11/08/2024
** కేంద్రం చేతిలో కీలుబొమ్మలు
__ఎ కోటిరెడ్డి
రచయిత మార్క్సిస్టు
ఎడిటోరియల్ బాధ్యులు
బిజెపికి దేశప్రజలు తగిన గుణపాఠం
చెప్పి, ఆ పార్టీకి పార్లమెంటులో స్థానాలను తగ్గించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన స్థానాల కన్నా తక్కువ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీలు బిజెపికి ఆ లోటు కనబడకుండా చేశాయి. దానికి ఎక్కువ స్థానాలు వచ్చినప్పటి లాగానే ఇప్పుడూ వ్యవహరించటానికి అవసరమైన మద్దతును రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు అందించాయి. బిజెపికి పార్లమెంటులో తగినంత బలం లేని పరిస్థితిని ఉ పయోగించుకొని, ఆ పార్టీపై వత్తిడి తీసుకొచ్చి, రాష్ట్ర ప్రయోజనాలను సాధించటానికి మారుగా, ఆ పార్టీ ప్రభుత్వానికి మద్దతివ్వటమే మహాభాగ్యం అన్నట్లుగా ఈ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలోని 25 పార్లమెంటు స్థానాలలో టిడిపి 16, జనసేన, బిజెపి, వైసిపిలు తలో మూడు స్థానాల చొప్పున గెలుచుకున్నాయి. బిజెపి గెలిచిన మూడు స్థానాలు టిడిపి, జనసేన మద్దతుతో గెలుచుకున్నవి మినహా రాష్ట్రంలో స్వంతంగా ఒక్క స్థానాన్ని గెలిచే బలం కూడా ఆ పార్టికి లేదు. ఆ విధంగా పార్టీని అప్పనంగా మూడు స్థానాలలో గెలిపించటమే కాక, తాము గెలిచిన 19 స్థానాలతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని బలపరచటంతో పాటు, ప్రభుత్వంలో భాగస్వాములు కూడా అయ్యారు. టిడిపి కూటమికి వ్యతిరేకంగా (ఆ కూటమిలో ఉన్న బిజెపికి కూడా వ్యతిరేకంగా) పోటి చేసి, మూడు స్థానాలలో గెలిచిన వైసిపి కూడా బిజెపికి షరతులతో కూడిన మద్దతిస్తామని చెబుతూ బేషరతు మద్దతును అందిస్తున్నది.
బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉ ండటానికి, చట్టాలను ఆమోదించుకోవటానికి పార్లమెంటులో టిడిపి బలం ప్రధానం కాగా, రాజ్యసభలో వైసిపి బలం అత్యవసరంగా ఉ న్నది. రాజ్యసభలో కూడా బిజెపికి మెజారిటీ లేదు. రాష్ట్రం నుండి 11 మంది రాజ్యసభ
సభ్యులు ఉండాలి. ఇప్పుడు 11 మందీ వైసిపి ఆ సభ్యులే ఉన్నారు. మొత్తం 240 మంది = సభ్యులున్న రాజ్యసభలో బిజెపికి 97 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఎకు 117 మంది ఉన్నారు. రాజ్యసభలో మెజారిటికి బిజెపి 242 స్థానాల దూరంలో ఉండగా, ఎన్డీఎ 2 కూటమిగా చూసినా నాలుగు స్థానాలు తక్కువ ఉన్నాయి.
ఇటువంటి పరిస్థితులలో బిజెపిపై ఒత్తిడి చేయటానికి, మన రాష్ట్రానికి రావలసిన నిధులు, హక్కులను సాధించుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాని రాష్ట్రానికి అవసరమైన ప్రత్యేక హెూదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం, విశాఖ రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు తదితరాలపై టిడిపి, జనసేన, వైసిపిలు నోరు మెదపటం లేదు. ముఖ్యంగా విశాఖ ఉ క్కుఫ్యాక్టరి ప్రైవేటీకరణను నిలుపు చేయించే విషయంలో పాలకపార్టీల అవకాశవాదానికి గో హద్దులు లేకుండా పోతున్నాయి. విశాఖ ఉ క్కును ప్రైవేటీకరిస్తున్నామని మూడున్నర సంవత్సరాల క్రితమే బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అప్పటి నుండి ఉ క్కు ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తూ, పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటానికి విశాఖ నగరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణంగా మద్దతిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి దోహదం చేసే వరిశ్రమలలో విశాఖ ఉక్కుఫ్యాక్టరీ ప్రధానమైనది. కాని రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై - దాగుడుమూతలు ఆడుతున్నాయి. వైసిపి, • టిడిపిలు ప్రజాభిప్రాయానికి జడిసి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పటం మినహా వాస్తవంగా ప్రైవేటీకరణను ఆ పార్టీలు వ్యతిరేకించటం లేదు. గతంలో అధికారంలో ఉన్న వైసిపి, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టిడిపిలు ప్రైవేటీకరణను విడనాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయటం లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి మొదటి ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రులతో చేసిన చర్చలలో ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిలుపు చేసే అంశం కనీసం ప్రస్తావనకు కూడా నోచుకోలేదు.
