27/02/2026
*ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారిని మరియు నారా లోకేష్ గారిని కలిసిన జెసి ప్రభాకర్ రెడ్డి గారు.*
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ శ్రీ జెసి ప్రభాకర్ రెడ్డి గారు నేడు అమరావతి లోని సచివాలయం నందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మరియు గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని కలిసి తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలను గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా తాడిపత్రి మున్సిపాలిటీలో ఇటీవల ప్రారంభించిన సోలార్ ప్లాంట్ వలన దాదాపు 22 లక్షల రూపాయల విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది అని తెలిపారు , అంతేకాకుండా హిందూ స్మశానవాటికలో చేస్తున్న అభివృద్ధి పనులు మరియు నూతనంగా ఏర్పాటు చేయనున్న షాపింగ్ కాంప్లెక్స్ గురించి విశదీకరించి చెప్పడం జరిగింది.జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఒక నమూనాను కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు IT శాఖ మంత్రి నారా లోకేష్ గారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు "నీ మునిసిపాలిటీ భేష్ ప్రభాకర్" అంటూ జెసి ప్రభాకర్ రెడ్డి గారిని అభినందించారు.
అదే విధంగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసి పప్పూరు శ్రీ ఆశ్వర్థ నారాయణ స్వామి ఆలయ అభివృద్ధి కోసం 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని విన్నపించగా త్వరలో మంజూరు చేయిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా సచివాలయంలో న్యాయశాఖ మంత్రి శ్రీ NMD ఫారూఖ్ గారిని , దెందులూరు MLA చింతమనేని ప్రభాకర్ గారిని మరియు RTC చైర్మన్ కొనకళ్ళ నారాయణ రావు గార్లతో ముచ్చటించడం జరిగింది.