20/12/2025
ఈరోజు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చవాన్ గారు VB G RAM G చట్టం మీద రాసిన కథనం పత్రికలో చదివిన అనంతరం నా ఆలోచనలు. .
పార్లమెంట్లో మరియు పార్లమెంటు బయట జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి ఏ స్థాయిలో చర్చలు జరిగాయో మనందరికీ తెల్సిందే.
ఎవరు ఎలాంటి గందరగోళాలు చేసిన ఎవరు ఎలాంటి అభ్యంతరాలు చెప్పినా ఎవరికైతే మెజారిటీ ఉంటుందో వాళ్ళు అనుకున్న విధంగా బిల్లులు పాస్ అవుతూ అవి చట్టాలుగా మారడం అనేటువంటిది మనకు ఉన్నా పార్లమెంటరీ ప్రక్రియ..
స్తులంగా విపక్ష సభ్యుల అభిప్రాయాలు ఇలా..
మహాత్మా గాంధీ పేరు తొలగింపు: పథకం నుండి గాంధీ పేరు తీసేయడం ఆయన వారసత్వానికి అవమానం అని ప్రతిపక్షం విమర్శించింది.
MGNREGA రద్దు: ఈ బిల్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGA) “చంపేస్తుంది” అని అన్నారు.
రాష్ట్రాలపై ఆర్థిక భారము: కొత్త చట్టం వల్ల ఖర్చు బాధ్యత రాష్ట్రాలపై పడుతుందని, కేంద్రం బాధ్యత తప్పించుకుంటుందని విమర్శించారు.
చర్చ లేకుండా తొందరగా ఆమోదం: బిల్లును రాత్రి వేళల్లో, తగినంత చర్చ లేకుండా ఆమోదించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
పేదలకు, రైతులకు వ్యతిరేకం: ఈ బిల్లు పేదలు, రైతులు, గ్రామీణ కార్మికుల జీవనోపాధికి హానికరమని ప్రతిపక్షం ధర్నాలు, వాక్అవుట్లు చేసింది.
స్తులంగా అధికార సభ్యుల అభిప్రాయాలు ఇలా..
MGNREGA లోపాలను సరిచేయడం: పాత పథకంలో చెల్లింపుల ఆలస్యం, అవినీతి, ఉత్పాదకత లోపాలు ఉన్నాయని, కొత్త బిల్లు వాటిని సరిచేస్తుందని ప్రభుత్వం చెప్పింది.
125 రోజుల ఉపాధి హామీ: MGNREGAలో 100 రోజులు మాత్రమే ఉండగా, కొత్త చట్టం 125 రోజుల గ్రామీణ ఉపాధి హామీ ఇస్తుందని చెప్పారు.
వికసిత భారత్ 2047 దృష్టికోణం: ఈ బిల్లు దేశ దీర్ఘకాల అభివృద్ధి ప్రణాళికలో భాగమని, గ్రామీణ ఉపాధి దేశ వృద్ధికి తోడ్పడుతుందని వాదించారు.
జీతాలకే కాకుండా జీవనోపాధి అభివృద్ధి: ఇది కేవలం రోజువారీ వేతనాలకే కాకుండా, స్వయం సహాయక సంఘాలు, నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన జీవనోపాధి అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు.
బాధ్యత మరియు సమర్థత పెంపు: కొత్త వ్యవస్థ నిధుల లీకేజీలను తగ్గించి, పర్యవేక్షణను మెరుగుపరచి, నిధులు సక్రమంగా వినియోగించబడతాయని ప్రభుత్వం వాదించింది.
నాకు ఉన్నా ఆలోచనలు. ..
వ్యక్తిగతంగా నాకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మీద చాలా రాష్ట్రాలలో ఎక్కువ అనుకూలతలు ఉన్నప్పటికీ అక్కడక్కడ రైతులలో గ్రామాలలో పనిచేసేటువంటి వాళ్ళల్లో ఒక వ్యతిరేకత ఉంది. .
ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయం యొక్క అవసరాలకు మరియు అనుబంధ పనులకు వాడాలి అనే డిమాండ్. .
అనేక గ్రామాలలో ఉపాధి హామీ పథకం కింద కేవలం ఏదో ఉదయం కాసేపు అలా వెళ్లి మట్టి తీసి ఇంటికి వస్తున్నారు ఎంతో కొంత వచ్చిన కాడికి అనేటువంటి కోణంలోనే ఈ పథకం ఉంది తప్ప నిర్మాణాత్మకమైనటువంటి మార్పు
కానీ ఒక శాశ్వతమైనటువంటి పనుల అమలు లేదు అనేటువంటిది కూడా చాలామంది అభిప్రాయం..
