Yvr Viswa Chaitanya Forum. వైవిఆర్-విశ్వ చైతన్య వేదిక

  • Home
  • India
  • Rayachoti
  • Yvr Viswa Chaitanya Forum. వైవిఆర్-విశ్వ చైతన్య వేదిక

Yvr Viswa Chaitanya Forum. వైవిఆర్-విశ్వ చైతన్య వేదిక NEWS&VIEWS, AWARENESS OF PUBLIC HEALTH,LEGAL SERVICES, HUMAN RIGHTS,RTI ACT,WATER PROTECTION,

02/03/2026
*రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ గా కాదు… ‘తెలుగునాడు’ కావాలి!**భాషా గౌరవం కోసం రాష్ట్ర పేరు మార్చాలి* *రాయచోటి మండల లీగల్ సర...
01/03/2026

*రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ గా కాదు… ‘తెలుగునాడు’ కావాలి!*

*భాషా గౌరవం కోసం రాష్ట్ర పేరు మార్చాలి*

*రాయచోటి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి డిమాండ్*

రాయచోటి అన్నమయ్య జిల్లా (1-03-2026):- రాష్ట్ర పేరు ఆంధ్రప్రదేశ్ గా కాదు,'తెలుగునాడు’ పేరు కావాలని,భాషా గౌరవం కోసం రాష్ట్ర పేరు మార్చాలని రాయచోటి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి ఆదివారం ఒక పత్రిక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు.
తెలుగు భాషా ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాల్సిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ భాషా ప్రాతిపదికన పూర్తి గుర్తింపు దక్కలేదని పలువురు భాషాభిమానులు, మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్న విషయం గుర్తించాలన్నారు.దేశంలో తమిళనాడు వంటి రాష్ట్రాలు తమ భాషా గుర్తింపునే రాష్ట్ర నామంగా గర్వంగా ప్రకటించుకుంటున్న సందర్భంలో, కోట్లాది మంది తెలుగు ప్రజల రాష్ట్రం మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ సూచనకే పరిమితమవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. తెలుగు భాష కేవలం మాట్లాడే సాధనం కాదు, ఒక సంస్కృతి–చరిత్ర–నాగరికత అని స్పష్టం చేస్తూ, రాష్ట్రాన్ని అధికారికంగా‘తెలుగునాడుగా నామకరణం చేయడం ద్వారా భాషా గౌరవం, ప్రజల ఐక్యత మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చోరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరును 'తెలుగు నాడు' గా వెంటనే మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగు భాష అభిమానులు అందరూ ముక్తకంఠంతో ఈ డిమాండ్ ను ప్రభుత్వాల దృష్టికి బలంగా తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలి ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు.

*ప్రతి ఇంటా ఫ్రై డేని డ్రై డేగా పాటించాలి**జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణపై అవగాహన కార్యక్రమం*చెన్నముక్కపల్లె(రాయచోటి అన...
27/02/2026