పార్లమెంటులో ప్రభుత్వానికి మద్దతు • ఇస్తున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్కు చట్టబద్ధంగా రావలసిన నిధులు ఇవ్వాలని, విభజన • సమస్యలను పరిష్కరించాలని మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. బడ్జెట్ రాష్ట్రానికి ఇచ్చింది నామమాత్రమైనా ఏదో గొప్పగా ఇచ్చినట్లు, టిడిపి సాధించినట్లు అతిశయోక్తులు ప్రచారం చేసుకొంటున్నారు. బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన రోజు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 వేలకోట్ల రూపాయలు గ్రాంటుగా ఇచ్చినట్లు టిడిపి ప్రచారం చేసుకుంది. మీడియాలోని ఒక సెక్షన్లో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. కాని వాస్తవంగా రాజధాని నిర్మాణానికి అంతర్జాతీయ సంస్థల నుండి 15 వేలకోట్ల రూపాయల రుణం ఇప్పిస్తామని మాత్రమే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో చెప్పింది. రాజధానికి, రాష్ట్రానికి నిధులు ఇస్తామని
నిర్దిష్టంగా చెప్పకపోయినా, విభజన సమస్యలలో ఏ ఒక్కదానిని పరిష్కరిస్తామని ప్రకటించకపోయినా, కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ఏదో ఒరగబెట్టబోతున్నట్లుగా టిడిపి ప్రచారం చేసుకోవటం మన రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. కేంద్రం ఇవ్వకపోయినా రాష్ట్రానికి అన్ని ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవటం ఎవరికి ప్రయోజనం కలిగించటానికి? ఏమీ ఇవ్వకపోయినా ఎక్కువగా ఇచ్చినట్లు ప్రచారం చేసుకోవటం రాష్ట్రాభివృద్ధిని గురించి పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై ప్రజలకు వ్యతిరేకత రాకుండా చూడటానికి, రాష్ట్రానికి నిధులు, విభజన హామీలను సాధించలేని తమ చేతగాని తనాన్ని కప్పిపెట్టుకోవటానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రాష్ర ప్రయోజనాలకు ఏ మాత్రం దోహదం చేయదు. పోలవరానికి నిధులిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, అదేదో గొప్ప కార్యమైనట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. అది ఎప్పుడూ చెబుతున్న మాటే. పోలవరానికి సంబంధించి పెరుగుతున్న ప్రాజెక్టు వ్యయాన్ని, అందులో భాగమైన పునరావాస, పునర్నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు పూర్తిగా ఇస్తామని అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చును కూడా తర్వాత ఎపుడో ఇవ్వటం మినహా ముందస్తుగా నిధులు ఇస్తున్నదీ లేదు. ఇపుడు బిజెపి ప్రభుత్వం అదనంగా ఇస్తామన్నదీ లేదు.
టిడిపి 2014 లో అధికారానికి వచ్చినపుడు కూడా ఇలాగే వ్యవహరించింది. విభజన హామీలను అమలు చేయించే అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా తామేదో గొప్పగా సాధించినట్లు ప్రచారం చేసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హెూదా ఇవ్వటం లేదని, దానికి బదులుగా ప్యాకేజి ఇస్తామని ఆనాడు కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేయటానికి పూనుకున్నా దానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజి పేరుతో ఏమీ ఇవ్వకుండానే రాష్ట్రానికి ఏదో గొప్పగా చేస్తున్నట్లు మోసం చేయటానికి ప్రయత్నం చేస్తే, దానిలో వీరు కూడా భాగస్వాములై దానిని ప్రజల చేత మింగించటానికి ప్రయత్నం చేశారు. చివరికి ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతను గమనించి, ప్రత్యేక హెూదా, ఇతర సమస్యలను సాధిస్తామంటూ ఎన్నికలు జరగటానికి సంవత్సరం ముందు కేంద్ర ప్రభుత్వం నుండి బయటికి వచ్చినా,
ఎన్నికలలో ప్రజలు వారి అవకాశవాదానికి తగిన శిక్ష వేసి అధికారానికి దూరం చేశారు. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ప్రదర్శించిన విన్యాసాలనే ఈనాడు కూడా ప్రదర్శిస్తున్నారు. దీనిని రాష్ట్ర ప్రజలు సహించరు. అందువలన తెలుగుదేశం పార్టీ తమ అవకాశవాదాన్ని పక్కన పెట్టి, రాష్ట్ర ప్రయోజనాల సాధనకు పూనుకుంటేనే ప్రజలిచ్చిన అధికారానికి న్యాయం చేసినవారవుతారు. కేవలం కొద్దిమంది వ్యక్తుల ప్రయోజనాలే లక్ష్యంగా బిజెపితో అంటకాగటానికి ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరవు. టిడిపి ఈ అంశాలను గమనంలో ఉంచుకొని వ్యవహరిస్తే రాష్ట్రంతో పాటు ఆ పార్టీకి కూడా మేలు జరుగుతుంది.
