Ramnath kampamalla

Ramnath kampamalla I am doing analysis on political, economical social issues as well as policies and burnig topics

I wanted to respond on all social and political issues and to awareness of citizens.

అదిగో ద్వారక అలమందలవిగో - వేటూరిఒకసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళుతున్న విధానం మీద ఆనాడు జర్నలిస్ట్ గా ఉన్న వేటూరి గారు ...
19/05/2026

అదిగో ద్వారక అలమందలవిగో -
వేటూరి

ఒకసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వెళుతున్న విధానం మీద ఆనాడు జర్నలిస్ట్ గా ఉన్న వేటూరి గారు ఇలా వ్యంగ్యంగా రాశారు అనే అంశాలు గూర్చి కొంత అవగాహన ఉంది.(నాడు ఆయన మీద అందరు గొడవ చేస్తే నాకు స్పీకర్ గా ఉన్న శ్రీ బీవీ సుబ్బరెడ్డి గారు ఆయన మాటల్లోని భావాన్ని మీరు తీసుకోవాలి అంటూ వేటూరి గారికి మద్దతుగా ఉన్నారు అని విన్నాను ).

గతంలో అసెంబ్లీ సమావేశాలుకు తమ నియోజకవర్గల నుంచి RTC లో ప్రయాణం చేసినవారు ఎందరో ఎమ్మెల్యేలను చూసాం చాలా మంది నాయకులు సాధారణ జీవితం గడిపిన వాళ్ళను మరియు ఎక్కడ చిన్న అవీనీతి లేకుండా ప్రజలకు జవాబుదారి ఉంటూ ఆదర్శంగా ఉన్నవారు చరిత్రలో ఎందరో.🙏

ఆ రోజుల్లో కొందరు నాయకులు పార్లమెంట్ సమావేశాలకు నిత్యం సైకిల్ లేదా బస్సు లేదా
ఆటోలో వెళ్లడం చదివాను నాడు అది ఒక వార్త కాదు కేవలం ప్రజాధనం మరియు ప్రజలకు జవాబుదారిగా జీవించడం మరియు బాధ్యత ఉండాలి అనే కోణం ఆనాటి తరంలో ఉండేది.

నేడు దుబారా లేదా ఆడంబరాల విష్యల్లో ఎవరు తక్కువకాదు ఎక్కువకాదు కేవలం ముందు వెనుక అనే భావన, ఇక్కడ కూడా కొందరు ఆదర్శ నాయకులు ఉన్నారు ఈ మధ్యనే చూసాం (కేరళ మాజీ సీఎం అద్దె ఇంటికి మారడం రాజీనామా ఇచ్చిన వెంటనే పార్టీ వాహనంలో ఇంటికి వెళ్లడం .)

కోసమేరుపు: ఎదో అంతర్జాతీయంగా నెలకొన్న సరఫరా అంతరాయం లేదా పరిస్థితులు అనుకూలంగా లేవనో లేదా మా నాయకుడు పిలుపు ఇచ్చాడాన్నో ముక్కుబడిగా ఆచరించడం సమస్యకు పూర్తిస్తాయి పరిస్కారం కాదు సుమా! ప్రజాధనం మీద జవాబుదారితనం అనేది సొంతంగా నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికి ఉండాలి తప్ప ఆదినాయకూడు చెబితే వచ్చేదా మిత్రమా!

02/05/2026

రాబోవు May 7 తేదీ కి ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది పూర్తి అవుతున్న వేళ, మన నిఘా సంస్థల సమాచారం ప్రకారం పాకిస్తాన్ మళ్ళీ మన మీద దాడులు చేసే అవకాశం !అనే వార్తల నేపథ్యంలో ఉదయం 99టీవీ బిగ్ డిబేట్లో నాభావన క్లుప్తంగా..

17/04/2026

పార్లమెంట్లో వాడి వేడిగా కొనసాగుతున్న డీలిమిటేషన్ చర్చ..

డీలిమిటేషన్ అంశాలపై ఉదయం మార్నింగ్ డిబేట్లో నా భావన సూటిగా తెలియజేయడం జరిగింది. ..