*ప్రతి ఇంటా ఫ్రై డేని డ్రై డేగా పాటించాలి*

*జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణపై అవగాహన కార్యక్రమం*

చెన్నముక్కపల్లె(రాయచోటి అన్నమయ్యజిల్లా)27-02-2028:- ప్రతి ఇంటా ఫ్రై డేని డ్రై డేగా పాటించాలని యండపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మల్టీ నేషనల్ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం చెన్నముక్కపల్లె-2 గ్రామ సచివాలయం పరిధిలోని రాజుల కాలనీలోని మోడల్ ప్రైమరీ స్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థులకు దోమల లార్వాను చూపించి జాతీయ కీటకజనిత వ్యాధి నియంత్రణపై అవగాహన కార్యక్రమాన్ని ఆరోగ్య సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధిని నివారించుటకు తీసుకోవల్సిన జాగ్రత్తలు గురించి వివరించారు.ముఖ్యంగా ఇంటిలో వున్న నీటి నిల్వలు మీద దోమలు గ్రుడ్లు పెట్ట కుండ మూతలు ఉంచాలని,ఇంటి పరిసరాలలో త్రాగి వదిలేసిన కొబ్బరి బోండాలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు రాతి రుబ్బు రోళ్ళు, పనికి రాని ఎయిర్ కూలర్స్ సరిసరాలలో ఉంచకుండ చూడవలెనని తెలిపారు.అలాగే ఇంటి లోపల, బయట నీటి నిల్వలు లేకుండ జాగ్రత్త వహించి వలెనని, నీటి తొట్టెలను ప్రతి శుక్రవారము ఖాళీ చేసి అరబెట్టి మరల నింపుకోవలెనని ఆయన తెలిపారు.అంతే కాకుండా ఎయిర్ కూలర్లు, ఎయిర్ కండిషనర్లు, ప్లవర్ వాజ్ లు, జంతువులు, పక్షులు నీరు త్రాగటం కోసం ఉంచే తొట్టెలలోని నీటిని మూడు రోజుల కోకసారి మార్చాలని,కుళాయిల వద్ద నీరు నిల్వ వుంచకుండ చూడాలని,
ఓవర్ హెడ్ ట్యాంకుల మీద దోమలు చొరబడ కుండా మూతలు పెట్టాలని, ఫ్లవర్ పాట్స్, ప్లవర్ ట్రేస్లలోను నీరు నిల్వ వుంచకుండ చూడవలెనని, డెంగ్యూ వ్యాధిని కల్గించు దోమలు పగటి పూట కుట్టునని, కావున శరీరాన్ని పూర్తిగా కప్పి వుంచే దుస్తులను ధరించవలెనని, నిదురించేటపుడు దోమ తెరలు ఉపయోగించాలని సూచించారు.దోమలు గదుల యందు చీకటి ప్రదేశములలో వ్రేలాడ బడు వస్తువుల మీద వుండునని,కావున ఆ వ్రేలాడే వస్తువులు ఉండ కుండ చూడవలెనని తెలిపారు.
దోమల ఇంటిలోనికి రాకుండ కిటికీలకు, తలుపులకు జాలీలు బిగించుకోవలెనని,దోమలు పుట్టకుండ పైన తెలిపిన జాగ్రత్తలు తీసుకోవాలని,డ్రైనెజ్ కాల్వల్లో అడ్డుగా వున్న వాటిని తొలగించి నీరు నిల్వ వుండకుండ నిరంతరం పారేటట్లు చూడాలని, ప్రతి శుక్రవారము డ్రై డేగా పాటిద్దామని, డెంగ్యూ,చికున్ గున్యా , మలేరియా జ్వరాల నుండి రక్షణ పొందుదామని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో చెన్నముక్కపల్లె-2 విలేజ్ హెల్త్ సెంటర్ సిహెచ్ఓ షేక్ కొలిమి ఆజ్మీయా,పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.వీర నాగయ్య, ఉపాధ్యాయులు ఎ.నరేంద్ర, ఆశా కార్యకర్తలు కె.సునంద, ఎ.ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.

23/02/2026

'అమ్మ' పాలు తప్ప అంతా కల్తీనే, ప్రతి ఇంటా పాడి ఆవు గానీ,పాడి గేదె గానీ పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలి, కల్తీ పాలు, నెయ్యి అమ్మకాలు లేకుండా చేయాలి, ప్రజారోగ్యాన్ని పరిరక్షించాలి.

*పెంపుడు జంతువులు, పక్షుల నీటిపాత్రలు దోమల ఆవాసాలుగా మారనివ్వొద్దు*— *ప్రజలకు ఆరోగ్య శాఖ సిబ్బంది విజ్ఞప్తి*యండపల్లె (రా...
20/02/2026

