07/03/2026
త్వరలో మూడో విడత SIR (Special Intensive Revision) ప్రక్రియ దేశంలోని 22 రాష్ట్రాల్లో మొదలు కాబోతుంది అనేటువంటి వార్తల నేపథ్యంలో.
గతంలో మొదట బీహార్ రాష్ట్రంలో తర్వాత రెండో విడత దేశంలోని 12 రాష్ట్రాల్లో SIR ప్రక్రియను ECI నిర్వహించడం మనందరికీ తెలిసిందే.
ఈ SIR ప్రక్రియ మొదలైనటువంటి రోజు నుంచి కూడా దేశంలో ఈ SIR ప్రాక్టీస్ పైన అనేక రకాల చర్చలు భిన్నభిప్రాయాలు వాదనలు చూస్తున్నాం వాటిని నేపథ్యంలో ఈ ప్రక్రియ గురించి నా కోణంలో మీ ముందుకు.
ఈ SIR ప్రక్రియ అనేటువంటిది దేశంలో ఇప్పటివరకు 1951 నుంచి 2024 ఎన్నికల వరకు దాదాపుగా 8సార్లు ఈ SIR ప్రక్రియను ECI(Election Commission of India )నిర్వహించడం జరిగింది
అనే సమాచారం చివరిసారిగా ఈ SIR ప్రక్రియ 2002 - 2004 మధ్యలో కూడా జరిగింది.
ఈ SIR ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకున్నటువంటి ఎలక్టరోల్ రోల్స్ రివిజన్ లేదా ఆడిట్ చేయడం. .
ఎలక్టరోల్ రోల్స్ లో ఉన్నటువంటి ఎంట్రీస్ అన్ని
ఖచ్చితమైనటువంటివా? లేక ఏమైనా లోపాలు ఉన్నాయా ? అనేటువంటి కోణంలో జరిగే ప్రక్రియనే ఈ SIR ప్రాక్టీస్.
దాదాపు దేశంలో ఇప్పటివరకు నిర్వహించినటువంటి ఈ SIR ప్రక్రియ ద్వారా 50 కోట్ల పైగా ఓటర్లు ఈ సార్ ప్రక్రియ లో ఆడిట్ జరిగింది వాటి నుంచి దాదాపుగా మూడున్నర కోట్ల వరకు ఓట్లను తొలగించారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం(దాదాపు 7 శాతం).
ఆ తొలగించినటువంటి ఓట్లలో అనేక ఓట్లు డూప్లికేట్ ఓట్లు లేదా చనిపోయిన వారి ఓట్లు లేదా విదేశాల్లో ఉన్నటువంటి వారు లేదా ఇతర డాకుమెంట్స్ లేని కారణాల ద్వారా తొలగించడం జరుగుతున్నది.
ఏప్రిల్ నెలలో తమిళనాడు మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ మధ్యనే అక్కడ SIR ప్రక్రియ జరిగింది అక్కడ కూడా దాదాపుగా తమిళనాడులో 97 లక్షల ఓట్లు, పశ్చిమ బెంగాల్లో 63 లక్షల ఓట్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగించడం మనందరికీ తెలిసిందే.
ఈ మూడో విడతలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ SIR ప్రక్రియ నిర్వహించబోతున్నారు దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.3 కోట్ల పైన ఓటర్లు ఉన్నారు.
ఈ SIR ప్రక్రియ ద్వారా దాదాపుగా ఎంత లేదనుకున్న ఒక 10% వరకు ఓట్లు తొలగించేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాలు మనకు కనపడుతున్నాయి అంటే దాదాపుగా రెండు రాష్ట్రాల్లో కలిపి 70 లక్షల ఓట్ల పైననే తొలగించేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఒక ప్రాథమిక అంచనాగా మనకు తెలుస్తుంది.
ఇంకా రాజకీయంగా ఈ SIR ప్రక్రియ పైన దేశంలో అనేక ఆరోపణలు అనేక విమర్శలు కూడా చూస్తున్నాం SIR ప్రక్రియకు మేము వ్యతిరేకం కాదు కానీ ఇంత తొందరగా SIR ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం ఏముంది ?
ఈ ప్రక్రియ చాలా సున్నితంగామైంది కనుక
పారదర్శకంగా, ఒక క్రమ పద్ధతిలో జరగాలి
కానీ ఇంత హడావుడిగా చేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది? అంటూ ప్రధాన ప్రతిపక్ష అయినటువంటి కాంగ్రెస్ మరియు ఇతర విపక్షాలు మాట్లాడడం చూస్తున్నాం.
మరొకవైపు ఈ SIR ప్రక్రియ ద్వారా అనేకమంది అర్హులైనటువంటి ఓటర్లను కూడా తొలగించడం జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఈ ప్రాక్టీస్ లో మనకు బిఎల్వోలు మరియు బిఎల్ఏలు, ఈఆర్వోలు తర్వాత డిస్టిక్ ఎలక్ట్రిక్ ఆఫీసర్ మరియు రాష్ట్రా సీఈఓ లు ఇలా చాలామంది పర్యవేక్షణలో జరుగుతూంది.