* ప్రజలపై భారాలు తగ్గటానికి శ్వేతపత్రాలు దోహదం చేస్తాయా?
టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి ప్రభుత్వం వివిధ రంగాలలో వ్యవహరించిన తీరు, ప్రజలపై వేసిన భారాలపై శ్వేతపత్రాలు ప్రకటించాలని నిర్ణయించారు. ఆ విధంగానే వివిధ రంగాలపై శ్వేతపత్రాలను ప్రకటించారు. వైసిపి ప్రభుత్వ ఆర్థిక విధానాల ఫలితంగా ఏడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయామని శ్వేతపత్రాలలో చెప్పారు. ఎక్సైజ్ విధానం వలన 18,860 కోట్ల రూపాయలు, విద్యుత్లంగంలో 1,29,503 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని శ్వేతపత్రాలలో చెప్పారు. విద్యుత్ రంగానికి సంబంధించిన నష్టంలో వినియోగదారులపై వేసిన భారం 32,166 కోట్ల రూపాయలు, విద్యుత్ సంస్థలకు వాటిల్లిన నష్టం 49,496 కోట్ల రూపాయలు, అసమర్ధ నిర్వహణ వలన వచ్చిన నష్టం 47,741 కోట్ల రూపాయలని పేర్కొన్నారు. ఇంకా ఇసుక, మైనింగ్ విధానం వలన వచ్చిన నష్టాలను కూడా ఆయా రంగాలకు సంబంధించి జారీ చేసిన శ్వేతపత్రాలలో పేర్కొన్నారు.
విద్యుత్ రంగ సంస్థలతో గానికి బంధించిన శ్వేతపత్రంలో నష్టాలతో పాటు ప్రజలపై వేసిన భారాలను పేర్కొన్నారు. గత ఐదు సంవత్స రాల కాలంలో రాష్ట్రంలో గృహ వినియోగ దారులపై 32,166 కోట్ల రూపాయల భారాలను వేసినట్లు చెప్పారు. అంటే సంవత్సరానికి సగటున 6,400 కోట్ల రూపాయలకు పైగా భారాలను వేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల, గతంలో వాడిన విద్యుత్కు అదనంగా చెల్లించాల్సిన ఛార్జీల రూపంలో వైసిపి ప్రభుత్వ హయాంలో ఈ భారాలను మోపారు. గత వినియోగానికి వసూలు చేస్తున్న ఛార్జీలను ప్రజలు ఇప్పటికీ చెల్లిస్తున్నారు. టిడిపి ప్రభుత్వం ఈ అదనపు ఛార్జీల వసూలును ఉపసంహరించటానికి చర్యలు తీసుకొంటే ప్రజలకు తక్షణ ఉ పశమనం లభిస్తుంది. గత ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీలను పెంచటం ద్వారా అనవసర భారం మోపింది కాబట్టి రానున్న ఐదు సంవత్సరాలలో విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు. గతంలో వినియోగించిన విద్యుత్కు చెల్లించాల్సిన అదనపు ఛార్జీల పేరుతో భారం మోపాల్సిన అవసరం కూడా ఉండదు.
నిర్వహణను మెరుగుపరిస్తే విద్యుత్ సంస్థల ఆదాయాలు పెరుగుతాయని శ్వేతపత్రాలు వెల్లడిస్తున్నాయి. అలా చేస్తే ఆ సంస్థలు చెల్లించాల్సిన రుణాలు తగ్గుతాయి. గత ప్రభుత్వం సౌర విద్యుత్ కొనుగోలు కోసం సెకితో ఒప్పందం చేసుకున్నపుడు ధరల విషయంపై చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ఉన్న మార్కెట్ ధర కన్నా అధిక ధరకు 25 సంవత్సరాల పాటు సెకి నుండి విద్యుత్ను కొనుగోలు చేస్తూ ఒప్పందం చేసుకున్నది. అది ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపుతుంది. వ్యవసాయ మోటార్లకు, గృహ వినియోగానికి స్మార్ట్ మీటర్లు బిగించటంతో వేలకోట్ల రూపాయల భారం ప్రజలపై పడటంతో పాటు రైతాంగంపై వ్యవసాయ విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపే ప్రమాదం పొంచివుంటుంది. విద్యుత్ సంస్థలు, వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల అవసరం లేదు. ఇటువంటి భారాలను తగ్గించటానికి టిడిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. శ్వేతపత్రాలలో వెల్లడించినట్లు వైసిపి ప్రభుత్వ హయాంలో కోల్పోయిన ఏడు లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని రానున్న ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ఖజానాకు సమకూరేలా చూడాలి. దానికి అదనంగా పెరుగుతున్న ఆదాయం తోడయితే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో వేగంగా పురోగమించేలా చేయవచ్చు.
