28/01/2022
‘ఉన్నత విద్య’ తెలంగాణకేది?
ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి వందల విజ్ఞప్తులు
ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, నవోదయ,
మెడికల్ కాలేజీల కోసం ఢిల్లీలో ఎక్కని గడప లేదు... ఒక్క విద్యాసంస్థనూ మంజూరు చేయని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థలను పరిశీలిస్తే..
దేశంలో ఏడేండ్లలో కొత్తగా 7 ఐఐఎంలు కేటాయిస్తే అందులో
తెలంగాణకు కేటాయించినవి సున్నా!
ఐఐటీలు 7 ఏర్పాటు చేస్తే తెలంగాణకు ఇచ్చినవి సున్నా!
ఐఐఎస్ఈఆర్లు రెండు నెలకొల్పితే.. తెలంగాణలో నెలకొల్పినవి సున్నా!
ఐఐఐటీలు దేశవ్యాప్తంగా 16 ఏర్పాటు చేస్తే.. తెలంగాణలో ఏర్పాటుచేసినవి సున్నా!
ఎన్ఐడీలు దేశంలో నాలుగు పెడితే.. తెలంగాణలో పెట్టినవి సున్నా!
వివిధ రాష్ర్టాల్లో మొత్తం 157 మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేస్తే.. తెలంగాణలో ఏర్పాటు చేసినవి సున్నా!
నవోదయ పాఠశాలలు కొత్తగా 84 నెలకొల్పితే.. తెలంగాణలో సున్నా!
వీటిని తెప్పించేందుకు రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు చేస్తున్న కృషి.. పెద్ద గుండు సున్నా!
కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న పాత్ర పోషించాలి. బీజేపీ ప్రభుత్వం అయినవారికి ఆకుల్లో.. కానివారికి కంచాల్లో అన్నట్టు వ్యవహరిస్తున్నది. స్వార్థ రాజకీయ ప్రయోజనాలే తప్ప, కేంద్రంలో అధికార పార్టీగా ఏనాడూ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు. విద్యాసంస్థల కేటాయింపులో ఏడేండ్లుగా తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నది.
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని ఉదారంగా ఆదుకోవాలని.. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కేంద్రం పాలసీ ప్రకారం నవోదయ విద్యాలయాలు, మెడికల్ కాలేజీలు, ఐఐఎం, ఐఐటీ, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, ఎన్ఐడీ వంటి విద్యాసంస్థలు, పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయాలని ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం వందలసార్లు విజ్ఞప్తి చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కటీ మంజూరు చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా టీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఫలితం లేకుండా పోయింది...https://bit.ly/3HaMfIj