డిలీమిటేషన్ వలన కలిగే ప్రయోజనాలు మరియ ఆందోళనలు ఏమిటీ? తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి హైబ్రిడ్ ఫార్ములా ఎందుకు మిస్...
17/04/2026

డిలీమిటేషన్ వలన కలిగే ప్రయోజనాలు మరియ ఆందోళనలు ఏమిటీ? తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి హైబ్రిడ్ ఫార్ములా ఎందుకు మిస్ ఫైర్ అనే అంశాల్లో నా భావన సూటిగా..

రేవంత్ హైబ...

తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన BJP పార్టీ అనే వార్తలు చూసిన నేపథ్యంలో..డీలిమిటేషన్ ప్రక్రియ ,మహిళా రిజర్వేషన్ బిల్లుల...
12/04/2026

తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన BJP పార్టీ అనే వార్తలు చూసిన నేపథ్యంలో..

డీలిమిటేషన్ ప్రక్రియ ,మహిళా రిజర్వేషన్ బిల్లుల అమలు కొరకు వేగంగా పావులు కదుపుతున్న అధికార పార్టీ అనే భావన.(డీలిమిటేషన్ ప్రక్రియ 50% పెంపు ఆధారంగా అనే వార్తల నేపథ్యంలో)

డీలిమిటేషన్ ప్రక్రియ వలన దక్షిణాది రాష్ట్రాలకు చాలా నష్టం అనేటువంటి కథనాలు మరియు తమిళనాడు రాష్ట్రాము చేసిన పోరాటలు కేసులు ఇలా ఎన్నో చూసిన నేపథ్యంలో మీ ముందుకు నా భావన.

ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా దాదాపుగా 24% అంటే 131 స్థానాలు మనం కలిగి ఉన్నాం.

డీలిమిటేషన్ తర్వాత 816 పార్లమెంటు స్థానాలు వాటిలో దక్షిణాది రాష్ట్రాల వాటా 24 % అలాగే కొనసాగుతుంది అంటే దాదాపుగా 196 స్థానాలు.

డీలిమిటేషన్ ప్రక్రియ జనాభా ప్రాతిపదికతన జరిగితే ఖచ్చితంగా సౌత్ ఇండియాకు తక్కువ సీట్లు వచ్చే అవకాశం అలాగే నార్త్ ఇండియాకు సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది అనే వాదనలు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర నాయకుల నుంచి ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రం నుంచి గతంలో చూసాం.

బిజెపిలోని కీలక నాయకులు కూడా అలాంటి నష్టం రాకుండా మార్గం ఉంది అంటూ గతంలో వాళ్ళ కౌంటర్ చూసాం.

నేడు వాటికి అనుగుణంగానే జనాభా ఆధారంగా కాకుండా కేవలం 50% శాతం సమానంగా దేశవ్యాప్తంగా పెంచడం చూస్తే (Pro rata గా పెంచడం ) గతంలో మనకు ఏవిధమైనటువంటి వాటా ఉందో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి వాటా 196 స్థానాల రూపంలో ఉంటుంది అనేది మనకు బయటికి కనపడుతున్నటువంటి ఒక స్వరూపం..

ఈ ప్రక్రియ ఫెడరల్ స్ఫూర్తి కి విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది అనేటువంటి భావనలు అక్కడక్కడ వినపడుతున్నాయి వాటికి కారణం ఏంటంటే..

ఈ డీలిమిటేషన్ ప్రక్రియను డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు ద్వారా ఒక స్వయం ప్రతిపత్తి గల కమిషన్ ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తారు గతంలో కూడా ఈ డీలిమిటేషన్ కమిషన్ నాలుగు సార్లు మన దేశంలో ఈ ప్రక్రియ చేసింది అంటే ముఖ్యంగాఈ కమిషన్ యొక్క ఉద్దేశం నియోజకవర్గ హద్దులు నిర్ణయాలు చేయడం..

ఇక్కడ కీలకం నియోజకవర్గాల హద్దులు నిర్ణయం చేయడంలో ఆయా రాష్ట్రాల యొక్క పాత్ర మరియు డీలిమిటేషన్ కమిషన్ యొక్క పాత్ర ఉంటుంది కనుక ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్లకు అనుగుణంగా ఈ నియోజకవర్గం యొక్క హద్దులు నిర్వహించబడతాయి అలా వాళ్ల అనుకూలమైనటువంటి జనాభా కులాల వర్గాల ఆధారంగా పోలరైజేషన్ కోణంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనేది ప్రతిపక్ష పార్టీల వాదన.

