06/09/2024
అమరవీరులకు జోహార్లు
***
నక్సలైట్ల అజెండా అమలు చేస్తా అని అధికారంలోకి వచ్చిన తెరాస పార్టీ 2015లో శృతి-సాగర్ లను గ్రేహౌండ్స్ పోలీసులచే భూటకపు ఎన్కౌంటర్ చేయించింది. ఆ తరువాత విప్లవ పార్టీలు, ప్రజాసంఘాలపై నిషేధంతో అది ప్రజావ్యతిరేక ప్రభుత్వమని నిరూపించుకుంది. తెరాసను ఓడించాలనే బలమయిన ఆకాంక్ష నాలాంటి వ్యక్తులకు అట్లా మొదలయి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపేయగలిగాం.
నిన్న ఖమ్మం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6గురు ప్రజా ఉద్యమకారులను ఎన్కౌంటర్ పేరుతొ హత్య చేసింది. ఎవరి ఆదేశాలతో ఇది జరిగిందో కానీ ఇటువంటి అప్రజాస్వామిక విధానాలను కొనసాగిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెసుకు పట్టడం ఖాయం.
మరొకసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే వందలు, వేల సంఖ్యలో ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, మేధావులు, హక్కుల సంఘాలు అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దూరం అవుతాయి.
ఆ తరువాత రోజులు లెక్కబెట్టుకోవాల్సిందే!
***