*పెంపుడు జంతువులు, పక్షుల నీటిపాత్రలు దోమల ఆవాసాలుగా మారనివ్వొద్దు*

— *ప్రజలకు ఆరోగ్య శాఖ సిబ్బంది విజ్ఞప్తి*

యండపల్లె (రాయచోటి అన్నమయ్య జిల్లా) 20 జూలై 2026:-వేసవికాలంలో పెంపుడు జంతువులు, పక్షుల కోసం ఉంచే త్రాగునీటి పాత్రలను నిర్లక్ష్యంగా ఉంచడం వల్ల అవి దోమల పెరుగుదలకు ఆవాసాలుగా మారుతున్నాయని ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలకు హెచ్చరించారు. శుక్రవారం రోజున ఫ్రైడే డ్రై డే కార్యక్రమం సందర్భంగా యండపల్లె విలేజ్ హెల్త్ సెంటర్ పరిధిలోని జంగంరెడ్డి గారి పల్లెలో ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి తిరిగి లార్వా సర్వే చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో మాట్లాడుతూ
ముఖ్యంగా ఏడిస్ ఈజిప్టి దోమలు నిల్వ నీటిలో గుడ్లు పెడతాయని, ఇవి డెంగ్యూ, మలేరియా, చికున్ గున్యా వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతాయని వారు తెలిపారు.
అలాగే ఇళ్ల ఆవరణలో, పెంపుడు జంతువుల బోనుల్లో, పక్షుల గూళ్ల వద్ద ఉంచే నీటి పాత్రలను ప్రతిరోజూ ఖాళీ చేసి శుభ్రంగా కడగాలని సూచించారు. కనీసం వారానికి ఒకసారి నీటిపాత్రలను ఎండలో ఎండబెట్టడం, అవసరమైతే మూతలతో కప్పి ఉంచడం ద్వారా దోమల నివారణ సాధ్యమవుతుందని వారు వివరించారు.పెంపుడు జంతువులు, పక్షుల సంరక్షణతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య రక్షణ కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆరోగ్య సిబ్బంది గుర్తు చేశారు. పరిసరాల పరిశుభ్రత పాటించి, నిల్వ నీరు ఎక్కడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటే దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారించవచ్చని ఆరోగ్య శాఖ ప్రజలను కోరింది. ఈ కార్యక్రమంలో యండపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మల్టీ పర్పస్ హెల్త్ సూపర్వైజర్ యం.హేమలత, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి,యం.మురళీ మోహన్,ఏ.యన్.యం టి.సుజాత తదితరులు పాల్గొన్నారు.

*ఫోటో 1: పెంపుడు కుక్క నీరు త్రాగుతున్న చిత్రం*

*ఫోటో 2: పెంపుడు కుక్క త్రాగిన పాత్రలో దోమ లార్వా ఉన్న నీటిని తోలగిస్తూన్న చిత్రం*

*పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం*పెమ్మాడపల్లె(రాయచోటి అన్నమయ్య జిల్లా)18-02-2026:-...
18/02/2026

*పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం*

పెమ్మాడపల్లె(రాయచోటి అన్నమయ్య జిల్లా)18-02-2026:- రాయచోటి మండలం పెమ్మాడపల్లె గ్రామ సచివాలయం పరిధిలోని పెమ్మాడపల్లె హరిజన వాడలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక
పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో యండపల్లె ప్రాధమిక ఆరోగ్య కేంద్రం మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి వివరించారు. ఈ సందర్భంగా చేతులు సబ్బుతో కడగడం, శుభ్రమైన దుస్తులు ధరించడం, పళ్ళు రోజూ శుభ్రం చేసుకోవడం, గోళ్లను కత్తిరించుకోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత అలవాట్లు అనారోగ్యాలను నివారించడంలో కీలకమని ఆయన తెలిపారు.
అలాగే పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచడం, చెత్తను చెత్తబుట్టల్లో వేయడం, నీరు నిల్వ ఉండకుండా చూడడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవచ్చని వివరించారు. పరిశుభ్రత పాటిస్తే డెంగ్యూ, మలేరియా, విరేచనాలు వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని విద్యార్థులకు తెలియజేశారు.భోజనానికి ముందు, మలవిసర్జన తర్వాత చేతులు కడుక్కోవడం విధిగా ఆచరించాలని, అదియు కూడా శాస్త్రీయ పద్ధతిలో సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యారాలు వై.రెడ్డెమ్మ, ఉపాధ్యాయురాలు యస్.శకుంతల, పాఠశాల అభివృద్ధి కమిటి చైర్మెన్ ఓబులమ్మ, ఆశా కార్యకర్త అలివేలమ్మ తదితరులు పాల్గొన్నారు

Address

DR NO 18/25 A, PATHIVANADLAPALLI,. PALLI, POST, TSUNDUPALLI MANDAL, ANNAMAYYA DISTRICT
Rayachoti
516130

Website

Alerts

Be the first to know and let us send you an email when Yvr Viswa Chaitanya Forum. వైవిఆర్-విశ్వ చైతన్య వేదిక posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share