27/02/2026
*ప్రతి ఇంటా ఫ్రై డేని డ్రై డేగా పాటించాలి*
*జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణపై అవగాహన కార్యక్రమం*
చెన్నముక్కపల్లె(రాయచోటి అన్నమయ్యజిల్లా)27-02-2028:- ప్రతి ఇంటా ఫ్రై డేని డ్రై డేగా పాటించాలని యండపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మల్టీ నేషనల్ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం చెన్నముక్కపల్లె-2 గ్రామ సచివాలయం పరిధిలోని రాజుల కాలనీలోని మోడల్ ప్రైమరీ స్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థులకు దోమల లార్వాను చూపించి జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని ఆరోగ్య సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని నివారించుటకు తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.ముఖ్యంగా ఇంటిలో వున్న నీటి నిల్వలు మీద దోమలు గ్రుడ్లు పెట్ట కుండ మూతలు ఉంచాలని,ఇంటి పరిసరాలలో త్రాగి వదిలేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు రాతి రుబ్బు రోళ్ళు, పనికి రాని ఎయిర్ కూలర్స్ సరిసరాలలో ఉంచకుండ చూడవలెనని తెలిపారు.అలాగే ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండ జాగ్రత్త వహించి వలెనని, నీటి తొట్టెలను ప్రతి శుక్రవారము ఖాళీ చేసి అరబెట్టి మరల నింపుకోవలెనని ఆయన తెలిపారు.అంతే కాకుండా ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, ప్లవర్ వాజ్ లు, జంతువులు, పక్షులు నీరు త్రాగటం కోసం ఉంచే తొట్టెలలోని నీటిని మూడు రోజుల కోకసారి మార్చాలని,కుళాయిల వద్ద నీరు నిల్వ వుంచకుండ చూడాలని,
ఓవర్ హెడ్ ట్యాంకుల మీద దోమలు చొరబడ కుండా మూతలు పెట్టాలని, ఫ్లవర్ పాట్స్, ప్లవర్ ట్రేస్లలోను నీరు నిల్వ వుంచకుండ చూడవలెనని, డెంగ్యూ వ్యాధిని కల్గించు దోమలు పగటి పూట కుట్టునని, కావున శరీరాన్ని పూర్తిగా కప్పి వుంచే దుస్తులను ధరించవలెనని, నిదురించేటపుడు దోమ తెరలు ఉపయోగించాలని సూచించారు.దోమలు గదుల యందు చీకటి ప్రదేశములలో వ్రేలాడ బడు వస్తువుల మీద వుండునని,కావున ఆ వ్రేలాడే వస్తువులు ఉండ కుండ చూడవలెనని తెలిపారు.
దోమల ఇంటిలోనికి రాకుండ కిటికీలకు, తలుపులకు జాలీలు బిగించుకోవలెనని,దోమలు పుట్టకుండ పైన తెలిపిన జాగ్రత్తలు తీసుకోవాలని,డ్రైనెజ్ కాల్వల్లో అడ్డుగా వున్న వాటిని తొలగించి నీరు నిల్వ వుండకుండ నిరంతరం పారేటట్లు చూడాలని, ప్రతి శుక్రవారము డ్రై డేగా పాటిద్దామని, డెంగ్యూ,చికున్ గున్యా , మలేరియా జ్వరాల నుండి రక్షణ పొందుదామని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో చెన్నముక్కపల్లె-2 విలేజ్ హెల్త్ సెంటర్ సిహెచ్ఓ షేక్ కొలిమి ఆజ్మీయా,పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వీర నాగయ్య, ఉపాధ్యాయులు ఎ.నరేంద్ర, ఆశా కార్యకర్తలు కె.సునంద, ఎ.ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.