19/10/2023
ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి 2 గ్రామ సచివాలయం పరిధిలో “జగనన్న ఆరోగ్య సురక్ష” వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురంలోని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల నుండి వచ్చిన ఇద్దరు స్పెషలిస్ట్ వైద్యులు మరియు ఇద్దరు వైద్యాధికారులు శిబిరానికి వచ్చిన 200 మందికి వైద్య సేవలు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి అంజనప్ప గారు మాట్లాడుతూ గత 20 రోజులుగా గ్రామంలో ANMలు మరియు MLHPలు ఇంటింటికీ తిరిగి పలు రకాల పరీక్షలు నిర్వహించి ఈ రోజు జరిగిన శిబిరానికి హాజరు కమ్మని తెలియజేశారన్నారు, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవలసిన అవసరం ఉందన్నారు.
అంతకుమునుపు వారు వైద్య శిబిరాన్ని సందర్శించి వైద్యులతో, ప్రజలతో ముచ్చటించారు, శిబిరం ఆవరణలో పోషకాహార వినియోగంపై అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించారు మరియు కుమ్మరవాండ్లపల్లి 2 సచివాలయం పరిధిలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు శ్రీమతి డా. డి. ప్రమీల, MD, డా. విద్యాసాగర్, MD, డా. బాబా ఫక్రుద్దీన్, MBBS గార్లు పాల్గొని ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి మూడే శాంతమ్మ బాయి గారు, మండల పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీమతి బత్తల రామలక్ష్మమ్మ గారు, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు శ్రీ సందేపల్లి పుల్లయ్య గారు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు శ్రీ షైక్ అల్లబకాష్ గారు, స్థానిక నాయకులు శ్రీ మూడే మణికంఠ నాయక్ గారు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం కుమ్మరవాండ్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీమతి వై. పద్మజ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, పంచాయతీ కార్యదర్శి శ్రీ పి. మోహన్ రెడ్డి గారి సమక్షంలో హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ సహాయకులు, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లు, ANMలు, ఆరోగ్య సహాయకులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.