Katasani Rambhupal Reddy

Katasani Rambhupal Reddy 2019,2009,2004,1994,1989,1985 PANYAM MLA,Rayalaseema Senior Politician,
YSRCP State General Secretary

02/06/2026

టీచర్ అవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ప్రయత్నిస్తే తమను మోసం చేసి రోడ్లపైకి లాగారని ఓ మహిళ బాధపడుతున్నారు. రోజుకు 20 గంటల పాటు చదువుకుని, అప్పులు తెచ్చి లక్షలు ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లకు వెళ్లి డీఎస్సీ కొట్టాలని భావించిన అభ్యర్ధులు.. ఇప్పుడు జరిగిన అక్రమాలు చూసి నివ్వెరపోతున్నారు. ఈ 3 లక్షల 30 వేల మంది బాధితుల బాధ వర్ణనాతీతంగా ఉంది

హెరిటేజ్ పాలు, పెరుగు అమ్మినట్లు 15 లక్షలకు ఎస్జీటీ, 20 లక్షలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు రేట్లు పెట్టి అమ్ముకున్నారు. దాని ఆడియో రికార్డింగ్ లీక్ అయినా ఏ ఒక్కరిపై ఇవాళ్టికీ చర్యలు తీసుకోలేదు. దీన్ని బట్టి కచ్చితంగా ఇందులో లోకేష్ పాత్ర ఉందని అర్దమవుతోంది..

సీబీఐ విచారణ చేయించాలి లేనిపక్షంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. ఇవాళ జరిగిన కార్యక్రమం ఆరంభం మాత్రమే. డీఎస్సీ అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర ఉద్యమాలు తప్పవు.


నంద్యాల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక...
02/06/2026

నంద్యాల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించిన వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసిన అన్యాయాలను తీవ్రంగా విమర్శించారు...

ఈ సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో రూపొందించిన పోస్టర్ మరియు బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన టీడీపీ ప్రభుత్వం, ఉద్యోగులు, రైతులు, మహిళలు, యువత సహా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి వెన్నుపోటు పొడిచిందని ఆయన ఆరోపించారు...

ఈ కార్యక్రమంలో నంద్యాల మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాథ్ రెడ్డి గారు మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

YS Jagan Mohan Reddy
Silpa Ravi Reddy Gangula Nani
Katasani Rambhupal Reddy
Katasani Shiva Narasimha Reddy
YSR Congress Party - YSRCP







02/06/2026

నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడే చర్యలను సహించబోము, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. డీఎస్సీ నియామకాలలో పూర్తి పారదర్శకత పాటించి, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలి.ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో సమగ్ర విచారణ జరపాలి. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాను..


02/06/2026

అధికారంలోకి రాగానే జిల్లాకు లక్ష ఉద్యోగాల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, అప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్, విద్య రంగానికి కూడా అలాగే తూట్లు పొడిచారు. ఇప్పుడు డీఎస్సీకి సంబంధించి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి మూడు లక్షల మంది కలల్ని కల్లలు చేశారు. లోకేష్ చేతకానితనం, అసమర్థతతోనే ఈ స్కాం జరిగింది. లోకేష్ దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని, సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం.


కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న మెగా డీఎస్సీ నేడు నిరుద్యోగ యువతకు “దగా డీఎస్సీ”గా మారిందని వైఎస్సార్...
01/06/2026

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసుకున్న మెగా డీఎస్సీ నేడు నిరుద్యోగ యువతకు “దగా డీఎస్సీ”గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడింది. డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలు, అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు కాటసాని రామభూపాల్ రెడ్డి గారు, సీఈసీ మెంబర్ పీపీ నాగిరెడ్డి గారు, ఎమ్మెల్సీఇస్సాక్ బాషా గారు, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి గారు, కాటసాని రామిరెడ్డి గారు, గంగులబిజేంద్రనాథ్ రెడ్డి గారు, స్టేట్ యూత్ వింగ్ జనరల్ సెక్రెటరీ కాటసాని ఓబుల్ రెడ్డి గారు, జిల్లా యువజ విభాగం అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాలలో భారీగా నిరసన కార్యక్రమం నిర్వహించారు...

నూనెపల్లి సర్కిల్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు వేలాది మంది నిరుద్యోగ యువత, విద్యార్థులు, వైఎస్సార్‌సీపీ నాయకులు భారీ ర్యాలీగా తరలివెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించి డీఎస్సీ నియామకాలలో చోటుచేసుకున్న ప్రతి అవకతవకపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు..

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రామభూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో యువతకు ఆశలు కల్పించి, చివరికి వారి జీవితాలతో ఆటలాడటం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు..డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకత పూర్తిగా కొరవడిందని, మెరిట్ ఉన్న అభ్యర్థులు అన్యాయానికి గురవుతుంటే ప్రభుత్వం మౌనంగా చూస్తోందని విమర్శించారు...

స్పోర్ట్స్ కోటా ఎంపికలు, కటాఫ్ మార్కుల వెల్లడిలో భారీ గోల్‌మాల్ జరిగిందనే ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే పూర్తి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నిజంగా ఎలాంటి అక్రమాలు జరగలేదంటే స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితాను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.. నిరుద్యోగ యువత సమస్యల కంటే ట్విట్టర్, ఫేస్‌బుక్ ప్రచారాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని ఆరోపించారు. “సోషల్ మీడియా పోస్టులు కాదు.. నిరుద్యోగుల భవిష్యత్తు ముఖ్యం” అని హితవు పలికారు..

గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు లక్షలాది ఉద్యోగాలను ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా భర్తీ చేశారని గుర్తు చేశారు. కానీ నేడు కూటమి ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నియామకాలపై అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తడం దురదృష్టకరమన్నారు..డీఎస్సీ బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు, నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయంపై నిజాలు వెలుగులోకి వచ్చే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని, ప్రతి బాధిత అభ్యర్థికి అండగా నిలుస్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు...

రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలు, అక్రమాలు మరియు అర్హ...
01/06/2026

రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలు, అక్రమాలు మరియు అర్హులైన అభ్యర్థులకు జరిగిన అన్యాయాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్సీ బాధితురాలు షేక్ హసీనాబీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటసాని శివ నరసింహారెడ్డి, బుట్టా ప్రతుల్ కలిసి కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరి గారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా షేక్ హసీనాబీ మాట్లాడుతూ.. డీఎస్సీ పరీక్షలో అర్హత సాధించి, అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ చివరి దశలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాక ఉద్యోగం వచ్చినట్లు సమాచారం అందినా, అనంతరం ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా నియామక పత్రం ఇవ్వకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. తనలాంటి ఎందరో అభ్యర్థులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, వారి భవిష్యత్తుతో నిర్లక్ష్యంగా వ్యవహరించడం క్షమించరాని విషయమని అన్నారు.

అనంతరం కాటసాని శివ నరసింహారెడ్డి మాట్లాడుతూ.. లక్షలాది నిరుద్యోగ యువత జీవితాలకు సంబంధించిన డీఎస్సీ నియామకాల ప్రక్రియపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలు నెలకొన్నాయని అన్నారు. మెరిట్ జాబితాల వెల్లడిలో పారదర్శకత లేకపోవడం, ఎంపిక ప్రక్రియపై అనేక సందేహాలు తలెత్తడం, అర్హులైన అభ్యర్థులు పక్కనపడటం వంటి అంశాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

డీఎస్సీ నియామకాల పేరుతో యువత ఆశలను, వారి కష్టాన్ని, భవిష్యత్తును బలిగొట్టే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయని, దీనిపై ప్రభుత్వం మౌనం పాటించడం మరింత అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ప్రశ్నాపత్రాల నిర్వహణ, ఫేక్ సర్టిఫికెట్ల వినియోగం, మెరిట్ ఎంపిక విధానం, ఉద్యోగాల కేటాయింపులో జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై సీబీఐ లేదా ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ నియామకాలలో జరిగిన ప్రతి అక్రమాన్ని వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా యువతలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వినతిపత్రం సమర్పించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, విద్యార్థులతో కలిసి భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. “డీఎస్సీ బాధితులకు న్యాయం చేయాలి”, “డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి”, “నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు”, “అవినీతికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఎద్దుల శివారెడ్డి, జిల్లా కార్యదర్శి మధు, ఎమ్మిగనూరు యువజన విభాగ అధ్యక్షులు డి. నజీర్ అహ్మద్, కోడుమూరు యువజన విభాగ అధ్యక్షులు ఎం.కే. వెంకటేష్, పాణ్యం యువజన విభాగ అధ్యక్షులు దుర్గ, పత్తికొండ యువజన విభాగ అధ్యక్షులు అశోక్ కుమార్ రెడ్డి, పాణ్యం పబ్లిసిటీ విభాగ అధ్యక్షులు సాయి, ఎమ్మిగనూరు మండల యువజన విభాగ అధ్యక్షులు బనవాసి బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీ బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు, నియామకాలలో జరిగిన ప్రతి అవకతవకపై నిజాలు వెలుగులోకి వచ్చే వరకు తమ పోరాటం ఆగదని, నిరుద్యోగ యువత తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.





✊🔥

నంద్యాల శ్రీనివాస్ సెంటర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంస...
31/05/2026

నంద్యాల శ్రీనివాస్ సెంటర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు..

ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నాయకులు టిడిపి చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు..ఘటన జరిగిన కొద్ది సేపటికే టిడిపి నాయకులు, సోషల్ మీడియా వేదికగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తేనంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించడం దురుద్దేశపూర్వక చర్య అని మండిపడ్డారు...ఒకవైపు పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తి అంటూ సర్టిఫికేట్ చూపించి ఘటనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండగా, మరోవైపు టిడిపి నాయకులు అతడు వైసీపీ కార్యకర్త అని ప్రచారం చేయడం వెనుక అసలు వాస్తవాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు...

టిడిపి, జనసేన నాయకులతో సన్నిహితంగా తిరిగే వ్యక్తి విగ్రహ ధ్వంసానికి పాల్పడితే, దానిని వైసీపీ కార్యకర్తగా చిత్రీకరించడం రాజకీయ కుట్రలో భాగమేనని నాయకులు ఆరోపించారు. మహానేత వైఎస్సార్ గారి విగ్రహాన్ని అవమానించడం కోట్లాది మంది అభిమానుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు..

తదుపరి ఈ ఘటనపై నంద్యాల 1వ పట్టణ పోలీసు స్టేషన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసి సంఘటన స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా మరియు ఇతర ఆధారాలను పరిశీలించి పూర్తి స్థాయి విచారణ జరిపి, ఈ ఘటన వెనుక ఉన్న అసలు కుట్రదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు...రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిజాలను వెలికితీయాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు...


Address

Panem
518112

Website

Alerts

Be the first to know and let us send you an email when Katasani Rambhupal Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share