27/08/2026
*రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ*
*రోటరీ పిల్లల పార్క్ ప్రారంభోత్సవం*
గుడివాడ, ఆగస్టు 27, 2026:
రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఆధ్వర్యంలో, గుడ్లవల్లేరు మండలం గురజ గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మించిన “రోటరీ పిల్లల పార్క్” ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు.
దివంగత శ్రీ యలమంచిలి వీర రాఘవయ్య గారు మరియు శ్రీమతి లక్ష్మీకాంతమ్మ గారి స్మారకార్థం, వారి కుమారుడు, రోటరీ పూర్వ అధ్యక్షులు శ్రీ యలమంచిలి నాగేశ్వరరావు గారి సహకారంతో 2025–26 రోటరీ సంవత్సరంలో ఈ పిల్లల పార్కును నిర్మించారు.
సుమారు రూ.80,000/- వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పార్కును 27-08-2026 గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు ఆటవిడుపుతో పాటు శారీరక, మానసిక ఉల్లాసాన్ని అందించే విధంగా పార్కును తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమంలో IPP Rtn. యలమంచిలి నాగేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షులు Rtn. గుళ్ళపల్లి కిరణ్ బాబు, కార్యదర్శి Rtn. గండు నరేష్, కోశాధికారి Rtn. కొల్లి శ్రీనివాసరావు, Rtn. బలుసు శంకరరావు, Rtn. అట్లూరి జనార్ధన ప్రసాద్, Rtn.ఆవుల మారుతీ కుమార్ మరియు ఇతర రోటరీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్యకరమైన వికాసానికి ఆటలు ఎంతో అవసరమని, పాఠశాలల్లో ఇటువంటి సదుపాయాల కల్పన పిల్లల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తుందని రోటరీ ప్రతినిధులు పేర్కొన్నారు.
కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, రోటరీ సభ్యులు మరియు ప్రతి ఒక్కరికీ రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ కృతజ్ఞతలు తెలిపింది.
*Rotary Club of Gudivada
Create Lasting Impact*