1952 నుంచి మన పార్లమెంట్ ఎన్నికలను మనం పరిశీలిస్తే కేవలం నెహ్రూ ఇందిరా రాజీవ్ వాళ్ళ ఆధ్వర్యంలోనే పూర్తిస్థాయి మెజారిటీలు రావడం కనపడింది తర్వాత 1991 నుంచి ఎక్కువసార్లు సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరిగినా కూడా కచ్చితంగా ప్రాంతీయ పార్టీల అవసరం ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడటం ఉంటుంది అనేది నా భావన..

ఒకవేళ జనాభా ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగే జరిగి ఉంటే కచ్చితంగా మనలాంటి రాష్ట్రాలు ఇంకా ఎక్కువ నష్టపోయేవి కాబట్టి ఈ 50% ఫార్ములా అమలు చేయడం వల్ల గతంలో ఏ విధమైనటువంటి వాటా మనకు పార్లమెంట్లో ఉంటుందో అదే వాటా మనం కలిగి ఉంటాము సాంకేతికంగా.

ఈ సందర్భంగా రాబోయేటువంటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం ప్రవేశపెట్టేటువంటి బిల్లులు మరియు రాజ్యాంగ సవరణ ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఉన్న ఆటంకాల మీద కాస్త అవగాహన కొరకు సమాచారం క్రింద లింక్ ఇస్తున్నాను.

Parliament will hold a special session to amend the women's reservation law from April 16-18. The government aims to implement the Nari Shakti Vandan Adhiniyam from the 2029 general elections. Proposed changes will delink the quota from a future Census and delimitation. This will allow women's reser...

త్వరలో మూడో విడత SIR (Special Intensive Revision) ప్రక్రియ దేశంలోని 22 రాష్ట్రాల్లో మొదలు కాబోతుంది అనేటువంటి వార్తల నేప...
07/03/2026

త్వరలో మూడో విడత SIR (Special Intensive Revision) ప్రక్రియ దేశంలోని 22 రాష్ట్రాల్లో మొదలు కాబోతుంది అనేటువంటి వార్తల నేపథ్యంలో.

గతంలో మొదట బీహార్ రాష్ట్రంలో తర్వాత రెండో విడత దేశంలోని 12 రాష్ట్రాల్లో SIR ప్రక్రియను ECI నిర్వహించడం మనందరికీ తెలిసిందే.

ఈ SIR ప్రక్రియ మొదలైనటువంటి రోజు నుంచి కూడా దేశంలో ఈ SIR ప్రాక్టీస్ పైన అనేక రకాల చర్చలు భిన్నభిప్రాయాలు వాదనలు చూస్తున్నాం వాటిని నేపథ్యంలో ఈ ప్రక్రియ గురించి నా కోణంలో మీ ముందుకు.

ఈ SIR ప్రక్రియ అనేటువంటిది దేశంలో ఇప్పటివరకు 1951 నుంచి 2024 ఎన్నికల వరకు దాదాపుగా 8సార్లు ఈ SIR ప్రక్రియను ECI(Election Commission of India )నిర్వహించడం జరిగింది
అనే సమాచారం చివరిసారిగా ఈ SIR ప్రక్రియ 2002 - 2004 మధ్యలో కూడా జరిగింది.

ఈ SIR ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకున్నటువంటి ఎలక్టరోల్ రోల్స్ రివిజన్ లేదా ఆడిట్ చేయడం. .

ఎలక్టరోల్ రోల్స్ లో ఉన్నటువంటి ఎంట్రీస్ అన్ని
ఖచ్చితమైనటువంటివా? లేక ఏమైనా లోపాలు ఉన్నాయా ? అనేటువంటి కోణంలో జరిగే ప్రక్రియనే ఈ SIR ప్రాక్టీస్.

