18/07/2024
అందరికి నమస్కారాలు
ఈ రోజు కమలాపురం నియోజకవర్గం పార్టీ ఆఫీస్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో పాల్గొన్న *MLA పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారు*
ఐదేళ్లలో 1,75,000 ఎకరాల భూమిని దోచుకున్న వైసిపి ప్రభుత్వం.. *ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి*
గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 35వేల కోట్ల విలువచేసే 1,75,000 ఎరకరాల భూమిని దోచుకున్నారని *కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి* గారు అన్నారు.
కమలాపురం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *ఎమ్మెల్యే చైతన్య రెడ్డి* గారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న భూములను సెటిల్ చేసుకోవడం కోసమే దేశంలో ఎక్కడా లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు
వైసీపీ చేసిన అక్రమాలు, అరాచకాలు చూసి ప్రజలు వారిని ఇంటికే పరిమితం చేశారన్నారు. హౌసింగ్ కాలనీలో పేరుతో రైతుల వద్ద నుండి తక్కువ ధరకుకొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడమే కాకుండా ఆ పక్కనే వైసిపి పార్టీ వారు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారన్నారు. రామానాయుడు స్టూడియో భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని ఇవే కాకుండా దేవాలయాలు మఠాల భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని *ఎమ్మెల్యే చైతన్య రెడ్డి* గారు తెలిపారు