01/06/2026
సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారితో పాటు డీఆర్వో మల్లికార్జునుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.
అనంతరం నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు మాట్లాడుతూ, డిజిటల్ గవర్నెన్స్లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల నిర్వహణను తప్పనిసరిగా ఈ-ఆఫీస్ ద్వారానే చేపట్టాలని సూచించారు. భౌతిక ఫైళ్ల వినియోగం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ, అన్ని శాఖల అధికారులు ఈ-ఆఫీస్ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.