ఈ SIR ప్రక్రియలో ముఖ్యంగా కీలకపాత్ర BLO లది అంటే ఈ బిఎల్ఓ ల ద్వారా మనకు EF (Enumeration Form ) ఇస్తారు ఆ ఫామ్స్ లో మనము మన గత సమాచారాన్ని ఫిల్ చేసి తిరిగి వాళ్లకి ఇవ్వడం వాళ్ల ద్వారా ఆడిట్ జరిగి కొత్తగా ఎలక్ట్రోరల్ రోల్స్ అనేవి ప్రిపేర్ చేయబడతాయి.
మొదట డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్స్ మనకు స్థానికంగా ఉన్నటువంటి ERO గారు మనకు అందుబాటులో ఉంచుతారు అందులో మనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనము పైన డిస్టిక్ ఆఫీసర్ కి అప్పీల్ చేయవచ్చు తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా అప్పీల్ చేయవచ్చు ఇలా ఈ ప్రాసెస్ ఉంటుంది.
ముఖ్యంగా ఇక్కడ BLO తో పాటు స్థానికంగా మనకు BLA లు కూడా ఉంటారు అంటే BLA అనేటువంటి వ్యక్తి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతను కూడా ఈ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ఏవైనా ఈ యొక్క SIR ప్రాక్టీస్ లో లోపాలు ఉంటే కచ్చితంగా ఈ BLA లు అధికారులును ప్రశ్నిస్తూ ఎలక్ట్రోరల్ రోల్స్ లో లోపాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత వీళ్లకు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ BLO ,BLA ల సమన్వయం చాలా కీలకము అనేది నా భావన.
ఇంకా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్లు కచ్చితంగా ఈ SIR ప్రాక్టీస్ జరిగేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా లేదా వాళ్ళ బంధువుల ద్వారా లేదా వాళ్ళ గ్రామస్తుల ద్వారా మన సమాచారాన్ని ఆ ఫామ్స్ లో నింపి ఆ ఫామ్స్ ను వాళ్లకు సరైన సమయంలో అందించాల్సి ఉంటుంది లేనియెడల కచ్చితంగా వాళ్ళు మనల్ని మైగ్రేటర్ ఓటర్ లేదా అందుబాటులో లేరని లేదా ఇతర కారణాలతో మన ఓటు తొలగించేటువంటి అవకాశాలుంటాయి కనుక ఈ SIR ప్రక్రియ మొదలైన తర్వాత కచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని తమ ఓటును కాపాడుకోవాలని మరియు కొత్త వారు నమోదు కూడా చేసుకోవాలి అని నా సూచన.
మనదేశంలో మొదటిసారి 1951 లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజు మన దేశ జనాభా దాదాపుగా 36 కోట్లు మరియు ఓటర్ల సంఖ్య 17 కోట్లు ఉండేవి ఆ రోజుల్లో మన దేశంలో అక్షరాస్యత శాతం కేవలం 15 శాతమే అలాంటి సందర్భంలోనే ఎన్నికలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి నేపథ్యం మన సొంతం.
నేడు దాదాపుగా దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు దేశ జనాభా 140 కోట్లు, ఎంతో సాంకేతికత అభివృద్ధి చెందింది మరియు అక్షరాస్యత 78 శాతం ఉన్నా కూడా ఎన్నికల నిర్వహణ పైన అనేక నీలి నీడలు అనేక అనుమానాలు వ్యక్తం చేయడం చూస్తున్నాం కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఆ కార్యక్రమాలను ఎంతో నిజాయితీగా మరియు నిబద్దత తో నిర్వహించాల్సి ఉంటుంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు నిత్యం చూస్తున్నాం ముఖ్యంగా 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత ఈ అంశాలు తారాస్థాయికి చేరడం ఒకవైపు తెల్సిందే కాబట్టి ఎన్నికల కమిషన్ ఏ కార్యక్రమాలు తీసుకున్న వాటిని ఎంతో నిబద్ధతగా మరియు నిజాయితీగా చేయాలి అనేటువంటి చర్చ ఒకవైపు ఉంది కనుక ఇలాంటి సమయంలో SIR ప్రక్రియ చాలా కీలకము అనే భావన.
సాధారణంగా ఎవరైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ల పేరు ఖచ్చితంగా ఎలక్ట్రోరల్ రోల్స్ లో ఉంటేనే వాళ్ళు ఓటు హక్కుకు అర్హులు కనుక ఇలాంటి అంశాలు చాలా సున్నితమైనవి ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకం కాబట్టి ఈ ప్రక్రియ చాలా నిజాయితీగా జరగాలి మరియు ఇతర రాజకీయ పక్షాల నుంచి గాని సమాజం నుంచి ఏవైనా అనుమానాలు వచ్చినప్పుడు వాటిని కచ్చితంగా ECI ఆన్సర్ చేయాలి అన్నీ డాకుమెంట్స్ సరైన సమయంలో పబ్లిక్ డోమైన్ లో పెట్టాలి అనేది నా భావన.