28/05/2026
ప్రజా ఆరోగ్యం మెరుగుపరచడానికి బస్తీ దవాఖాన ఏర్పాటు
మురికివాడలలో ప్రజా ఆరోగ్యం మెరుగుపరచేందుకు బస్తీ దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డీఎంహెచ్వో ఉమా గౌరీ తెలిపారు.
మల్కాజ్గిరి శాసనసభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు బుధవారం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని హిల్టాప్ కాలనీలో ఉన్న కమ్యూనిటీ హాల్లో బస్తీ దవాఖాన ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు.
అలాగే ఇందిరా నెహ్రూ నగర్ కాలనీలోని మరో స్థలాన్ని కూడా పరిశీలించారు. త్వరలోనే బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో లావణ్య, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల రాము యాదవ్ తదితరులు పాల్గొన్నారు.