అలా కాకుండా వైసివి తప్పుడు విధానాల కారణంగా పోయిన ఆదాయాన్ని పొందటానికి చర్యలు తీసుకోకపోతే కేవలం జగన్మోహన రెడ్డిని విమర్శించటానికి మాత్రమే రూపొందించిన చిట్టాగా శ్వేతపత్రాలను ప్రజలు భావిస్తారు. జగన్మోహనరెడ్డి పరిపాలన సరిగా లేదనే ప్రజలు టిడిపికి అధికారం అప్పగించారు. శ్వేతపత్రాలలో పేర్కొన్నట్లుగా ఆదాయం పెంచకపోయినా, ప్రజలపై వేసిన భారాలను తగ్గించకపోయినా టిడివి ప్రభుత్వం రూపొందించిన శ్వేతపత్రాలకు ఎటువంటి విలువా ఉండదు. టిడిపి ప్రభుత్వం ఈ అంశాలను గమనంలో ఉంచుకొని పరిపాలన సాగిస్తుందో లేదో చూడాలి. వీటి పై వ్యవహరించే తీరే ప్రభుత్వం ప్రయాణించే మార్గాన్ని నిర్దేశిస్తుంది.
ప్రభుత్వ విధానాలలోని లోపాలను సరిదిద్ది, శ్వేతపత్రాలలో పేర్కొన్న ఆదాయాలను సక్రమంగా రాబడితే రాష్ట్రాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ప్రజలపై భారాలు తగ్గుతాయి. వారి పరిస్థితులు మెరుగు పడతాయి.
* బిజెపి -హిందూత్వ
పార్లమెంటు ఎన్నికలలో ఓట్లు, సీట్లు తగ్గినప్పటికీ భారతదేశాన్ని హిందూరాష్ట్రగా మార్చటానికి బిజెపి ప్రయాణం కొనసాగు తుందని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్పష్టం చేస్తున్నాయి. గతం నుంచి అమలు జరుగుతున్న మూడు చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్, ది కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసిడ్యూర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియంలను 2023, డిసెంబరు 23న పార్లమెంటు ఆమోదించింది. ఈ చట్టాలు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి. పోలీసులకు అపరిమితమైన అధికారాలను కట్టబెడతాయి నిరంకుశ విధానాలను మరింత ముందుకు తీసుకుపోవటానికి దోహదం చేస్తాయని ప్రతిపక్షాలు, ప్రజలు, అనేక సంస్థలు
జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాలేదు. రాష్ట్రాలను పట్టించుకోని కేంద్రం నిరంకుశ పోకడలే ఇందుకు కారణం. తనకు పూర్తి మెజారిటీ వచ్చినపుడు వ్యవహరించిన విధంగానే మైనారిటీ ప్రభుత్వంలో కూడా బిజెపి వ్యవహరిస్తున్నదని ఈ విషయాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే అన్ని విషయాలలోనూ యధేచ్చగా వ్యవహరించటం సాధ్యం కాకపోవచ్చు. కాని తన మౌలికమైన హిందుత్వ విధానాల కొనసాగింపులో వెనక్కు తగ్గదని బిజెపి వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తున్నది. బిజెపికి మద్దతిస్తున్న టిడిపి, జెడి(యు), ఇతర పార్టీలు తమ స్వప్రయోజనాలు మినహా దేశప్రయోజనాలను పట్టించుకొనే స్థితిలో లేవు. ఇక మతోన్మాద పోకడలను అవి ప్రతిఘటిస్తాయని భావించటం అత్యాశే అవుతుంది. కాబట్టి, బిజెపి మతోన్మాదాన్ని ప్రతిఘటించటానికి ప్రతిపక్షాలు ప్రజలను . సమీకరించాలి. కార్మికులు, కర్షకులు, కష్టజీవులైన ప్రజల ఉమ్మడి ప్రతిఘటనే హిందుత్వ వైపుకు సాగకుండా బిజెపిని , నిలువరిస్తుంది.
____________________________