం వైపుగా సాగుతుందని ఆయన తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా సామ్రాజ్యవాద దేశాలు తమ మధ్య అనివార్యంగా ఏర్పడే ఘర్షణలు, వైరుధ్యాలను తాత్కాలికంగా పక్కనబెట్టి మూడో ప్రపంచ దేశాలను, ఆ దేశాల్లోని సహజ వనరులను, కార్మికుల శ్రమను చౌకగా కొల్లగొట్టడం కోసం నాడు బలంగా ఉన్న సోషలిస్టు శిబిరాన్ని ఎదుర్కోవడం కోసం ఐకమత్యంగా వ్యవహరించాయని తెలిపారు. ఐక్యత పెట్టుబడి సహజ లక్షణమైన లాభానికి గిట్టదు కాబట్టి తిరిగి సామ్రాజ్యవాద దేశాల మధ్య విభేదాలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. తమ ప్రయోజనాల కోసమే సృష్టించుకున్న డబ్ల్యూటివో నుండి అమెరికా వైదొలగడం,ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు దానికి యూరప్ దేశాలు ప్రతిస్పందనలు చూస్తున్నామని తెలిపారు. దేశభక్తి జాతీయత మసుగు లో అధికారంలోకి వచ్చిన మితవాద శక్తులు సామ్రాజ్యవాద సంస్థల ముందు ఎలా సాగిల పడుతాయో చూస్తున్నామని తెలిపారు. వెనిజులా అధ్యక్షుడు కిడ్నాప్, ఇరాన్ పై యుద్ధ ప్రయత్నాలు, గ్రీన్ లాండ్ ఆక్రమణకు ప్రయత్నాలు, క్యూబా తో సహా అనేక దేశాలపై బెదిరింపులను సరిగా అర్థం చేసుకోవడానికి లెనిన్ రచించిన ప్రసిద్ధ సైద్ధాంతిక గ్రంథం 'సామ్రాజ్యవాదం' పుస్తకాన్ని మరల అధ్యయనం చేయాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయీకరణ చెందిన ద్రవ్య పెట్టుబడి పాత్రను అర్థం చేసుకోవడానికి నేటి పరిస్థితులను మార్చడానికి ఈ పుస్తకాన్ని అధ్యయనం చేయాలని తెలిపారు.*సిపిఎం పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ లు మాట్లాడుతూ* లండన్ లోని ఒక మామూలు ముద్రణాలయం నుంచి వెలుబడిందో సామ్రాజ్యవాద పుస్తకం అది చిన్న పుస్తకం కానీ పెద్ద ప్రకంపన అది చేసిన శబ్దం ఖండాలు దాటి చరిత్రను కుదిపేసిందని దాని పేరే కమ్యూనిస్టు ప్రణాళిక అని ఆ రోజునే మనం రెడ్ బుక్కు డే గా గుర్తు చేసుకుంటామని తెలిపారు. చరిత్రలో అనేక గ్రంథాలు విలువడ్డాయని కొన్ని ఆలస్యం పనిచేసేయని మరికొన్ని ఆరాధింపజేసేయని తెలిపారు కానీ కమ్యూనిస్టు ప్రణాళిక మాత్రం ప్రపంచమంతటా ప్రశ్నల కొడవళ్లై మొలిచిందని తెలిపారు. ఆస్తి ఎవరి చేతుల్లో ఉంది శ్రమ ఎవరు చేస్తున్నారు లాభం ఎవరు పొందుతున్నారు అనే ఈ మూడు ప్రశ్నలతోనే ఒక వ్యవస్థను విచ్చిన్నం చేసి చూపగలిగిందని 1848 నుండి 2026 వరకు ప్రపంచం చాలా మారింది అని తెలిపారు. రాజ్యాలు కూలాయని, సామ్రాజ్యాలు చరిత్రపుటల్లో కలిసాయని సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చిందని చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రపంచ కార్మికులారా ఏకంకండి పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప అంటూ శ్రామిక వర్గానికి ఇచ్చిన ఈ పిలుపు పెట్టుబడిదారీ వర్గాన్ని ఉలుకు పాటుకు గురిచేసిందని అసమానతలు మధ్య సమానత్వం కోసం దోపిడీ ధర న్యాయాల మధ్య న్యాయం కోసం పుట్టిన పిలుపు అది అని తెలిపారు. సామ్యవాదం అంటే కేవలం ఎర్రజెండా కాదని అది ఆకలితో ఉన్నవాడి గిన్నెలో అన్నం నింపాలన బాధ్యతని అది శ్రమను దోపిడి నుంచి విముక్తి చేయాలని సంకల్పం అని తెలిపారు. మార్క్స్ దృష్టిలో కమ్యూనిజం అంటే కేవలం ఆస్తి పునర్విభజన కాదని, అది మనిషి మనిషిని దోచుకోని సమాజం. మనిషి తన శ్రమకు గర్వపడే సమాజం. భయం లేకుండా అవమానం లేకుండా ఆకలి లేకుండా జీవించే ప్రపంచం అని తెలిపారు. ఈ దృక్పథమే మార్క్సిజాన్ని మానవీయతకు కేంద్రంగా నిలిపిందని ఈరోజు మనం రెడ్ బుక్ డే ను గుర్తు చేసుకోవడం అంటే ఆ ఆలోచనలను చదవడం మన సమాజాన్ని ఆ దర్పణంలో చూసుకోవడం అని తెలిపారు. అసమానత ఇంకా ఉందని, అన్యాయం ఇంకా ఉందని,శ్రమ దోపిడి ఇంకా ఉందని అందుకే రెడ్ బుక్ డే ప్రతి సంవత్సరం మనకు ఒక సవాలు విసురుతుందని తెలిపారు. నువ్వు ఏ పక్షాన ఉన్నావు, పీడితుల పక్షమా, లేక పీడకుల పక్షమా ఈ రెడ్ బుక్ డే మన ఆత్మ పరిశీలనకు మన పునర్నిబద్ధతకు ఒక సరికొత్త ఆరంభం కావాలని పిలుపు నిచ్చారు.1848 లో వెలువడిన కమ్యూనిస్టు ప్రణాళిక అనే పుస్తకం ఇప్పటికీ అడుగుతుందని ప్రపంచం మారిందా, సాంకేతికత పెరిగినా, సంపద పెరిగినా,అసమానతలు ఎందుకు తగ్గడం లేదని ప్రశ్నించమంటోందని, పరిశీలించమంటోందని తెలిపారు. దోపిడీకి కారణం కొందరు వ్యక్తుల లోపం కాదని, అది వ్యవస్థ లక్షణమని చూపిందని, చరిత్రను వర్గాల పోరాటంగా నిరూపించిందని తెలిపారు. ఆర్థిక నిర్మాణం రాజకీయ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని సంపద వనరులు ఎవరి చేతుల్లో ఉంటే అధికారము వారికే ఉంటుందని చెప్పిందని తెలిపారు. సుదీర్ఘమైన పనిగంటలు తక్కువ వేతనం భద్రత లేని జీవితాలు ఈ వైరుధ్యం ఏం చెబుతుందని తెలిపారు. సమాజం మారిన అది సరికొత్త రూపంలో తిరిగి రెండు వర్గాలుగా విభజితమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి,జవ్వాది శ్రీను,సత్తి కోదండ రామిరెడ్డి,బంకురు నాగేశ్వరరావు,పోతు శ్రీను, షేక్ వల్లీ,పైలు చిన్నా,నరమాల కృష్ణ,దేశంశెట్టి సతీష్,వడిసెల శ్రీనివాసరావు, కర్రి సాయి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