దాదాపు దేశంలో ఇప్పటివరకు నిర్వహించినటువంటి ఈ SIR ప్రక్రియ ద్వారా 50 కోట్ల పైగా ఓటర్లు ఈ సార్ ప్రక్రియ లో ఆడిట్ జరిగింది వాటి నుంచి దాదాపుగా మూడున్నర కోట్ల వరకు ఓట్లను తొలగించారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం(దాదాపు 7 శాతం).

ఆ తొలగించినటువంటి ఓట్లలో అనేక ఓట్లు డూప్లికేట్ ఓట్లు లేదా చనిపోయిన వారి ఓట్లు లేదా విదేశాల్లో ఉన్నటువంటి వారు లేదా ఇతర డాకుమెంట్స్ లేని కారణాల ద్వారా తొలగించడం జరుగుతున్నది.

ఏప్రిల్ నెలలో తమిళనాడు మరియు పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో జరగబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ మధ్యనే అక్కడ SIR ప్రక్రియ జరిగింది అక్కడ కూడా దాదాపుగా తమిళనాడులో 97 లక్షల ఓట్లు, పశ్చిమ బెంగాల్లో 63 లక్షల ఓట్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగించడం మనందరికీ తెలిసిందే.

ఈ మూడో విడతలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ SIR ప్రక్రియ నిర్వహించబోతున్నారు దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.3 కోట్ల పైన ఓటర్లు ఉన్నారు.

ఈ SIR ప్రక్రియ ద్వారా దాదాపుగా ఎంత లేదనుకున్న ఒక 10% వరకు ఓట్లు తొలగించేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనాలు మనకు కనపడుతున్నాయి అంటే దాదాపుగా రెండు రాష్ట్రాల్లో కలిపి 70 లక్షల ఓట్ల పైననే తొలగించేటువంటి అవకాశాలు ఉన్నట్లు ఒక ప్రాథమిక అంచనాగా మనకు తెలుస్తుంది.

ఇంకా రాజకీయంగా ఈ SIR ప్రక్రియ పైన దేశంలో అనేక ఆరోపణలు అనేక విమర్శలు కూడా చూస్తున్నాం SIR ప్రక్రియకు మేము వ్యతిరేకం కాదు కానీ ఇంత తొందరగా SIR ప్రక్రియ చేపట్టాల్సినటువంటి అవసరం ఏముంది ?

ఈ ప్రక్రియ చాలా సున్నితంగామైంది కనుక
పారదర్శకంగా, ఒక క్రమ పద్ధతిలో జరగాలి
కానీ ఇంత హడావుడిగా చేయాల్సినటువంటి అవసరం ఏమి వచ్చింది? అంటూ ప్రధాన ప్రతిపక్ష అయినటువంటి కాంగ్రెస్ మరియు ఇతర విపక్షాలు మాట్లాడడం చూస్తున్నాం.

మరొకవైపు ఈ SIR ప్రక్రియ ద్వారా అనేకమంది అర్హులైనటువంటి ఓటర్లను కూడా తొలగించడం జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఈ ప్రాక్టీస్ లో మనకు బిఎల్వోలు మరియు బిఎల్ఏలు, ఈఆర్వోలు తర్వాత డిస్టిక్ ఎలక్ట్రిక్ ఆఫీసర్ మరియు రాష్ట్రా సీఈఓ లు ఇలా చాలామంది పర్యవేక్షణలో జరుగుతూంది.

ఈ SIR ప్రక్రియలో ముఖ్యంగా కీలకపాత్ర BLO లది అంటే ఈ బిఎల్ఓ ల ద్వారా మనకు EF (Enumeration Form ) ఇస్తారు ఆ ఫామ్స్ లో మనము మన గత సమాచారాన్ని ఫిల్ చేసి తిరిగి వాళ్లకి ఇవ్వడం వాళ్ల ద్వారా ఆడిట్ జరిగి కొత్తగా ఎలక్ట్రోరల్ రోల్స్ అనేవి ప్రిపేర్ చేయబడతాయి.

మొదట డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్స్ మనకు స్థానికంగా ఉన్నటువంటి ERO గారు మనకు అందుబాటులో ఉంచుతారు అందులో మనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మనము పైన డిస్టిక్ ఆఫీసర్ కి అప్పీల్ చేయవచ్చు తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా అప్పీల్ చేయవచ్చు ఇలా ఈ ప్రాసెస్ ఉంటుంది.

