13/08/2023
గో మహా పాదయాత్ర కు స్వాగతం పలికిన లీగల్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ.
గోవును కాపాడాలని, గో సంరక్షణ కోసం, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ "అఖిల భారత గో సేవా ఫౌండేషన్" ఆధ్వర్యంలో శ్రీ బాలకృష్ణ గురుస్వామి బృందం హైదరాబాద్ నుండి అరుణాచలం వరకు 6/08/2023 నుండి 30/08/2023 వరకు 25 రోజుల పాటు 789 కిలోమీటర్ల పాదయాత్రను లీగల్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు శ్రీ మదన్ మోహన్ గురూజీ గారు, ప్రధాన కార్యదర్శి, ఐరన్ లేడీ రాజలక్ష్మి మందా గారి ఆదేశం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ ముఖద్వారం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా వారికి లీగల్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చింతలపల్లి రామకృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి శ్రీమతి కౌసల్య మరియు సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారు చేస్తున్న ఈ పాదయాత్రను విజయవంతం కావాలని అభినందనలు తెలిపి, ప్రభుత్వం కూడా గోవును రక్షించేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలను ఇంకా కఠినంగా అమలు చేయాలని, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోవును పెంచే రైతులకు దాన కోసం నిధులు మంజూరు చేయాలని, సేంద్రియ వ్యవసాయం గురించి రైతులకు అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. గోవు ఉన్న ఇండ్లు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కారణం గో మూత్రం ద్వారా అనేక మందులు తయారు చేయడం, గో మయం ఎరువు గా వాడడం, గో మయం తో ఊదిబత్తి ల తయారీ, పాలు ఆరోగ్య రక్షణ కోసం ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఆవు ను సంరక్షణ కోసం ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు.
గో సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా ఒత్తిడి తీసుకు రావడం కోసం లీగల్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు శ్రీ మదన్ మోహన్ గురూజీ మరియు ప్రధాన కార్యదర్శి రాజలక్ష్మి మందా గారు కృషి చేస్తామని చెప్పారు.
ధన్యవాదములతో
మీ రామకృష్ణ చింతలపల్లి, అధ్యక్షులు, మరియు శ్రీమతి కౌసల్య, ప్రధాన కార్యదర్శి, లీగల్ రైట్స్ కౌన్సిల్, ఆంధ్ర ప్రదేశ్.