Mareddy Ravindranath Reddy

Mareddy Ravindranath Reddy Pulivendula TDP Incharge,TDP Official Spokes Person,Ex MLC, Andhrapradesh

పూలే ఆశయ సాధనే లక్ష్యం: జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోత...
11/04/2026

పూలే ఆశయ సాధనే లక్ష్యం: జడ్పీటీసీ మారెడ్డి లతా రెడ్డి

సమాజంలో అణగారిన వర్గాల ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పులివెందుల జడ్పీటీసీ శ్రీమతి మారెడ్డి లతా రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

​ ఈ సందర్భంగా మారెడ్డి లతా రెడ్డి మాట్లాడుతూ .. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి, దళిత బహుజనుల హక్కుల కోసం, మహిళా విద్యాభివృద్ధి కోసం పూలే చేసిన విశేష కృషిని, ఆయన చేసిన పోరాటాలను కొనియాడారు. కుల వివక్ష లేని సమానత్వ సమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు పూలే అని కీర్తించారు.

​ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, బడుగు బలహీన వర్గాల ఆశయ సాధనకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. పూలే ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో పేద ప్రజల సంక్షేమానికి మరింత కృషి చేస్తామని తెలిపారు..




బహుజన బాంధవుడు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల చెంత విద్యా జ్యోతులు వెలిగించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ...
11/04/2026

బహుజన బాంధవుడు, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల చెంత విద్యా జ్యోతులు వెలిగించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు.

నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ.. ఘన నివాళులు అర్పిస్తున్నాను. సమాజంలో సమానత్వం కోసం, మహిళా విద్య కోసం పూలే గారు చేసిన కృషి మనందరికీ నిరంతర స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాల సాధనలో భాగస్వాములై, బహుజన సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేద్దాం.



11/04/2026

వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స..
అచ్చెన్న గారు చెప్పింది, బొత్స గారు చెప్పిందే కదా..
ఇందులో తప్పేముంది YS Jagan Mohan Reddy ఎందుకు భుజాలు తడుముకుంటున్నావ్?

జగన్ నైజాన్ని చూసి.. బొత్స బాధపడకపోతే ఏం చేస్తారు?

భయం నుంచి బొత్సకు బాధ పుట్టుకొచ్చిందేమో. వివేకా హత్య నుంచి.. తల్లి-చెల్లి ఆస్తి తగాదా వరకు జగన్ నైజం కనిపిస్తోంది. జగన్ నైజాన్ని చూసి.. బొత్స బాధపడకపోతే ఏం చేస్తారు?

జగన్ క్రిమినల్ మైండ్‌కి బాబాయ్ మర్డర్ స్టోరీ నుంచి ప్రతిదీ ఒక ఉదాహరణే..
జగన్ గురించి ఇవన్నీ తెలిసిన బొత్స గారు, భయపడక ఏమి చేస్తారు?

పరిటాల హత్య కేసులో.. జగన్‌ను కాపాడేందుకు కష్టపడ్డామని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. నిన్న అచ్చెన్న గారు కూడా చరిత్రలో జరిగినవి, బొత్స గారు మాట్లాడినవి, రోశయ్య గారు చెప్పినవి చెప్పారు. ఎందుకు జగన్ భుజాలు తడుముకుంటున్నాడు?



ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: బీటెక్ రవి​పులివెందుల నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చి, వారికి అండగా ఉండటమే కూటమి ప్...
10/04/2026

ప్రజా సమస్యల పరిష్కారమే నా లక్ష్యం: బీటెక్ రవి

​పులివెందుల నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చి, వారికి అండగా ఉండటమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఈ రోజు సింహాద్రిపురంలోని తన స్వగృహంలో నిర్వహించిన 'ప్రజా దర్బార్'లో ఆయన ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరిగింది.

నియోజకవర్గం నుంచి ​వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విన్న ఆయన, అక్కడికక్కడే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు తానూ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, భరోసా ఇవ్వడం జరిగింది.

మల్లెల మైనార్టీలకు అండగా నిలిచి సమస్య పరిష్కరిస్తానన్న బీటెక్ రవి పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్లెల గ్రామం గుం...
10/04/2026

మల్లెల మైనార్టీలకు అండగా నిలిచి సమస్య పరిష్కరిస్తానన్న బీటెక్ రవి

పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్లెల గ్రామం గుండా వెళ్తున్న హైవే రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా స్థానిక మసీదుకు ఆటంకం కలగడంపై గ్రామంలోని మైనార్టీ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ రోజు మల్లెల గ్రామానికి వెళ్ళడం జరిగింది.ముస్లిం మైనార్టీ సోదరుల విన్నపాన్ని మన్నించి వెంటనే క్షేత్రస్థాయిలో మసీదును పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మతపరమైన కట్టడాలకు ప్రాముఖ్యతనిస్తూ, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.. వెంటనే సంబంధిత హైవే కాంట్రాక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, మసీదుకు ఎటువంటి నష్టం Drawings లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సమస్యను ఎలా పరిష్కరించాలో చర్చించి, సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు ముగింపు పలుకుతానని గ్రామస్తులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు..

పులివెందుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం:  బీటెక్ రవి ​పులివెందుల నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు ,నాయకులు...
09/04/2026

పులివెందుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం: బీటెక్ రవి

​పులివెందుల నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలు ,నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి లబ్ధిదారునికి చేరవేయడమే లక్ష్యంగా పనిచేయాలని క్యాడర్‌కు దిశానిర్దేశం చేయడం జరిగింది. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గతంలో నిలిచిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉండి, స్థానిక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని సూచించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఆయా మండలాల ఇంచార్జ్ లు ,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..







08/04/2026

ఇంట్లో మహిళలను గెంటేస్తావ్…
తల్లి, చెల్లిని రోడ్డున పడేస్తావ్…
తల్లి వయస్సు సమానమైన భువనేశ్వరి గారిని తిట్టిస్తావ్…
మహిళలను కారుతో పోల్చుతావ్…

నువ్వు కూడా మహిళల గురించి మాట్లాడుతున్నావా జగన్?




ఏబీఎన్ కార్యాలయంపై దాడి దుర్మార్గం.. యాజమాన్యానికి, సిబ్బందికి నా ప్రగాఢ సంఘీభావం : బీటెక్ రవి​హైదరాబాద్‌లోని ఏబీఎన్ (AB...
07/04/2026

ఏబీఎన్ కార్యాలయంపై దాడి దుర్మార్గం.. యాజమాన్యానికి, సిబ్బందికి నా ప్రగాఢ సంఘీభావం : బీటెక్ రవి

​హైదరాబాద్‌లోని ఏబీఎన్ (ABN) ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు ఏబీఎన్ ఆఫీసును స్వయంగా సందర్శించి, అక్కడ జరిగిన విధ్వంసాన్ని పరిశీలించాను. దాడికి సంబంధించిన పూర్తి వివరాలను సంస్థ యాజమాన్యాన్ని, సిబ్బందిని అడిగి తెలుసుకున్నాను.

​ప్రజాస్వామ్యంలో పత్రికలు, ప్రసార మాధ్యమాలపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్య. నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకువస్తున్న మీడియా సంస్థల గొంతు నొక్కాలని చూడటం, భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గం. పత్రికా స్వేచ్ఛపై జరిగిన ఈ దాడికి పాల్పడిన దుండగులను వెంటనే గుర్తించి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ కష్ట సమయంలో ఏబీఎన్ సంస్థకు, యాజమాన్యానికి, మరియు మనోధైర్యంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి నా ప్రగాఢ సంఘీభావం తెలియజేస్తున్నాను.

06/04/2026

30 ఏళ్ల క్రితమే నీటి భద్రత కోసం పని చేశాం.

ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం వంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లాం. పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశాం. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు-చెట్టు, నీరు-మీరు, నీరు-ప్రగతి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం.

#జలధార

06/04/2026

వైసీపీ కి పిచ్చి ముదిరింది...
దేవతల రాజధాని పేరు కూడా "అమరావతి" కాబట్టి, ఆ పేరు పలకటం ఇష్టం లేకపోతే ఇంట్లో పడుకో . అంతే కానీ పిచ్చి ముదిరి "మావిగన్" అనే పేర్లు చెప్పకు.



#జలధార



04/04/2026

అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు అన్నివిధాలా సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోమ్ మంత్రి అమిత్ షా గారికి, పార్లమెంటులో మద్దతిచ్చిన పార్టీలన్నిటికీ 5 కోట్ల ఆంధ్రుల తరపున కృతజ్ఞతలు.





04/04/2026

రాజధాని అమరావతి విషయంలో భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలిచింది. అమరావతికి చట్టబద్దత రావడం అన్నది 5 కోట్ల ఆంధ్రుల గెలుపు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది.





Address

Door No 3/81 Street/kothuru Chowdeshwari Devi Temple Landmark/Mee Seva Simhadripuram Village And Mandal Consistency::Pulivendula District:/Kadapa
Pulivendla
516454

Opening Hours

Monday 9am - 11pm
Tuesday 9am - 11pm
Wednesday 9am - 11pm
Thursday 9am - 11pm
Friday 9am - 11pm
Saturday 9am - 11pm
Sunday 9am - 11pm

Telephone

+919000274999

Website

Alerts

Be the first to know and let us send you an email when Mareddy Ravindranath Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mareddy Ravindranath Reddy:

Share