03/06/2026
గుంటూరు నగరంలో అత్యాధునిక వైద్య సేవలకు కొత్త కేంద్రంగా నిలిచిన 'లలితా పీవీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' ఆసుపత్రిని సీఎం చంద్రబాబు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి వైద్య సేవలు మరియు సౌకర్యాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.