తాడేపల్లిగూడెం 2026 ఫిబ్రవరి 19 *అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఈఎస్ఐ, పిఎఫ్ గ్రాడ్యుటి, పెన్షన్, సౌకర్యాలు...
19/02/2026

తాడేపల్లిగూడెం 2026 ఫిబ్రవరి 19
*అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ఈఎస్ఐ, పిఎఫ్ గ్రాడ్యుటి, పెన్షన్, సౌకర్యాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు* పండ్ల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) 33 వ వార్షికోత్సవం స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో జవ్వాది శ్రీను అధ్యక్షతన జరిగింది. ప్రజానాట్యమండలి కళాకారులు పోతు శ్రీను గీతాలాపన చేయగా యూనియన్ సీనియర్ నాయకులు కొపర్తి సత్యనారాయణ సిఐటియు జెండాను ఆవిష్కరించారు.జయప్రదం చేయండి పండ్ల మార్కెట్ వర్కర్స్ యూనియన్ వార్షికోత్సవాన్ని, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, రద్దు చేయాలి లేబర్ కోడ్లు ను,అమలు చేయాలి కార్మిక చట్టాలను, వ్యతిరేకించండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, జిందాబాద్ సిఐటియు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 2025 వ సంవత్సరం కార్యకలాపాల రిపోర్టు ను కార్యదర్శి కాయల దుర్గాప్రసాద్ ప్రవేశపెట్టగా యూనియన్ సభ్యులు కార్యదర్శిని వేదికను ఆమోదించారు. *ఈ వార్షికోత్సవాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ* పండ్ల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ కార్మికులు సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాలను సమీక్ష చేసుకొని యజమానులకు కార్మికులకు మధ్య వచ్చిన సమస్యలను సమీక్ష చేసుకొని రానున్న కాలానికి నూతన కమిటీని ఎన్నుకోవడం కోసం వార్షికోత్సవాలు జరుగుతాయని తెలిపారు. హమాలీ కార్మికులు పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయని, పనులు తగ్గిపోతున్నాయని, ప్రభుత్వ విధానాలు కారణంగా పెద్దపెద్ద మార్టులు, సంస్థలు, షాపులు వచ్చాక వ్యాపారాలు వేరే ప్రాంతాలకు తరలిపోవడం జరుగుతుందని తెలిపారు. హోల్ సేల్ వ్యాపారాలు లేకపోవడం వలన హమాలీ కార్మికులు నష్టపోయే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాయాలు రోజురోజుకు పడిపోతున్నాయని ప్రభుత్వ విధానాలు వలన అధిక ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని అందుకు అనుగుణంగా ఆదాయం లేక ఇబ్బందులకు కార్మికుల గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల పిల్లల చదువులు,ఆరోగ్య సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఎద్దేవా చేశారు. వైద్యం,విద్య కార్మికులకు అందుబాటులో లేకుండా పోయిందని,హమాలీ కార్మికులను ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.పాలకవర్గాలు వైఖరి మొండిగా ఉందని,బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను తీసేసి కార్మికులను యజమానులకు కట్టు బానిసలు లాగా చేసే విధానాన్ని తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటితరంగ కార్మికులకు,జట్టు, హమాలీ కళాసి జట్లకు సమగ్ర చట్టం చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్,గ్రాడ్యుటి, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. *సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు మాట్లాడుతూ* ఈ సంవత్సర కాలంలో చేసిన పోరాటాలు, కార్యక్రమాలు, యజమానులకు కార్మికులకు వచ్చిన సమస్యలను సమీక్ష చేసుకొని రానున్న కాలానికి చేయాల్సిన పోరాటాలు కార్యక్రమాలను రూపొందించుకుంటారని తెలిపారు. హమాలీరంగ కార్మికులకు సమగ్రం చట్టం లేదని ప్రభుత్వాలు మారుతున్న పాలకుల మారుతున్న కార్మికులకు ఎటువంటి చట్టాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు కార్మికులను పట్టించుకునే విధానం లేదని వాపోయారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో అసంఘటిత రంగ కార్మికులకు పేదలకు వ్యవసాయ కార్మికులకు రైతులకు ఎటువంటి కేటాయింపులు చేయలేదని వాపోయారు. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు సంపన్నులకు వరాలు పేదలు, కార్మికులకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 44 కార్మిక చట్టాలను మార్చేసి నాలుగు కోడ్లుగా తయారుచేసి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే విధానాలు తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. *సిఐటియు పట్టణ కన్వీనర్ జవ్వాది శ్రీను మాట్లాడుతూ* తాడేపల్లిగూడెంలో ఉన్న అన్ని యూనియన్లు సాంప్రదాయ బద్ధంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుకొని నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. సంవత్సరం కాలంలో చేసిన కార్యక్రమాలు ఉద్యమాలు సమీక్ష చేసుకొని రానున్న సంవత్సర కాలానికి దిశా,నిర్దేశం చేసుకుంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం, సంక్షేమం లేదని వాపోయారు. జట్టు పని చేసి 50 సంవత్సరాలు దాటిన వారికి మోకాలు లో జిగురు అరిగిపోయి నడుం నొప్పులు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. దేశానికి సంపద సృష్టికర్తలు జట్టు కార్మికులు అని,అటువంటి వారిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్,గ్రాడ్యుటి, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని తొమ్మిది మందితో ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ప్రెసిడెంట్ గా జవ్వా శ్రీను, వైస్ ప్రెసిడెంట్ గా తట్టాగొట్టి పెద్దిరాజు, సెక్రెటరీ గా కాయల దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రెటరీ గా నక్కా సత్తిబాబు, కోశాధికారిగా పుట్టా యేసు, కమాండర్ గా మద్దూరి ఆనంద్ కమిటీ సభ్యులు సారిక శ్రీను, సుంకర శ్రీను, సువ్వాడ రాంపండు మరియు రెండవ కమాండర్ గా సిరపరపు సత్యనారాయణ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ వార్షికోత్సవానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి, సిఐటియు పట్టణ కో కన్వీనర్ అల్లు సుబ్బారావు, సత్తి కోదండరామిరెడ్డి, చిటికెన రాము, నరమాల కృష్ణ,దేశంశెట్టి సతీష్,పబ్బాని సురేష్ కుమార్,కవురెడ్డి శ్రీనివాస్ మరియు పండ్ల మార్కెట్ వర్కర్స్ యూనియన్ జట్టు సభ్యులు పాల్గొన్నారు.





Address

Tadepalligudem

Website

Alerts

Be the first to know and let us send you an email when CITU - Tadepalligudem posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share