ముఖ్యంగా ఇక్కడ BLO తో పాటు స్థానికంగా మనకు BLA లు కూడా ఉంటారు అంటే BLA అనేటువంటి వ్యక్తి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇతను కూడా ఈ ప్రక్రియలో పాల్గొనడం ద్వారా ఏవైనా ఈ యొక్క SIR ప్రాక్టీస్ లో లోపాలు ఉంటే కచ్చితంగా ఈ BLA లు అధికారులును ప్రశ్నిస్తూ ఎలక్ట్రోరల్ రోల్స్ లో లోపాలు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత వీళ్లకు ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ BLO ,BLA ల సమన్వయం చాలా కీలకము అనేది నా భావన.

ఇంకా ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్లు కచ్చితంగా ఈ SIR ప్రాక్టీస్ జరిగేటప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా లేదా వాళ్ళ బంధువుల ద్వారా లేదా వాళ్ళ గ్రామస్తుల ద్వారా మన సమాచారాన్ని ఆ ఫామ్స్ లో నింపి ఆ ఫామ్స్ ను వాళ్లకు సరైన సమయంలో అందించాల్సి ఉంటుంది లేనియెడల కచ్చితంగా వాళ్ళు మనల్ని మైగ్రేటర్ ఓటర్ లేదా అందుబాటులో లేరని లేదా ఇతర కారణాలతో మన ఓటు తొలగించేటువంటి అవకాశాలుంటాయి కనుక ఈ SIR ప్రక్రియ మొదలైన తర్వాత కచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని తమ ఓటును కాపాడుకోవాలని మరియు కొత్త వారు నమోదు కూడా చేసుకోవాలి అని నా సూచన.

మనదేశంలో మొదటిసారి 1951 లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన రోజు మన దేశ జనాభా దాదాపుగా 36 కోట్లు మరియు ఓటర్ల సంఖ్య 17 కోట్లు ఉండేవి ఆ రోజుల్లో మన దేశంలో అక్షరాస్యత శాతం కేవలం 15 శాతమే అలాంటి సందర్భంలోనే ఎన్నికలను ఎంతో సమర్థవంతంగా నిర్వహించినటువంటి నేపథ్యం మన సొంతం.

నేడు దాదాపుగా దేశంలో 96 కోట్ల మంది ఓటర్లు దేశ జనాభా 140 కోట్లు, ఎంతో సాంకేతికత అభివృద్ధి చెందింది మరియు అక్షరాస్యత 78 శాతం ఉన్నా కూడా ఎన్నికల నిర్వహణ పైన అనేక నీలి నీడలు అనేక అనుమానాలు వ్యక్తం చేయడం చూస్తున్నాం కనుక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఆ కార్యక్రమాలను ఎంతో నిజాయితీగా మరియు నిబద్దత తో నిర్వహించాల్సి ఉంటుంది.


సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు నిత్యం చూస్తున్నాం ముఖ్యంగా 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత ఈ అంశాలు తారాస్థాయికి చేరడం ఒకవైపు తెల్సిందే కాబట్టి ఎన్నికల కమిషన్ ఏ కార్యక్రమాలు తీసుకున్న వాటిని ఎంతో నిబద్ధతగా మరియు నిజాయితీగా చేయాలి అనేటువంటి చర్చ ఒకవైపు ఉంది కనుక ఇలాంటి సమయంలో SIR ప్రక్రియ చాలా కీలకము అనే భావన.

సాధారణంగా ఎవరైతే ఓటు హక్కు ఉంటుందో వాళ్ల పేరు ఖచ్చితంగా ఎలక్ట్రోరల్ రోల్స్ లో ఉంటేనే వాళ్ళు ఓటు హక్కుకు అర్హులు కనుక ఇలాంటి అంశాలు చాలా సున్నితమైనవి ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా కీలకం కాబట్టి ఈ ప్రక్రియ చాలా నిజాయితీగా జరగాలి మరియు ఇతర రాజకీయ పక్షాల నుంచి గాని సమాజం నుంచి ఏవైనా అనుమానాలు వచ్చినప్పుడు వాటిని కచ్చితంగా ECI ఆన్సర్ చేయాలి అన్నీ డాకుమెంట్స్ సరైన సమయంలో పబ్లిక్ డోమైన్ లో పెట్టాలి అనేది నా భావన.

