జనసేన పార్టీ మిర్యాలగూడ

జనసేన పార్టీ మిర్యాలగూడ leadar of janasena party ✊
vice president miryalaguda

• జై శ్రీ రామ్ 🛕🙏🏻🚩Ayodhya History : 1528 నుంచి 2024 వరకు అయోధ్య ప్రస్థానం.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ!కోట్లాది మంద...
21/01/2024

• జై శ్రీ రామ్ 🛕🙏🏻🚩

Ayodhya History : 1528 నుంచి 2024 వరకు అయోధ్య ప్రస్థానం.. వివాదం నుంచి ఆలయ ప్రాణప్రతిష్ఠ!

కోట్లాది మంది భారతీయుల కల అయిన అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుంది. త్వరలోనే అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలోనే అయోధ్య ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అయితే 1528 లో ప్రారంభమైన అయోధ్య రామ మందిర వివాదం.. 2019 లో సుప్రీం కోర్టు తీర్పుతో ముగిసింది. ఈ క్రమంలోనే అసలు 1528 లో వివాదం ఎలా మొదలైంది. అప్పటి నుంచి ఎలా ముందుకు సాగింది. అసలు అప్పటి నుంచి ఎలా వివాదం సాగింది. దేశంలోని అన్ని రామ మందిరాలతో పోలిస్తే.. అయోధ్య రామాలయం చాలా ప్రత్యేకం. ఎందుకంటే రాముడి జన్మభూమిగా భావించే చోట.. రామ మందిరాన్ని నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు జరిగాయి. మరెన్నో వివాదాలు అయోధ్యను చుట్టుముట్టాయి. రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్య వివాదం గురించి ఓసారి చూద్దాం.

మొఘలుల పరిపాలన కాలంలో 1528 లో అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి.. అప్పటి చక్రవర్తి బాబర్ పాలనలో కమాండర్‌గా ఉన్న మీర్ బఖి ఆదేశాలు జారీ చేశారు. అయితే బాబ్రీ మసీదు నిర్మించిన చోటే.. శ్రీరాముడి జన్మస్థలం అని చెబుతూ ఉంటారు. అయితే 1843 నుంచి 1949 వరకు మసీదు చుట్టూ అనేక వివాదాలు నెలకొన్నాయి. మతపరంగా కూడా ఎన్నో ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. 1853, 1859 లో ఘర్షణలు తార స్థాయికి చేరాయి. దీంతో అప్పుడు ఉన్న బ్రిటీష్ ప్రభుత్వం.. అయోధ్యలో ఉన్న వివాదాస్పద భూమి చుట్టూ కంచె లు ఏర్పాటు చేసింది. మసీదు లోపలి భాగంలో ముస్లింలు, బయటి భాగంలో హిందువులు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది.

ఇక భారత దేశానికి స్వాతంత్య్రం తర్వాత 1949 సెప్టెంబర్ 23 వ తేదీన అయోధ్య వివాదం మరోసారి తారస్థాయికి చేరింది. మసీదు లోపల శ్రీరాముడి విగ్రహాలను గుర్తించినట్లు హిందువులు చెప్పడం.. అప్పట్లో సంచలనంగా మారింది. శ్రీరాముడే సాక్షాత్కరించాడని హిందువులు ప్రచారం చేశారు. అప్పుడు మత ఘర్షణలు జరుగుతాయేమో అన్న భావనతో.. మసీదు లోపలి నుంచి విగ్రహాలను తొలగించాలని అప్పటి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మతపరమైన మనోభావాలు దెబ్బతింటే ఏర్పడే హింసను నియంత్రించడం కష్టమంటూ.. రాముడి విగ్రహాలను మసీదు లోపల నుంచి తీయలేమని అప్పటి జిల్లా మెజిస్ట్రేట్ కే.కే. నాయర్ చెప్పారు.

ఇక 1950 లో ఫరీదాబాద్ సివిల్ కోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూమిలో రాముడికి పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆయా వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేర్కొన్నారు. 1961 లో మసీదులోని విగ్రహాలు తొలగించి.. వివాదాస్పద భూమిని తమకు అప్పగించాలని కోరుతూ.. ఉత్తర్ప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 1986 లో ఉమేశ్ చంద్ర పాండే వేసిన పిటిషన్ ఆధారంగా.. వివాదాస్పద భూమికి ఉన్న తాళాలను తీసేసి.. హిందువులు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరి 1 వ తేదీన ఫరీదాబాద్ జిల్లా జడ్జి కే.ఎం. పాండే అనుమతులు ఇచ్చారు.

