22/04/2020
దయచేసి షేర్ చేయండి 🙏🙏
వైయస్సార్ పార్టీ గౌరవాధ్యక్షురాలు YS Vijayamma గారికి, గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి YS.Bharathi Reddy FC గారికి నమస్కారాలు 🙏🙏
అమ్మా....పెద్దాయన మరణానంతరం జరిగిన పరిణామాలతో, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి,సొంతంగా పార్టీ పెట్టి,డిల్లీని ఎదురించిన కుటుంబం మీది,ఆ తరువాత కక్షసాధింపు కోసం మీపై పెట్టిన కేసులు,విచారణలు జైలు అంటూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో అవమానాలని ఓర్చుకున్నారు, పత్యర్ధులు సూటిపోటి మాటలు అంటుంటే, ఆ బాధను దిగమింగుతూ ఎన్ని నిద్రలేని రాత్రుల్లు గడుపుంటారో మేము ఊహించగలము...
ఆ కష్టకాలంలో మీతో ఉన్న నాయకులు కొందరు,మిమ్మల్ని వదులుకున్న నాయకులు కొందరు, మీ ఉప్పు తిని,మీరు రాజకీయ బిక్ష పెట్టిన కొందరు విశ్వాసం లేకుండా మాట్లాడిన మాటలు మాక్కూడ గుర్తు ఉన్నాయమ్మా,,,నాయకులని పక్కన పెడితే, మీతో మొదటినుంచి నడిచింది, కాంగ్రెస్ ని కాదని, మీ కుటుంబం ఏపార్టీలో ఉంటే అదే మాపార్టీ అనుకుని వచ్చిన కార్యకర్తలు అమ్మా...
మీతో పాటు నడిచారు,కేసులు పెట్టించుకుని బాధపడ్డారు, జగనన్నని ముఖ్యమంత్రి ని చేసుకోవాలనే సంకల్పంతో ఎన్నో బాధలుపడ్డారు, దురదృష్టవశాత్తు 2014లో పార్టీ అధికారంలోకి రాకపోవడంతో, వాళ్ళ కష్టాలు ఇంకా ఎక్కువయ్యాయి, టిడిపి గవర్నమెంట్లో కూడ ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడ్డారు, కానీ మీ కుటుంబాన్ని మాత్రం వదలలేదు, దానికి కారణం మీ కుటుంబం పై నున్న నమ్మకం...
ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ పార్టీ కోసం సర్వం త్యాగంచేసిన కార్యకర్తలను మాత్రం పట్టించుకునే నాధుడే లేడమ్మా, జగనన్నకి చెప్పుకుందామంటే, కార్యకర్తలకు అందనంత దూరం అయిపోయాడమ్మా జగనన్న, మొన్నటి దాక మామధ్య ఉంటూ, మామధ్యే తిరుగుతూ, వేలకిలోమీటర్లు తిరిగిన జగనన్నని, ఈరోజు మాకు వినపడేంత దగ్గరలో ఉన్నా,కనపడనంత దూరం అయిపోయాడమ్మా....
ఈరోజు జగనన్న తరువాత అని చెప్పుకునే నాయకులు, విజయసాయిరెడ్డి లాంటి వారు కూడ కార్యకర్తలని పట్టించుకునే పరిస్థితి లేదమ్మా, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళకి పధవులు,వాళ్ళకి భజన చేసేవాళ్ళకి ఉద్యోగాలు,ఇచ్చుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఓ ప్రైవేట్ సైన్యం స్రుష్టించుకుంటున్నారేమో అని అనుమానంగా ఉందమ్మా??
పార్టీ పార్టీ అంటూ 9ఏళ్ళు కష్టపడిన ఏకార్యకర్తని పట్టించుకోవడం లేదు, అధికారం వచ్చాక పక్కపార్టీ గోడలుదూకే వాళ్ళకే విలువ ఇస్తున్నారు, విజయసాయిరెడ్డి లాంటి వారివల్ల పార్టీకి ఆయువుపట్టు లాంటి సోషల్ మీడియా కూడ బ్రష్టు పట్టిపోయింది, పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేసే మహిళా కార్యకర్తల కష్టాలు వర్ణణాతీతం, దానికి కారణం ఆయనకి అనుకూలంగా ఉండే ఎందుకు పనికిరాని, ఓ అసమర్దుడిని సోషల్ మీడియాకి ఇంచార్జిని చేసారు..
ఎవరికి చెప్పుకోవాలో తెలీదు, జగనన్నకి చెప్పుకుందామంటే, గేటు దాటనిచ్చే పరిస్థితే లేదు, పెద్దాయన ఉన్నప్పుడు పరిస్థితి ఇలా లేదమ్మా, మా పెద్దాయన పార్టీ కార్యకర్తలకి ఎంతో విలువ ఇచ్చేవాడు, కార్యకర్తల తరువాతే ఏదైనా అంటూ భరోసా ఇచ్చేవాడు, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదమ్మా...
ఇక పార్టీలో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానీ పరిస్థితి పార్టీలో ఉంది, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు సరిగ్గా లేవు,సంక్షేమ కార్యక్రమాలు జనాల్లోకి సరిగ్గా వెళ్ళడం లేదు, అందరూ పార్టీలో మేము గొప్పంటే మేము గొప్ప అని గుర్తింపు పొందడానికి తప్ప పనిచేసే వాళ్ళు కనపడటం లేదు, కార్యకర్తలు ఎవరిదారి వాళ్ళు చూసుకుంటూ పార్టీకి దూరం అయ్యే పరిస్థితి ఎంతో దూరంలో లేదమ్మా ...
మీకు ఇవన్నీ తెలియవనే అనుకుంటున్నాం?? మీరు చొరవతీసుకుని, పార్టీలో మేమే గొప్ప అనుకునే వాళ్ళను ఎంతలో పెట్టాలో అంతలో పెట్టి, పార్టీని, కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందమ్మా,,,మీరు తలుచుకుంటే ఓ సామాన్య కార్యకర్తని నాయకుడిని చేయగలరు, కానీ ఆ నాయకుడు కార్యకర్తలా పనిచేయలేడమ్మా, ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మీచేతుల్లోనే ఉందమ్మా,మీరు ఎట్టిపరిస్థితుల్లోనూ కార్యకర్తలను దూరంచేసుకోరని ఆశిస్తూ...
సదా మీ కుటుంబ శ్రేయస్సు కోరే, ఓ సామాన్య పార్టీ కార్యకర్త.....
Copyed by facebook లింగారెడ్డి రాజశేఖరరెడ్డి ✍️✍️✍️ post}