ఈ పథకం అక్రమాలు అంటే అసలైన అర్హులే పనులు చేస్తున్నారా? లేకుంటే కొంత ఆర్థికంగా బాగున్న వాళ్ళు కూడా ఇందులో లబ్ధి పొందుతున్నారా ?అసలు పని చేయకుండా కూడా కొందరు బిల్లులు పొందుతున్నారా? ఇలాంటి ఆరోపణలు కూడా అనేక చోట్ల వింటున్నాము ..
ఈ పథకం లో అక్రమాలు లేదా నిర్మాణాత్మక అంశాలను మనం కాసేపు పక్కన పెడితే దేశంలో ప్రతి పథకంలో కూడా అవినీతి ఏ స్థాయికి చేరింది అనేటువంటిది రాజకీయ నాయకుల ఆరోపణలు మనం చూసినప్పుడు తెలుస్తుంది వాళ్లు వీళ్ళ మీద 30% కమిషన్లను అని మాట్లాడుకోవడం తిరిగి మీరు మీ ప్రభుత్వం లో 40% కమిషన్లను అంటూ నిత్యం వింటూనే ఉన్నాం.
ఆన్లైన్ సిస్టం ద్వారా చెల్లింపులు వర్క్ kజరుగుతున్నాయి కాబట్టి కచ్చితంగా అమౌంట్ ఎవరైతే రిజిస్టర్ లో ఉంటారో వాళ్ళకి చేరుతున్నట్టుగా మనం భావించాలి ఇక్కడ పెద్ద స్థాయిలో అవినీతి జరిగేటువంటి అవకాశం చాలా తక్కువ..(కాకపోతే వర్క్ చేయకుండా కూడ చేసినట్లు ఆన్లైన్ లో ఫొటోస్ మార్పింగ్ చేయడం ద్వారా కూడ కొన్ని జరగడం ఆలా అవినీతి మరియు ఉత్పధాకత లేకపోవడం తెల్సిందే ).
సోషల్ సెక్యూరిటీ డేటా మీద పనిచేసిన వాడిగా నాకు ఉన్నటువంటి అనుభవం ఏంటంటే గ్రామీణ అభివృద్ధిలో ఆర్థిక భద్రత ఆర్థిక భరోసా చాలా ముఖ్యం ఇప్పటికీ కూడా మన దేశంలో దాదాపుగా 52 శాతం మందికి ఉపాధిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం.
అలాంటి వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి రైతులు లేదా రైతు కూలీల కు అనుబంధంగా ఒక ఉపాధి ఏర్పరచడం అనేటువంటిది చాలా మంచి పథకంగా చూడాలి ఈ పథకం ద్వారా వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగడం ఆ రకంగా వాళ్ళ యొక్క జీవనశైలిలో ఎంతో కొంత మార్పుకు ఉపయోగకరమైనది నా భావన.
స్థూలంగా ఈ పథకం ఎందుకు ఎక్కువ శాతం ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి అనేది చూస్తే కాసేపు గాంధీ మహాత్ముడి పేరు అనేటువంటి అంశాన్ని మనం పక్కన పెడితే..
ఈ పథకంలో 60 :40నిధుల కేటాయింపు విభజన ఏదైతే ఉందో దానివల్ల రాష్ట్రాల పైన ఎక్కువ భారం పడి ఈ పథకాన్ని రాష్ట్రాలు రేపొద్దున అమలు చేయడానికి ఎన్నో ఆటంకాలు ఉంటాయి ..
సహజంగా ఒక సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అన్నీ సమయంలో సబ్మిట్ చేస్తూ ఒక మెకానిజం ద్వారా మాత్రమే నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తాయా? లేదా అనేటువంటి అంశాల్లో కొంత ఛాలెంజెస్ ఉన్నాయి?
ఈ చట్టం వలన పనిలో పారదర్శకత పెరిగి మంచి మార్పులు వస్తాయా లేక పథకం అమలులో రాష్ట్రాలు విఫలం చెందుతాయా లేక కేంద్ర విధించిన కఠిన నిబంధనలు అమలు చేసి విజయం సాధిస్తాయా అంటే కాలమే సమాధానం? ?
https://prsindia.org/billtrack/the-viksit-bharat-%E2%80%93-guarantee-for-rozgar-and-ajeevika-mission-gramin-vb-%E2%80%93-g-ram-g-bill-2025