25/09/2025
కొడంగల్ లో కూల్చిన దర్గాను యధా స్థానంలో ఏర్పాటు చేయాలి : బిఆర్ఎస్ మైనారిటీ నాయకులు
మైనార్టీలను కలవడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి
నరేందర్ రెడ్డి అరెస్టు చేసి దోమ పోలీస్ స్టేషన్ కు తరలింపు
దోమ లో మహేష్ రెడ్డి, మీర్ మహేమూద్ అలీ, బిఆర్ఎస్ నాయకులు అరెస్టు చేన్గోముల్ పి యస్ కు తరలింపు
పరిగి, సెప్టెంబర్ 25 (ప్రజాజ్యోతి) :
కోడంగల్ పట్టణంలోని కోస్గి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా దర్గా, స్మశాన వాటికలను తొలగించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు చర్యగా పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. గురువారం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అలాగే మాజీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇబ్రహీం ఇసాక్ కొడంగల్ మైనారిటీ నాయకులను కలవడానికి వెళ్లిన నేపథ్యంలో కొడంగల్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి దోమ పోలిస్ స్టేషన్ కు మాజీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇబ్రహీం ఇసాక్ పరిగి పోలిస్ స్టేషన్ కు తరలించారు. ఈ సమాచారం అందిని వెంటనే పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తోపాటు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మీర్ మహేమూద్ అలీ, ప్రవీణ్ కుమార్ రెడ్డి, సురేందర్ మాజీ కౌన్సిలర్ మీర్ తాహేర్ అలీ తోపాటు బిఆర్ఎస్ నాయకులు దోమ పోలిస్ స్టేషన్ కు బయలుదేరి పట్నం నరేందర్ ని కలిసారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీ లకు ద్రోహం చేస్తూ ఇప్పుడు దౌర్జన్యానికి దిగిందని, ఈ ప్రభుత్వంలో ప్రజలు అన్ని వర్గాల ప్రజలు అన్ని విధాలుగా బాధలు ఎదుర్కొంటున్నారని, అన్నారు. లగచర్ల లో గిరిజనులపై కక్ష పెట్టుకొని సీయం రేవంత్ రెడ్డి వారిని జైలుకి పంపించాడని గుర్తు చేశారు. అదేవిధంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మీర్ మహేమూద్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి మైనార్టీలు వ్యతిరేకం కాదని దర్గాతో పాటు స్మశానవాటికలను తొలగించడం సరైంది కాదన్నారు, తొలగించిన దర్గాను, యధా స్థానంలో ఉండే విధంగా చూడాలన్నారు, ఇప్పటికైనా అధికారులు, ప్రభుత్వం ఆలోచించి యధా స్థానంలో దర్గాను, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు, ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్న ఒక్క ముస్లిం మంత్రి నియమించపోవడం శోచనీయం అని, అది డిల్లీ లో అధికారంలో వున్న పెద్దలకు సంతోష పెట్టడానికే అని అన్నారు. కొడంగల్ తన స్వంత నియోజకవర్గంలో రోడ్డు విస్తారణ సాకుతో దాదాపు 500 సంవత్సరా మూడు ముస్లిం స్మశాన వాటికలను అలాగే రెండు మెహేబూబ్ సుభాని దర్గలను ముఖ్యమంత్రి ఆదేశంతో అర్దరాత్రి రెండు గంటల సమయంలో కూల్చడంతో ముస్లింల మనోభావాలను దెబ్బతీశారని, దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని మైనార్టీ నాయకులు మీర్ మహేమూద్ అలీ అన్నారు, అనంతరం సీయం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలతో ధర్నా నిర్వహించడంతో దోమ పోలీసులు పరిగి బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి చెన్గోముల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వర్గం వారు ఇబ్బందులు ఎదుర్కొంటన్నారని అక్రమ అరెస్టులతో భయపడదు లేదని హక్కులను కాపాడుకునే వరకు ప్రభుత్వం పై పోరాటం సాగుతుందని మైనార్టీల నాయకులు తెలిపారు.