24/09/2025
అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ స్థలాన్ని ఆక్రమించొద్దు
--- అధికారులను నిలదీసిన మాల ప్రజా ఫ్రంట్
కుత్బుల్లాపూర్ చౌరస్తా దగ్గర రాజ్యాంగ నిర్మాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర HMT ఎస్సీ/ఎస్టీ ఉద్యోగుల సంఘానికి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో విద్యుత్ శాఖ వారు అక్రమంగా ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టడాన్ని ఖండిస్తూ ఈరోజు *మాల ప్రజా ఫ్రంట్* ఆధ్వర్యంలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులను కలవడం జరిగింది.
ఈ సందర్భంగా మాల ప్రజా ఫ్రంట్ చైర్మన్ డా. మంచాల లింగస్వామి మాట్లాడుతూ
"భారత రత్న, అణగారిన ప్రజల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డా. బాబాసాహెబ్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం గతంలో పేదల పెన్నిధి కాకా వెంకటస్వామి HMT సంస్థ, ప్రభుత్వంతో పోరాడి ఇప్పించిన స్థలాన్ని నేడు విద్యుత్ శాఖ అధికారులు అత్యుత్సాహంతో ఆక్రమించి అక్రమంగా ప్రహారీ గోడ నిర్మాణం చేయడం గర్హనీయం. విద్యుత్ శాఖ అధికారులు వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. త్వరలోనే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి అక్రమ నిర్మాణాన్ని ఆపివేయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం కృషి చేస్తామని" అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ ఆవుల సుధీర్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ దాసరి విశాల్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైసే నాందేవ్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎలిజాల సురేష్, మహిళా నాయకురాలు సుధమల్ల అంజలి, HMT ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కుమార్, ప్రధాన కార్యదర్శి వివేకానంద తదితరులు పాల్గొన్నారు.