05/06/2026
ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం – బీటెక్ రవి
ఈ రోజు పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన "ప్రజా దర్బార్" కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజలను కలిసి, వారి సమస్యల వినతులను స్వయంగా స్వీకరించడం జరిగింది. ప్రజలు సమర్పించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాను.
మాపై మీరు ఉంచిన అచంచలమైన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ప్రజా శ్రేయస్సే ప్రథమ ప్రాధాన్యతగా పని చేస్తాం. ప్రజా దర్బార్కు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని, మీ సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటానని మనఃపూర్వకంగా భరోసా ఇస్తున్నాను.