27/08/2026
ఈరోజు జగనన్న ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గారిని కలిసి రాజీవ్ గృహకల్ప లో ఉన్న సమస్యల పైన వెంటనే చర్యలు తీసుకొని సమస్యలు పరిష్కరించాలని వారిని కోరడం జరిగింది .అందులో ముఖ్యమైనవి కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని, సిసి రోడ్లు దయనీయంగా ఉన్నవి సిసి రోడ్లు వెంటనే మంజూరు చేయాలని ,పార్కులు పనులు ప్రారంభమై మధ్యలో నిలిచిపోయినాయి ఈ పనులకు నిధులను వెంటనే మంజూరు చేయించి పనులు ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, డ్రైనేజీ వ్యవస్థకు నిధులు మంజూరు చేసి కాలనీలో మురుగునీరు సమస్య లేకుండా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండే విధంగా అధికారులను ఆదేశించి పనులు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ,గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు వెంటనే సమాచారం ఇచ్చి మీ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో గౌరవ పెద్దలు కాలనీ అధ్యక్షులు అంజన్న ధర్మారపు గారు, గౌరవ పెద్దలు ప్రధాన కార్యదర్శి భూపతి రెడ్డి గారు కాలనీ సంక్షేమ సంఘం నాయకుల సహాయ సహకారాలతో కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.