 #99టీవీ మార్నింగ్ బిగ్ డిబేట్లో కేంద్ర బడ్జెట్  మీద నా భావన క్లుప్తంగా. .
02/02/2026

#99టీవీ మార్నింగ్ బిగ్ డిబేట్లో కేంద్ర బడ్జెట్ మీద నా భావన క్లుప్తంగా. .

వ్యవసాయంరంగంపై అంత నిర్లక్ష్యమా ? బడ్జెట్‌ పై అనలిస్ట్ రియాక్షన్

కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీ దిగ్విజయ్ సింగ్ గారు చేసిన ట్విట్ మరియు పిక్ మీద ...
28/12/2025

కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవ సందర్బంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శ్రీ దిగ్విజయ్ సింగ్ గారు చేసిన ట్విట్ మరియు పిక్ మీద రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా చర్చ..

బీజేపీ లో ఎవరైనా ఉన్నత స్థాయిలోకి రాగలరు అనే కోణంలో మోడీ గారు సామాన్య కార్యకర్తగా ఉన్ననాటి పిక్ జాతచేశారు. .(క్రింద చూడగలరు ).

RSS BJP సంస్థగతంగా చాలా బలంగా ఉంది అనే కోణంలో. .

చరిత్ర చెబుతున్న నిజం. .

RSS BJP సుదీర్ఘ ప్రయాణంలో వాళ్ళునమ్మిన సిద్ధాంతల ద్వారా ఒక వ్యవస్థ నిర్మించుకోవడంలో విజయం సాధించారు అనుకోవాలి. (రాజ్యాధికారం అనే లక్ష్య సాధనలో మెజారిటీ కోణంలో )

అదే స్థాయిలో సుదీర్ఘ చరిత్ర ఉన్నా కాంగ్రెస్ పార్టీ కూడ ఎందుకు అలాంటి బలమైన వ్యవస్థ నిర్మించుకోలేకపోయిందో ?ఎక్కడ లోపాలు ఉన్నాయో? ఇన్ని ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నా ఆయనకు తెలియనిందా?

డిగ్గి రాజా. .కు అన్నీ తెలుసు..

ఇలా బహిరంగంగా చర్చకు పెట్టడం అంటే. .

లోగుట్టు ఏంటో? ? అనే చర్చ మరోవైపు. .

కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కనుక ఇలా ఓపెన్ గా మాట్లాడగలరు అనే కోణంలో చూడలా? లేక పూర్తిస్థాయిలో కాంగ్రెస్లో కూడా బలమైన వ్యవస్థ నిర్మాణం సమంతరంగా జరగాలి అనే సూచన?

నిర్మాణంత్మక చర్చలు సంఘర్షణ జరగాలి అప్పుడే మంచి విధానాలు వస్తాయి అనేది నిజం అది ప్రభుత్వమైన లేదా పార్టియినా? ?

ఈ చర్చ కూడా మంచిదే అనేది నా భావన. .

ఈరోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చవాన్ గారు VB G RAM G చట్టం మీద రాసిన కథనం పత్రికలో చదివిన అ...
20/12/2025

ఈరోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చవాన్ గారు VB G RAM G చట్టం మీద రాసిన కథనం పత్రికలో చదివిన అనంతరం నా ఆలోచనలు. .

పార్లమెంట్లో మరియు పార్లమెంటు బయట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఏ స్థాయిలో చర్చలు జరిగాయో మనందరికీ తెల్సిందే.

ఎవరు ఎలాంటి గందరగోళాలు చేసిన ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళు అనుకున్న విధంగా బిల్లులు పాస్ అవుతూ అవి చట్టాలుగా మారడం అనేటువంటిది మనకు ఉన్నా పార్లమెంటరీ ప్రక్రియ..

స్తులంగా విపక్ష సభ్యుల అభిప్రాయాలు ఇలా..

మహాత్మా గాంధీ పేరు తొలగింపు: పథకం నుండి గాంధీ పేరు తీసేయడం ఆయన వారసత్వానికి అవమానం అని ప్రతిపక్షం విమర్శించింది.