ఇక అయోధ్య రామ జన్మభూమి స్థలం, బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద ఘటన 1992 డిసెంబర్ 6 వ తేదీన చోటు చేసుకుంది. విశ్వ హిందు పరిషద్, శివసేన కార్యకర్తలు.. వివాదాస్పద భూమిలోకి చొచ్చుకెళ్లి.. వివాదాస్పద ప్రాంగణంలోని బాబ్రీ మసీదు కట్టడాన్ని ధ్వంసం చేశారు. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అనేక చోట్ల మత ఘర్షణలు చోటు చేసుకోగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఆ ఘటన తర్వాత 2002 లో హిందూ కార్యకర్తలే లక్ష్యంగా గుజరాత్లో గోద్రా అల్లర్లు జరిగాయి. అనంతరం నెలకొన్న హింసాత్మక ఘటనల్లో 2 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆ తర్వాత 2010 లో వివాదాస్పద భూమిని 3 భాగాలుగా విభజిస్తూ అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సున్నీ వక్ఫ్ బోర్డు, రామ్ లల్లా విరాజ్మాన్, నిర్మోహి అఖారాలకు పంచుతూ నిర్ణయం తీసుకుంది. దీన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయగా.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 2011 లో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇక 2011 నుంచి 2016 వరకు అయోధ్య వివాదం చుట్టూ సుప్రీం కోర్టులో అనేకమార్లు విచారణ జరిగింది. చివరగా 2017 లో ఔట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. అదే సమయంలో అనేక మంది రాజకీయ నేతలపై క్రిమినల్ అభియోగాలు మోపింది.

మధ్యవర్తిత్వంతో అయోధ్య వివాదాస్పద భూమికి పరిష్కారం కోసం 8 వారాల గడువు ఇస్తున్నట్టు 2019 మార్చి 8 వ తేదీన సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే ఈ మధ్యవర్తిత్వం ద్వారా ఎలాంటి పరిష్కారం లభించలేదని.. 2019 ఆగస్ట్ 2 వ తేదీన.. సుప్రీంకోర్టుకు మీడియేషన్ ప్యానెల్ నివేదికను అందించింది. దీంతో అప్పటి నుంచి అయోధ్య బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు రోజువారీ విచారణ చేపట్టింది. 2019 ఆగస్టు 16 వ తేదీన అయోధ్య వివాదంపై తీర్పును రిజర్వ్లో ఉంచింది.

2019 నవంబర్ 9 వ తేదీన ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అయోధ్య వివాదాస్పద భూమిపై చారిత్రక తీర్పును వెలువరించింది. 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి అప్పగిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. మరో 5 ఎకరాలను మసీదు నిర్మాణానికి కేటాయించింది. ఆ తీర్పుతో దేశవ్యాప్తంగా హిందువులు సంబరాలు చేసుకున్నారు.

2020 మార్చి 25 వ తేదీన.. 28 ఏళ్ల పాటు టెంట్లో ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని ఫైబర్ టెంపుల్లోకి తరలించారు. 2020 ఆగస్ట్ 5 వ తేదీన.. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. 2024 జనవరి నాటికి రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు జరిగాయి. వేలాది మందికి ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ క్రమంలోనే జనవరి 22 వ తేదీన అయోధ్యలో అంగరంగ వైభవంగా శ్రీ రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది.

30/12/2023

తెలంగాణ రాష్ట్రంలో మొన్న 2023 జరిగిన ఎలక్షన్లలో 18 సంవత్సరాలు కూడా నిండిన వాళ్లకి ఓటర్ కార్డ్ రావడం లేదు 16 17 సంవత్సరాల కి కూడా ఇప్పుడు ఓటర్ ఐడి ఇస్తున్నారు గ్రామపంచాయతీలో పల్లెటూరు మండలంలో అంగన్వాడీ టీచర్లు ఇంటింటికీ వెళ్లి చిన్న వయసు ఉన్న వాళ్లకి కూడా ఓటర్ జాబితాలో పేరు రాస్తున్నారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో చాలామందికి కొత్త ఓటర్ కార్డులు వచ్చాయి,....... చిన్న వయసు ఉన్న వాళ్లకి

Happy Birthday Pavan Kalyan sir
02/09/2023

Happy Birthday Pavan Kalyan sir

21/10/2022
నూతనంగా నియోజకవర్గ కమిటీకి ఎన్నికైన మన కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము...నాతో పాటు మిర్యాలగూడ నియో...
09/05/2022

నూతనంగా నియోజకవర్గ కమిటీకి ఎన్నికైన మన కార్యకర్తలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము...

నాతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గం కమిటీ సభ్యులుగా అన్నికైన ప్రతి ఒక జనసైనికుడికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు 💐💐💐💐💐

Happy republic day
26/01/2022

Happy republic day

Address

Miryalaguda

Alerts

Be the first to know and let us send you an email when జనసేన పార్టీ మిర్యాలగూడ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to జనసేన పార్టీ మిర్యాలగూడ:

Share