MGNREGA రద్దు: ఈ బిల్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) “చంపేస్తుంది” అని అన్నారు.

రాష్ట్రాలపై ఆర్థిక భారము: కొత్త చట్టం వల్ల ఖర్చు బాధ్యత రాష్ట్రాలపై పడుతుందని, కేంద్రం బాధ్యత తప్పించుకుంటుందని విమర్శించారు.

చర్చ లేకుండా తొందరగా ఆమోదం: బిల్లును రాత్రి వేళల్లో, తగినంత చర్చ లేకుండా ఆమోదించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

పేదలకు, రైతులకు వ్యతిరేకం: ఈ బిల్లు పేదలు, రైతులు, గ్రామీణ కార్మికుల జీవనోపాధికి హానికరమని ప్రతిపక్షం ధర్నాలు, వాక్‌అవుట్లు చేసింది.

స్తులంగా అధికార సభ్యుల అభిప్రాయాలు ఇలా..

MGNREGA లోపాలను సరిచేయడం: పాత పథకంలో చెల్లింపుల ఆలస్యం, అవినీతి, ఉత్పాదకత లోపాలు ఉన్నాయని, కొత్త బిల్లు వాటిని సరిచేస్తుందని ప్రభుత్వం చెప్పింది.

125 రోజుల ఉపాధి హామీ: MGNREGAలో 100 రోజులు మాత్రమే ఉండగా, కొత్త చట్టం 125 రోజుల గ్రామీణ ఉపాధి హామీ ఇస్తుందని చెప్పారు.

వికసిత భారత్ 2047 దృష్టికోణం: ఈ బిల్లు దేశ దీర్ఘకాల అభివృద్ధి ప్రణాళికలో భాగమని, గ్రామీణ ఉపాధి దేశ వృద్ధికి తోడ్పడుతుందని వాదించారు.

జీతాలకే కాకుండా జీవనోపాధి అభివృద్ధి: ఇది కేవలం రోజువారీ వేతనాలకే కాకుండా, స్వయం సహాయక సంఘాలు, నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.

బాధ్యత మరియు సమర్థత పెంపు: కొత్త వ్యవస్థ నిధుల లీకేజీలను తగ్గించి, పర్యవేక్షణను మెరుగుపరచి, నిధులు సక్రమంగా వినియోగించబడతాయని ప్రభుత్వం వాదించింది.

నాకు ఉన్నా ఆలోచనలు. ..

వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద చాలా రాష్ట్రాలలో ఎక్కువ అనుకూలతలు ఉన్నప్పటికీ అక్కడక్కడ రైతులలో గ్రామాలలో పనిచేసేటువంటి వాళ్ళల్లో ఒక వ్యతిరేకత ఉంది. .

ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయం యొక్క అవసరాలకు మరియు అనుబంధ పనులకు వాడాలి అనే డిమాండ్. .

అనేక గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద కేవలం ఏదో ఉదయం కాసేపు అలా వెళ్లి మట్టి తీసి ఇంటికి వస్తున్నారు ఎంతో కొంత వచ్చిన కాడికి అనేటువంటి కోణంలోనే ఈ పథకం ఉంది తప్ప నిర్మాణాత్మకమైనటువంటి మార్పు
కానీ ఒక శాశ్వతమైనటువంటి పనుల అమలు లేదు అనేటువంటిది కూడా చాలామంది అభిప్రాయం..

ఈ పథకం అక్రమాలు అంటే అసలైన అర్హులే పనులు చేస్తున్నారా? లేకుంటే కొంత ఆర్థికంగా బాగున్న వాళ్ళు కూడా ఇందులో లబ్ధి పొందుతున్నారా ?అసలు పని చేయకుండా కూడా కొందరు బిల్లులు పొందుతున్నారా? ఇలాంటి ఆరోపణలు కూడా అనేక చోట్ల వింటున్నాము ..

ఈ పథకం లో అక్రమాలు లేదా నిర్మాణాత్మక అంశాలను మనం కాసేపు పక్కన పెడితే దేశంలో ప్రతి పథకంలో కూడా అవినీతి ఏ స్థాయికి చేరింది అనేటువంటిది రాజకీయ నాయకుల ఆరోపణలు మనం చూసినప్పుడు తెలుస్తుంది వాళ్లు వీళ్ళ మీద 30% కమిషన్లను అని మాట్లాడుకోవడం తిరిగి మీరు మీ ప్రభుత్వం లో 40% కమిషన్లను అంటూ నిత్యం వింటూనే ఉన్నాం.

ఆన్లైన్ సిస్టం ద్వారా చెల్లింపులు వర్క్ kజరుగుతున్నాయి కాబట్టి కచ్చితంగా అమౌంట్ ఎవరైతే రిజిస్టర్ లో ఉంటారో వాళ్ళకి చేరుతున్నట్టుగా మనం భావించాలి ఇక్కడ పెద్ద స్థాయిలో అవినీతి జరిగేటువంటి అవకాశం చాలా తక్కువ..(కాకపోతే వర్క్ చేయకుండా కూడ చేసినట్లు ఆన్లైన్ లో ఫొటోస్ మార్పింగ్ చేయడం ద్వారా కూడ కొన్ని జరగడం ఆలా అవినీతి మరియు ఉత్పధాకత లేకపోవడం తెల్సిందే ).

సోషల్ సెక్యూరిటీ డేటా మీద పనిచేసిన వాడిగా నాకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే గ్రామీణ అభివృద్ధిలో ఆర్థిక భద్రత ఆర్థిక భరోసా చాలా ముఖ్యం ఇప్పటికీ కూడా మన దేశంలో దాదాపుగా 52 శాతం మందికి ఉపాధిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం.

అలాంటి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులు లేదా రైతు కూలీల కు అనుబంధంగా ఒక ఉపాధి ఏర్పరచడం అనేటువంటిది చాలా మంచి పథకంగా చూడాలి ఈ పథకం ద్వారా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగడం ఆ రకంగా వాళ్ళ యొక్క జీవనశైలిలో ఎంతో కొంత మార్పుకు ఉపయోగకరమైనది నా భావన.

స్థూలంగా ఈ పథకం ఎందుకు ఎక్కువ శాతం ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి అనేది చూస్తే కాసేపు గాంధీ మహాత్ముడి పేరు అనేటువంటి అంశాన్ని మనం పక్కన పెడితే..

ఈ పథకంలో 60 :40నిధుల కేటాయింపు విభజన ఏదైతే ఉందో దానివల్ల రాష్ట్రాల పైన ఎక్కువ భారం పడి ఈ పథకాన్ని రాష్ట్రాలు రేపొద్దున అమలు చేయడానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి ..

సహజంగా ఒక సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అన్నీ సమయంలో సబ్మిట్ చేస్తూ ఒక మెకానిజం ద్వారా మాత్రమే నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తాయా? లేదా అనేటువంటి అంశాల్లో కొంత ఛాలెంజెస్ ఉన్నాయి?

ఈ చట్టం వలన పనిలో పారదర్శకత పెరిగి మంచి మార్పులు వస్తాయా లేక పథకం అమలులో రాష్ట్రాలు విఫలం చెందుతాయా లేక కేంద్ర విధించిన కఠిన నిబంధనలు అమలు చేసి విజయం సాధిస్తాయా అంటే కాలమే సమాధానం? ?

https://prsindia.org/billtrack/the-viksit-bharat-%E2%80%93-guarantee-for-rozgar-and-ajeevika-mission-gramin-vb-%E2%80%93-g-ram-g-bill-2025

12/11/2025

ఈ మధ్యన ECI మీద ఆరోపణలు ఎక్కువ సార్లు వార్తల్లో నిలవడం చూస్తున్నాం కానీ నాకు ఉన్నా అవగాహనలో ECI మీద ఆరోపణాలు కొత్తకాదు అనే కోణంలో మరియు రాహుల్ గాంధీ గారి ఓటు చోరీ ఆరోపణ అంశాల్లో (BLO లోపాలు Electoral Rolls మీద ) ఈ రోజు ఉదయం బిగ్ డిబేట్ లో చాలా సూటిగా నా భావన..

Address

Hyderabad
500073

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramnath kampamalla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ramnath kampamalla:

Shortcuts

Share